Haryana Polls: సాయంత్రం మరో జాబితాను విడుదల చేయనున్న కాంగ్రెస్.. ముగ్గురు ఎంపీల పోటీపై ఉత్కంఠ!
- సాయంత్రం మరో జాబితాను విడుదల చేయనున్న కాంగ్రెస్
- ముగ్గురు ఎంపీల పోటీపై ఉత్కంఠ!
- ఫైనల్ చేయనున్న కాంగ్రెస్ హైకమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానా అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితాను ఇప్పటికే కాంగ్రెస్ రెండు లిస్టులను విడుదల చేసింది. సోమవారం సాయంత్రం మరో జాబితా విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. మూడు స్థానాలు మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ఎంపీలుగా ఉన్న ముగ్గురు.. ఎమ్మెల్యేలకు పోటీ చేస్తామని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూడు స్థానాలు మినహా.. మిగతా అన్ని స్థానాలకు హస్తం పార్టీ అభ్యర్థులను వెల్లడించనున్నట్లు సమాచారం. మూడు స్థానాల ఎంపిక మాత్రం అధిష్టానానికి వదిలేసిట్లుగా వార్తలు వినిపిస్తు్న్నాయి. హర్యానాకు చెందిన కాంగ్రెస్ ఎంపీలందరూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరికను వ్యక్తం చేసినట్లు కూడా వర్గాలు తెలిపాయి. లోక్సభలో ఆరుగురు ఎంపీలు, రాజ్యసభలో రణదీప్ సింగ్ సూర్జేవాలా ఉన్నారు. అయితే ఎంపీలకు సీట్లు కేటాయింపుపై హైకమాండ్ నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంది. ఇప్పటికే 41 మంది అభ్యర్థులను ప్రకటించారు. మరో 49 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Box Office: రచ్చ రేపుతున్న శనివారం.. పాపం గోట్!
Also Read
- Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
- Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
- PM Modi: భారత్ దూకుడు.. జీడీపీ వృద్ధిరేటు పెరగడంపై మోడీ హర్షం.. ఎక్స్లో కీలక వ్యాఖ్యలు
- Cockroach Janta Party: ఢిల్లీలో "కాక్రోచ్ జనతా పార్టీ" ఆందోళన.. పోలీసులు ఏం చెబుతున్నారంటే..
హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీలు.. లోక్సభలో కొనసాగే కంటే.. రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగాలని భావిస్తున్నారు. హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఐదేళ్ల పాటు అధికారం చెలాయించవచ్చని ఎంపీలు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Ganesh Immersion: వినాయక నిమజ్జనంలో అపశృతి.. ఇద్దరు యువకులు, ఓ బాలుడు గల్లంతు
హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే రెండు జాబితాలను కాంగ్రెస్ విడుదల చేసింది. బీజేపీ, ఆప్ కూడా జాబితాలను వెల్లడించాయి. అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే అక్టోబర్లో జరిగే ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది.
ఇది కూడా చదవండి: Simha Koduri Interview: ‘మత్తు వదలరా2’ని అందుకే దాచాం.. ‘సత్య’తో కెమిస్ట్రీ అదిరింది: : హీరో శ్రీ సింహ
తాజావార్తలు
-
Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
-
ALP: ఒంగోలులో లోకో పైలట్పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
-
Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!