Rahul Gandhi: కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు.. రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వెళుతోంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గతంలో రాజస్థాన్లో జరిగిన చింతన్ శివిర్లో దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ యాత్రకు సంబంధించి, దేశంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో కీలక సమావేశం ఢిల్లీలో జరిగింది. ప్రియాంక గాంధీతో పాటు పీసీసీ అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, పలు రాష్ట్రాల ఇన్ఛార్జ్లు సమావేశంలో పాల్గొన్నారు.
భారత్ జోడో యాత్రలో భాగంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభం కానుంది. 148 రోజుల పాటు, 12 రాష్ట్రాల్లో 3600 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర సాగనుంది. భారత్ జోడో యాత్రను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఈ పాదయాత్రను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ అధినేత పలు కమిటీలను నియమించిన సంగతి తెలిసిందే.
Also Read
Harish Rao : రైతుల వడ్లు వద్దు కానీ బీజేపీ నేతలకు ఓట్లు కావాలా
కేంద్రంలో అధికారం చేపట్టాలంటే రాష్ట్రాల్లో తిరిగి తమ ఉనికిని చాటుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందులోభాగంగానే దేశవ్యాప్తంగా మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టబోతోంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా అన్నిప్రాంతాలను కలుపుతూ యాత్ర సాగేలా ప్లాన్ చేస్తోంది. ప్రజలకు చేరువకావడమే లక్ష్యంగా పాదయాత్రకు పూనుకుంటోంది. ఏడాదిపాటు జరిగే ఈ మహాపాదయాత్రలో రాహుల్ గాంధీతోపాటు పార్టీ సీనియర్ నేతలు ఉండేలా సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Pakistan Restores Historic Hindu Names : పాకిస్తాన్ ‘హిందూ’ జపం.!
-
CJP: ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి ఫాలోవర్లు పెరగడానికి కారణం ఇదేనా.. పలు అనుమానాలు..
-
Mahanadu : ‘స్త్రీ శక్తి’ థీమ్తో టీడీపీ మహానాడు.. 20 కీలక తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం.!
-
PM Modi: పొదుపు వేళ మోడీకి సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ.. ఏముందంటే..!
-
CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!