PM Modi: ప్రధాని మోడీపై దాడికి కాంగ్రెస్ భారీ కుట్ర.?
- ప్రధాని మోడీపై దాడికి కాంగ్రెస్ కుట్ర..?
- సమాచారం మేరకే మోడీని సభకు రావద్దని కోరిన స్పీకర్..
- ఆరోపణల్ని ఖండించిన కాంగ్రెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీపై సభలో భౌతిక దాడికి దిగాలని కాంగ్రెస్ కుట్ర పన్నినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మోడీపై శారీరక దాడికి ప్లాన్ చేసిందనే హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంపై ఆయన స్పీచ్ రద్దు చేయబడినట్లు తెలిపారు. అయితే ఈ వాదనల్లో నిజం లేదని కాంగ్రెస్ చెబుతోంది. మహిళా ఎంపీలు ఒక ప్రధానిపై దాడికి ఎలా కుట్ర పన్నుతారని ప్రశ్నించారు.
నిన్న సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోడీ లోక్సపభలో మాట్లాడాల్సి ఉంది. అయితే, ప్రధాని సభకు రాకముందే కాంగ్రెస్ ఎంపీలు నిరసన కొనసాగించారు. ప్రతిపక్షాలకు చెందిన 8-9 మంది మహిళా ఎంపీలు ‘‘ Do what is right’’ అనే ప్లకార్డులు పట్టుకుని లోక్సభలో ప్రధాని మోడీ కుర్చీని ముట్టడించారు. కొంత మంది మంత్రులు వారిని వెళ్లిపోవాలని కోరిన తర్వాత మహిళా ఎంపీలు తమ ముట్టడిని విమరించుకున్నారు. చివరకు లోక్సభ వాయిదా పడింది. ప్రధాని ప్రసంగం రద్దు చేశారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని ప్రసంగాన్ని వాయిదా వేయడం అనూహ్య నిర్ణయమని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రధాని భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
Read Also: T20 World Cup Controversy: “థాంక్యూ పాకిస్థాన్”.. పాక్ నిర్ణయంపై బంగ్లాదేశ్ రియాక్షన్..
దీనిపై స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. ప్రతిపక్ష ఎంపీలు పీఎం మోడీ కుర్చీని ముట్టడించే అవకాశం ఉందని ముందే సమచారం వచ్చిందని, అందుకే తాను స్వయంగా మోడీని సభకు రావద్దని సూచించినట్లు చెప్పారు. కొందరు ఎంపీలు తప్పుగా ప్రవర్తించినట్లు స్పీకర్ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ఈ ఆరోపణల్ని కొట్టిపారేశారు. ప్రధాని ఆరోపణల్ని ఎదుర్కొనేందుకు భయపడుతున్నారని చెప్పింది. ప్రధాని మోడీ ప్రశ్నల నుంచి తప్పించుకుంటున్నారని కాంగ్రెస్ ప్రతిదాడి చేసింది. డీఎంకే కూడా మిత్రపక్షం కాంగ్రెస్కు మద్దతు తెలిపింది. రాహుల్ గాంధీ ప్రచారానికి బీజేపీ, ప్రధాని మంత్రి భయపడ్డారని డీఎంకే ఎంపీ ఎ శరవణన్ అన్నారు. మరోవైపు, బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారి మాట్లాడుతూ.. ‘‘ నక్సలైట్లు ఇలాగే ప్రవర్తించేవారు. ప్రజాస్వామ్యం ముసుగులో వారు ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలు ఆచరించేవారు. కాంగ్రెస్ ఎంపీలు ఇలాగే ఆలోచిస్తే ప్రమాదం’’ అని అన్నారు.
తాజావార్తలు
-
Parthiv Patel: హిట్మ్యాన్ను తక్కువ అంచనా వేయొద్దు’.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
-
Trump: ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ బిగ్ షాక్.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
-
Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
-
Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
-
Indian Player: మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రూ. 95 లక్షల లంచం ఇస్తూ దొరికిపోయిన భారత ప్లేయర్..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?