India On Bangladesh: ‘‘ఉగ్రవాద మాటలు పెరుగుతున్నాయి.’’ బంగ్లాదేశ్పై భారత్ కీలక వ్యాఖ్యలు..
- బంగ్లాదేశ్ పరిణామాలపై స్పందించిన భారత్..
- మైనారిటీలపై దాడుల గురించి ఆందోళన..
- చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ని కోరిన విదేశాంగ శాఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India On Bangladesh: బంగ్లాదేశ్లో మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు, అణిచివేతపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. పొరుగు దేశంలో పెరుగుతున్న హింసాత్మక సంఘటనలపై బంగ్లాదేశ్కి తన తీవ్రమైన ఆందోళనని తెలిజేసింది. ‘‘ఉగ్రవాద వ్యాఖ్యల’’పై ఆందోళన వెలిబుచ్చింది. మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని పెరుగుతున్న మతపరమైన సంఘటనలకు సంబంధించి బంగ్లాదేశ్లోని మధ్యంతర ప్రభుత్వంతో సాధారణ, స్థిరమైన సంప్రదింపులు జరుగుతున్నట్లు భారత్ వెల్లడించింది.
Read Also: Maharashtra Next CM: బ్రాహ్మణ సీఎం కింద ఇద్దరు మరాఠా డిప్యూటీ సీఎంలు.. మహారాష్ట్ర అంగీకరిస్తుందా?
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
‘‘హిందువులు, ఇతర మైనారిటలపై బెదిరింపులు, టార్గెటెడ్ అటాక్స్ గురించి బంగ్లాదేశ్ ప్రభుత్వంతో భారతదేశం నిలకడగా, బలంగా తన వైఖరిని లేవనెత్తింది. మా వైఖరి స్పష్టంగా ఉంది. మైనారిటీలందరిని రక్షించే బాధ్యత తాత్కాలిక ప్రభుత్వంపై ఉంది’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ‘‘ఉగ్రవాద వ్యాఖ్యలు, పెరుగుతున్న హింస, రెచ్చగొట్టే సంఘటనలపై మేము ఆందోళన చెందుతున్నాము. ఈ పరిణామాలు మీడియా అతిశయోక్తిగా కొట్టిపారేయలేము’’ అని చెప్పింది.
శుక్రవారం విలేకరుల సమావేశంలో MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మైనారిటీలందరినీ రక్షించే బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు పెరిగాయి. చాలా ప్రాంతాల్లో హిందువుల వ్యాపారాలు, గుడులను మతోన్మాదులు టార్గెట్ చేస్తున్నారు. ఆ దేశంలో ప్రముఖ హిందూనేత, ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్ని అక్కడి ప్రభుత్వం దేశద్రోహం కేసు పెట్టి జైలుకు పంపించింది. దీనిపై అక్కడి మైనారిటీలు ఆందోళన చెందుతున్నారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!