Congress: కాంగ్రెస్ ‘ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్’ ఏర్పాటు.. పీకేపై మౌనం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కాంగ్రెస్ పని అయిపోయింది..! ఏ ఎన్నికలు జరిగినా ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోతున్నారు.. సీనియర్లు తిరుగుబాటు చేస్తున్నారు.. గట్టిగా ప్రభుత్వ వైఫల్యాలను కూడా నిలదీయలేని పరిస్థితి..! అంటే రకరకాల విమర్శలు ఎదుర్కొంటుంది ఆ పార్టీ.. అయితే, వరుస సమావేశాలు, సీనియర్లతో కూడా మంతనాలు జరిపి.. అందరినీ గాడీలోపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.. ఇదే సమయంలో, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో భేటీలు.. ఆయన ప్రతిపాదనలపై కీలక చర్చలు సాగుతున్నాయి.. అయితే, పీకే విషయంలో మాత్రం సమాధానం చెప్పడానికి కాంగ్రెస్ నేతలు మౌనం వహిస్తున్నారు.. ఆ ప్రశ్నలను దాటవేస్తున్నారు. ఇవాళ కూడా కొందరు సీనియర్లతో సమావేశం నిర్వహించారు సోనియా గాంధీ.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఆ పార్టీ నేత సుర్జేవాలా.. 8 మంది సభ్యులతో కూడిన కమిటీ.. నివేదికను ఏప్రిల్ 21న సోనియా గాంధీకి సమర్పించడం జరిగిందన్న ఆయన.. ఈ నివేదికపై ఈ రోజు కూలంకషంగా చర్చ జరిగిందన్నారు.. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం “ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్”ను ఏర్పాటు చేయాలని సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
Read Also: Harish Rao: ఎక్కడ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఇట్టే తెలిసిపోతుంది..
Also Read
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ఇక, మే 13, 14, 15 తేదీల్లో మూడు రోజుల పాటు “నవసంకల్ప్ చింతన్ శిబిర్” నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు రణదీప్ సింగ్ సూర్జేవాలా.. నవసంకల్ప్ చింతన్ శిబిర్లో దేశవ్యాప్తంగా మొత్తం 400 కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు పాల్గొంటారని.. వర్తమాన, సాంఘిక, రాజకీయ అంశాలపై చర్చలు సాగనున్నట్టు వెల్లడించారు.. బడుగు బలహీన వర్గాలు, రైతులు, మైనారిటీ, యవత ఎదుర్కుంటున్న సమస్యలపై ఇతర ప్రజా సమస్యలపై కూడా చర్చించనున్నట్టు తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిషోర్ పాత్రపై మీడియా ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పకుండా సుర్జేవాలా దాటవేశారు.. ఇక, న్యూఢిల్లీలోని 10 జనపథ్లో జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు కేసీ వేణుగోపాల్, దిగ్విజయ్ సింగ్, అంబికా సోని, సూర్జేవాలా, జైరాం రమేష్, ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు పాల్గొన్నారు. పీకే సూచించిన విధంగా పునరుజ్జీవన ప్రణాళికను రూపొందించడానికి సోనియా గాంధీ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్యానెల్ శుక్రవారం తన నివేదికను సమర్పించిన విషయం తెలిసిందే.. చాలా సూచనలు ఆచరణాత్మకమైనవి మరియు ఉపయోగకరమైనవిగా ఉన్నాయని.. కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్.. కిషోర్ “బ్రాండ్” అని ప్రశంసించారు. కాంగ్రెస్ పార్టీలోకి కిషోర్ రాకను వ్యతిరేకించే వారు సంస్కరణల వ్యతిరేకులు అని అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీరప మొయిలీ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Jayam Ravi Case : పిల్లల పాఠశాల ఫీజు, నా భరణం ఏడాదిగా రవి ఇవ్వడం లేదు : ఆర్తి
-
FIFA World Cup 2026: భూగోళమంతా బంతిలోనే.. నేటి నుంచే ఫుట్బాల్ ప్రపంచకప్.. మనకు మాత్రం నిరాశే!
-
Rajini – Kamal Movie Update: రజినీ – కమల్ మూవీకి షూటింగ్ అప్డేట్… మరో మూడేళ్లు తలైవా బిజీ బిజీ!
-
Ind W vs Eng W: ప్రపంచ కప్ ముందు భారత్ కు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి.!
-
నేటి నుంచి FIFA World Cup షురూ.. ఆటలో కొత్త నియమాలు ఇవే.!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!