Tamil Nadu Governor: వీసీల సదస్సు ఏర్పాటు చేయాలన్న తమిళనాడు గవర్నర్.. మండిపడిన కాంగ్రెస్, సీపీఎం
- వైస్-ఛాన్సలర్లు, రిజిస్ట్రార్లతో గవర్నర్ రెండు రోజుల సదస్సుకు ఆదేశాలు..
- గవర్నర్ ఆర్ఎన్ రవి తీరుపై తీవ్రంగా మండిపడిన కాంగ్రెస్, సీపీఎం పార్టీలు..
- గవర్నర్ ఆర్ఎన్ రవి "ఆర్ఎస్ఎస్ ఏజెంట్"గా వ్యవహరిస్తున్నారు: కాంగ్రెస్- సీపీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu Governor: తమిళనాడులో గవర్నర్ ఆర్ఎన్ రవి- సీఎం స్టాలిన్ మధ్య వివాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా, గవర్నర్ రవి మరో పంచాయతీకి తెర లేపాడు. ఏప్రిల్ 25, 26 తేదీల్లో ఊటీలో విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్లు, రిజిస్ట్రార్ల కోసం రెండు రోజుల సదస్సును ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై తమిళనాడుకు చెందిన కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) తీవ్రంగా విమర్శించాయి. గవర్నర్ చర్యలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం ఆమోదించిన బిల్లులకు అనుమతి ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కె. సెల్వపెరుంతగై ఆరోపించారు. ఇక, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత గవర్నర్ ఆర్ఎన్ రవి రాజీనామా చేసి ఉండాలి అన్నారు. ఆ తీర్పును గౌరవించకుండా వైస్-ఛాన్సలర్ల సమావేశాన్ని ఏర్పాటు చేయడం రాజ్యాంగాన్ని ఆగౌరవపర్చడమే అన్నారు.
Read Also: Yash : ‘రామాయణ’ కోసం అన్నగారు ఎన్టీఆర్ సెంటిమెంట్ ఫాలోఅవుతున్న యష్
Also Read
కాగా, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి “ఆర్ఎస్ఎస్ ఏజెంట్”గా వ్యవహరిస్తున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం ఆరోపించారు. వైస్-ఛాన్సలర్లు ఈ సమావేశానికి హాజరు కావొద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును గవర్నర్ జీర్ణించుకోలేక ఈ సమావేశం ద్వారా మరోసారి రాష్ట్రంలో వివాదాన్ని రేకెత్తించడానికి ప్రయత్నిస్తున్నారు పేర్కొన్నారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్గా గవర్నర్ను తొలగిస్తూ తమిళనాడు అసెంబ్లీ బిల్లులు ఆమోదించింది.. సుప్రీంకోర్టు కూడా ఆ బిల్లులను ఆమోదించిందని సీపీఐ(ఎం) కార్యదర్శి షణ్ముగం గుర్తు చేశారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!