PM Modi: ప్రధాని మోడీపై దాడికి కాంగ్రెస్ భారీ కుట్ర.?
- ప్రధాని మోడీపై దాడికి కాంగ్రెస్ కుట్ర..?
- సమాచారం మేరకే మోడీని సభకు రావద్దని కోరిన స్పీకర్..
- ఆరోపణల్ని ఖండించిన కాంగ్రెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీపై సభలో భౌతిక దాడికి దిగాలని కాంగ్రెస్ కుట్ర పన్నినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మోడీపై శారీరక దాడికి ప్లాన్ చేసిందనే హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంపై ఆయన స్పీచ్ రద్దు చేయబడినట్లు తెలిపారు. అయితే ఈ వాదనల్లో నిజం లేదని కాంగ్రెస్ చెబుతోంది. మహిళా ఎంపీలు ఒక ప్రధానిపై దాడికి ఎలా కుట్ర పన్నుతారని ప్రశ్నించారు.
నిన్న సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోడీ లోక్సపభలో మాట్లాడాల్సి ఉంది. అయితే, ప్రధాని సభకు రాకముందే కాంగ్రెస్ ఎంపీలు నిరసన కొనసాగించారు. ప్రతిపక్షాలకు చెందిన 8-9 మంది మహిళా ఎంపీలు ‘‘ Do what is right’’ అనే ప్లకార్డులు పట్టుకుని లోక్సభలో ప్రధాని మోడీ కుర్చీని ముట్టడించారు. కొంత మంది మంత్రులు వారిని వెళ్లిపోవాలని కోరిన తర్వాత మహిళా ఎంపీలు తమ ముట్టడిని విమరించుకున్నారు. చివరకు లోక్సభ వాయిదా పడింది. ప్రధాని ప్రసంగం రద్దు చేశారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని ప్రసంగాన్ని వాయిదా వేయడం అనూహ్య నిర్ణయమని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రధాని భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Also Read
- Milk Price Hike: పండుగ సీజన్కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
- Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్లో కొత్త సంక్షోభం..!
- CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
- Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
Read Also: T20 World Cup Controversy: “థాంక్యూ పాకిస్థాన్”.. పాక్ నిర్ణయంపై బంగ్లాదేశ్ రియాక్షన్..
దీనిపై స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. ప్రతిపక్ష ఎంపీలు పీఎం మోడీ కుర్చీని ముట్టడించే అవకాశం ఉందని ముందే సమచారం వచ్చిందని, అందుకే తాను స్వయంగా మోడీని సభకు రావద్దని సూచించినట్లు చెప్పారు. కొందరు ఎంపీలు తప్పుగా ప్రవర్తించినట్లు స్పీకర్ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ఈ ఆరోపణల్ని కొట్టిపారేశారు. ప్రధాని ఆరోపణల్ని ఎదుర్కొనేందుకు భయపడుతున్నారని చెప్పింది. ప్రధాని మోడీ ప్రశ్నల నుంచి తప్పించుకుంటున్నారని కాంగ్రెస్ ప్రతిదాడి చేసింది. డీఎంకే కూడా మిత్రపక్షం కాంగ్రెస్కు మద్దతు తెలిపింది. రాహుల్ గాంధీ ప్రచారానికి బీజేపీ, ప్రధాని మంత్రి భయపడ్డారని డీఎంకే ఎంపీ ఎ శరవణన్ అన్నారు. మరోవైపు, బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారి మాట్లాడుతూ.. ‘‘ నక్సలైట్లు ఇలాగే ప్రవర్తించేవారు. ప్రజాస్వామ్యం ముసుగులో వారు ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలు ఆచరించేవారు. కాంగ్రెస్ ఎంపీలు ఇలాగే ఆలోచిస్తే ప్రమాదం’’ అని అన్నారు.
తాజావార్తలు
-
Ather Konarc Launched: తక్కువ ధరలో ఎక్కువ రేంజ్.. మెటల్ బాడీ, స్మార్ట్ ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
-
Taapsee Pannu: టాలీవుడ్లోకి తాప్సీ రీ ఎంట్రీ.. ఆ డైరెక్టర్తో హారర్ మూవీ?
-
H-1B Visa Rules: H-1B ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగించే ప్రతిపాదనకు కీలక ఆమోదం
-
Milk Price Hike: పండుగ సీజన్కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
-
Race 4: ‘రేస్’ రీబూట్లో అమీర్ ఖాన్.. సిద్ధార్థ్, టైగర్తో అల్టిమేట్ యాక్షన్ ?
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!