Covid 19: ఇండియాలో కొత్తగా 14,506 కరోనా కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియాలో కరోనా కోరలు చాస్తోంది. గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య పెరిగింది. నెల క్రితం వరకు రోజూవారీ కేసుల సంఖ్య కేవలం 5 వేల లోపే ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితి మారింది. నెమ్మదిగా కేసుల సంఖ్య, యాక్టివ్ కేస్ లోడ్ పెరుగుతోంది. ఫోర్త్ వేవ్ ముంచుకొస్తుందా..? అని ప్రజలు భయపడుతున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 14,506 కరోనా కేసులు కొత్తగా నమోదు అయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి 30 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 99,602గా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 3.35గా నమోదు అయింది. 11,574 మంది వ్యాధి నుంచి రికవరీ అయ్యారు. దేశవ్యాప్తంగా ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాలను పరిశీలిస్తే కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి ఇండియాలో 525077 మంది వ్యాధి బారిన పడి మరణించగా.. 4,28,08,666 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 98.56గా ఉంది. డెత్ రేటు 1.21గా ఉంది.
Also Read
మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు దేశంలో అర్హులైన వారికి 197 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ ఇచ్చారు. నిన్న ఒక్క రోజే దేశంలోని 13,44,788 మందికి వ్యాక్సిన్ అందించారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?