Congress Vs G23 Meet: కాంగ్రెస్లో ఏం జరుగుతోంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది. వరుస పరాజయాల నేపథ్యంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీని తిరిగి పట్టాలెక్కించడం సాధ్యమా? గులామ్ నబీ ఆజాద్ నివాసంలో కొంతమంది కాంగ్రెస్ అసమ్మతి నేతల సమావేశం హాట్ టాపిక్ అవుతోంది. గులాం నబీ అజాద్ నివాసంలో సమావేశానికి హాజరుకానున్నారు
మనీష్ తివారి, భూపేందర్ సింగ్ హుడా, పృధ్విరాజ్ చౌహాన్, ఆనంద శర్మ వంటి నేతలు.
జి-23 అసమ్మతి బృందంలో కాంగ్రెస్ పార్టీని వీడిన జితిన్ ప్రసాద్, యోగానంద శాస్త్రి కూడా హాజరవుతారు. ఇటీవల బీజేపీలో చేరిన జితిన్ ప్రసాద్ రావడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్.సి.పి) లో చేరిన యోగానంద శాస్త్రి అసమ్మతి సమావేశానికి ఎందుకు వస్తున్నారన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. సమావేశానికి హాజరుకానున్న మిగిలిన 21 మంది అసమ్మతి కాంగ్రెస్ నేతల్లో అందుబాటులో ఉన్న నేతలు వస్తారని భావిస్తున్నారు. కాంగ్రెస్ లో తారస్థాయికి చేరుతున్న విభేదాల నేపథ్యంలో ఈ సమావేశానికి ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. కపిల్ సిబల్ నివాసంలో డిన్నర్ మీట్ అవుతున్నారు జి23 నేతలు. ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, జాతీయ నాయకత్వ మార్పు అంశాలపై చర్చ. జి23 నేతల మీటింగ్ పై ఇప్పటికే కౌంటర్లు మొదలయ్యాయి.
Also Read
- Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
ఇదిలా వుంటే కాంగ్రెస్లో రెండు వర్గాల నేతల మధ్య మాటల వేడి పెరుగుతూనే వుంది. గాంధీ కుటుంబానికి విధేయంగా ఉండే నేతలు… జీ23 వర్గంపై విమర్శలు ఎక్కుపెడుతూనే వున్నారు. గాంధీ కుటుంబం పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగాలని కపిల్ సిబల్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ఆయనపై ఎదురుదాడికి దిగారు మరో కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్. కాంగ్రెస్ నుంచి కపిల్ సిబల్ ఎంతో ప్రయోజనం పొందారని, అలాంటి వ్యక్తి ప్రస్తుతం ఇలా ఫిర్యాదులు చేయడం దురదృష్టకరమన్నారు.
రాహుల్ గాంధీ పూర్తి స్థాయి అధ్యక్షుడిగా ఉండాలని పార్టీలోని నేతలంతా భావిస్తున్నారు. ఆగస్టులో ఎన్నికలు జరిగి.. పార్టీ అధ్యక్షుడిగా ఆయన గెలుపొందాలని సీనియర్ నేతలు భావిస్తున్నారు. రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే సైతం జీ23 నేతలను విమర్శలు చేయడం విశేషం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అన్ని అంశాలపై చర్చించినప్పటికీ.. జీ23 నేతలు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారని ఇది తప్పుడు సంకేతాలిస్తుందన్నారు. కాంగ్రెస్ పరాజయం తర్వాత గతంలోనే కాంగ్రెస్లో ఎన్నికలు కావాలని, మార్పులు రావాలని కోరుతూ 23 మంది సీనియర్ నేతలు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి గతంలో లేఖ రాసిన సంగతి తెలిసిందే. జీ 23 నేతలు ఏ అంశాలు చర్చిస్తారోనని అంతా ఆసక్తి కనబరుస్తున్నారు.
తాజావార్తలు
-
JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్కే షాక్.. జియో హాట్స్టార్లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
-
iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
-
NBK 112 : బాలయ్య -కొరటాల మాస్ సినిమా కాదు.. అంతకుమించి
-
Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
-
Lenin movie trailer : లెనిన్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. అయ్యగారు ఆన్ ట్రాక్
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!