JP Nadda – CJP Leaders: నడ్డాతో సీజేపీ నాయకుల భేటీ.. సీజేపీ డిమాండ్స్ ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JP Nadda – CJP Leaders: కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సీజేపీ నాయకుల సమావేశం ముగిసింది. తమ డిమాండ్లను ప్రభుత్వం శ్రద్ధగా విన్నదని, వాటిని పరిశీలిస్తుందనే నమ్మకం ఉందని సీజేపీ నేతలు వెల్లడించారు. సమావేశం ప్రశాంత వాతావరణంలో జరిగిందని, తమ ఆందోళనలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీజేపీ ప్రతినిధి బృందం జేపీ నడ్డాను కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించింది. అనంతరం వారు మాట్లాడుతూ.. చర్చలు సానుకూలంగా జరిగాయని, ప్రభుత్వం తమ సమస్యలపై త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
సమావేశం తర్వాత తమ మద్దతుదారులకు శాంతిని పాటించాలని సీజేపీ నేతలు కీలక విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతలను కాపాడుతూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న నిరసనకారులను బలవంతంగా తొలగించే ఆలోచన లేదని వర్గాల సమాచారం. ఈ సందర్భంగా వాళ్లు డిమాండ్స్ గురించి మాట్లాడుతూ.. సోనమ్ వాంగ్చుక్ను వెంటనే విడుదల చేయాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని లేదా కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రాణాలు కోల్పోయిన 20 మందికి పైగా నీట్ అభ్యర్థుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని స్పష్టం చేశారు.
Also Read
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
మరోవైపు జేపీ నడ్డా కూడా ఈ సమావేశంపై స్పందించారు. ఆదివారం ఉదయం నిరసనకారుల ప్రతినిధులతో చర్చలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఉదయం 11:50 గంటలకు మొదలైన చర్చల్లో మొదట మౌఖికంగా సమస్యలను విన్నామని, అనంతరం సాయంత్రం లిఖితపూర్వక వినతిపత్రంపై చర్చించామని పేర్కొన్నారు. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని తెలిపారు. నిరసనకారులు ఆందోళన విరమించి సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు సహకరించాలని జేపీ నడ్డా విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంపై కేంద్ర ప్రభుత్వం త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అందరి దృష్టి ప్రభుత్వ తదుపరి నిర్ణయంపైనే ఉంది.
आज सुबह पहली बार प्रदर्शनकारियों की ओर से सरकार के साथ बातचीत करने का प्रस्ताव आया और सुबह 11:50 AM से ही हमारी बातचीत जारी है।
सौहार्दपूर्ण वातावरण में मुलाकात हुई। उनके डेलीगेशन के साथ विस्तार से पहले मौखिक चर्चा हुई और उनके द्वारा लगभग 4 बजे मुझे लिखित याचिका दी गई।
मैंने… pic.twitter.com/HLCl20RBSp
— Jagat Prakash Nadda (@JPNadda) July 20, 2026
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..