Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో విషాదం.. సీనియర్ కాంగ్రెస్ నేత మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress’s Krishna Kumar Pandey dies during Rahul Gandhi-led Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో విషాదం చోటు చేసుకుంది. తెలంగాణ నుంచి మహారాష్ట్ర చేరుకున్న భారత్ జోడో యాత్రలో పాల్గొంటూ సీనియర్ కాంగ్రెస్ నేత మరణించారు. కాంగ్రెస్ సేవాదళ్ నాయకుడు కృష్ణ కుమార్ పాండే భారత్ జోడో యాత్రలో పాల్గొంటూ మంగళవారం మరణించారు. యాత్రలో కుప్పకూలిన కృష్ణ కుమార్ పాండేను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడే అతను మరణించినట్లు కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటనలో వెళ్లడించారు.
Read Also: Tamilisai Soundararajan: గవర్నర్ దగ్గర పెండింగ్లో పలు బిల్లులు.. తమిళిసై ఆగ్రహం
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
పాండే తన చివరి క్షణాల్లో, పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తో కలిసి త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని ఉన్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ వెల్లడించారు. అంబులెన్సులో అతడిని తరలించే సమయానికే అతను చనిపోయినట్లు జైరాం రమేష్ ట్వీట్ చేశారు. కృష్ణకుమార్ కరడుగట్టిన కాంగ్రెస్ వాది అని.. నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ను ఎదుర్కొనేవాడని ఆయన అన్నారు. పాండే మరణంపై రాహుల్ గాంధీ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి కృష్ణకాంత్ పాండే మరణం మొత్తం కాంగ్రెస్ కుటంబానికి బాధాకరమని.. ఆయన ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అతను తన చివరి క్షణంలో కూడా త్రివర్ణ పతాకాన్ని పట్టుకున్నాడని.. దేశం పట్ల ఆయనకున్న అంకితభావం మాకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తుందని రాహుల్ గాంధీ అన్నారు.
సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన రాహుల్ గాంధీ ‘‘ భారత్ జోడో యాత్ర’’ తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం మహారాష్ట్రలో జరుగుతోంది. నాందేడ్ జిల్లాలోని గురుద్వారాను సందర్శించిన రాహుల్ గాంధీ మంగళవారం యాత్రను పున: ప్రారంభించారు. మాజీ ముఖ్యమంత్రులు సుశీల్ కుమార్ షిండే, అశోక్ చవాన్, మహారాష్ట్ర పీసీసీ చీఫ్ నానా పటోలే, సీనియర్ నాయకులు బాలా సాహెబ్ థోరట్, మణిక్ రావు ఠాక్రే, నసీమ్ ఖాన్ పాల్గొన్నారు. దాదాపుగా 5 నెలల పాటు 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల గుండా 3570 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర జరగనుంది. జమ్మూ కాశ్మీర్ తో భారత్ జోడో యాత్ర ముగియనుంది.
कांग्रेस सेवा दल के महासचिव, कृष्णकांत पांडे जी का निधन पूरे कांग्रेस परिवार के लिए बहुत दुःखद है। उनके प्रियजनों को मैं अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूं।
आज, यात्रा के दौरान अंतिम समय में उन्होंने हाथों में तिरंगा थामा था। देश के लिए उनका समर्पण हमें सदा प्रेरणा देता रहेगा। pic.twitter.com/VvC1O5ZJfh
— Rahul Gandhi (@RahulGandhi) November 8, 2022
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!