Covid-19: దేశంలో కొత్తగా 2288 కరోనా కేసులు.. భారీగా తగ్గిన మరణాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనా వూహాన్ నగరంలో పురుడుపోసుకున్న కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాలపై ప్రభావం చూపించింది. దేశాల ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేసింది. ఇప్పటికీ ఏదో రూపంలో కరోనా మహమ్మారి ప్రజలను భయపెడుతూనే ఉంది. తన రూపాలను మార్చుకుంటూ… ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్, ఓమిక్రాన్ ఎక్స్ఈ ఇలా కొత్తకొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం చైనా వ్యాప్తంగా కరోనా కేసులు తీవ్రమవుతున్నాయి.
ఇదిలా ఉంటే ఇండియాలో మాత్రం కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతుండటం శుభపరిణామం. కేంద్ర ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2288 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. గత కొంత కాలంగా దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య మూడు వేలకు కిందే నమోదు అవతున్నాయి. మరణాల సంఖ్య కూడా చాలా వరకు తగ్గింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో బాధపడుతూ కేవలం 10 మంది మాత్రమే మరణించారు. 3044 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. ప్రస్తుతం దేశంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 19,637గా ఉంది. పాజిటివిటీ రేటు ఒకటి కన్నా తక్కువగా 0.47గా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా వల్ల 5,24,103 మంది మరణించారు. కరోనా నుంచి 4,25,63,949 మంది కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా అర్హులైన వారికి ఇప్పటి వరకు 190,50,86,706 డోసుల వ్యాక్సిన్ అందించారు.
Also Read
దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతుండటంతో ప్రజల్లో ఇమ్యూనిటీ పెరుగుతోంది. దీని కారణంగా సెకండ్ వేవ్ తో పోలిస్తే థర్డ్ వేవ్ తరువాత మరణాల సంఖ్య చాలా వరకు తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్తంగా 12-14 ఏళ్ల మధ్య ఉన్న 3 కోట్ల మంది మొదటి డోస్ వ్యాక్సినేషన్ తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. దేశంలో 2021, జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం అయింది. ముందుగా ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ఇవ్వగా… 2021 ఎప్రిల్ 1 నుంచి 45 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ఇవ్వడం ప్రారంభించారు. 2021 మే 1 నుంచి 18 ఏళ్లకు పైబడిన వారికి, 2022 జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల మధ్య వయసు వారికి, 2022 మార్చి 16 నుంచి 12-14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
-
Google Pixel 11a: గూగుల్ పిక్సెల్ 11a.. 8GB RAM, 120Hz డిస్ప్లే, Tensor G6 చిప్సెట్.. కొత్త ఫీచర్లు ఇవే!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Sonam Wangchuk: ‘‘ఇది రెండో స్వాతంత్య్ర ఉద్యమం’’ సోనమ్ వాంగ్చుక్ సందేశం
-
RC 17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!