Tamil Nadu Governor: వీసీల సదస్సు ఏర్పాటు చేయాలన్న తమిళనాడు గవర్నర్.. మండిపడిన కాంగ్రెస్, సీపీఎం
- వైస్-ఛాన్సలర్లు, రిజిస్ట్రార్లతో గవర్నర్ రెండు రోజుల సదస్సుకు ఆదేశాలు..
- గవర్నర్ ఆర్ఎన్ రవి తీరుపై తీవ్రంగా మండిపడిన కాంగ్రెస్, సీపీఎం పార్టీలు..
- గవర్నర్ ఆర్ఎన్ రవి "ఆర్ఎస్ఎస్ ఏజెంట్"గా వ్యవహరిస్తున్నారు: కాంగ్రెస్- సీపీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu Governor: తమిళనాడులో గవర్నర్ ఆర్ఎన్ రవి- సీఎం స్టాలిన్ మధ్య వివాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా, గవర్నర్ రవి మరో పంచాయతీకి తెర లేపాడు. ఏప్రిల్ 25, 26 తేదీల్లో ఊటీలో విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్లు, రిజిస్ట్రార్ల కోసం రెండు రోజుల సదస్సును ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై తమిళనాడుకు చెందిన కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) తీవ్రంగా విమర్శించాయి. గవర్నర్ చర్యలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం ఆమోదించిన బిల్లులకు అనుమతి ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కె. సెల్వపెరుంతగై ఆరోపించారు. ఇక, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత గవర్నర్ ఆర్ఎన్ రవి రాజీనామా చేసి ఉండాలి అన్నారు. ఆ తీర్పును గౌరవించకుండా వైస్-ఛాన్సలర్ల సమావేశాన్ని ఏర్పాటు చేయడం రాజ్యాంగాన్ని ఆగౌరవపర్చడమే అన్నారు.
Read Also: Yash : ‘రామాయణ’ కోసం అన్నగారు ఎన్టీఆర్ సెంటిమెంట్ ఫాలోఅవుతున్న యష్
Also Read
- Sonam Wangchuk Hunger Strike: 20వ రోజుకు సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష.. అవయవ వైఫల్యం ముప్పు.. దీక్ష విరమణకు ససేమిరా..
- NEET UG Result 2026: నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్కార్డ్ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
కాగా, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి “ఆర్ఎస్ఎస్ ఏజెంట్”గా వ్యవహరిస్తున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం ఆరోపించారు. వైస్-ఛాన్సలర్లు ఈ సమావేశానికి హాజరు కావొద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును గవర్నర్ జీర్ణించుకోలేక ఈ సమావేశం ద్వారా మరోసారి రాష్ట్రంలో వివాదాన్ని రేకెత్తించడానికి ప్రయత్నిస్తున్నారు పేర్కొన్నారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్గా గవర్నర్ను తొలగిస్తూ తమిళనాడు అసెంబ్లీ బిల్లులు ఆమోదించింది.. సుప్రీంకోర్టు కూడా ఆ బిల్లులను ఆమోదించిందని సీపీఐ(ఎం) కార్యదర్శి షణ్ముగం గుర్తు చేశారు.
తాజావార్తలు
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Lenovo Legion R9000P: ప్రపంచంలోనే తొలి IJP OLED డిస్ప్లేతో.. లెనోవో Legion R9000P రిలీజ్
-
Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Toyota Hilux India Launch: కొత్త Toyota Hilux డిజైన్ రివీల్.. ధర, ఫీచర్లపై కీలక అప్డేట్
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!