India On Bangladesh: ‘‘ఉగ్రవాద మాటలు పెరుగుతున్నాయి.’’ బంగ్లాదేశ్పై భారత్ కీలక వ్యాఖ్యలు..
- బంగ్లాదేశ్ పరిణామాలపై స్పందించిన భారత్..
- మైనారిటీలపై దాడుల గురించి ఆందోళన..
- చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ని కోరిన విదేశాంగ శాఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India On Bangladesh: బంగ్లాదేశ్లో మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు, అణిచివేతపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. పొరుగు దేశంలో పెరుగుతున్న హింసాత్మక సంఘటనలపై బంగ్లాదేశ్కి తన తీవ్రమైన ఆందోళనని తెలిజేసింది. ‘‘ఉగ్రవాద వ్యాఖ్యల’’పై ఆందోళన వెలిబుచ్చింది. మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని పెరుగుతున్న మతపరమైన సంఘటనలకు సంబంధించి బంగ్లాదేశ్లోని మధ్యంతర ప్రభుత్వంతో సాధారణ, స్థిరమైన సంప్రదింపులు జరుగుతున్నట్లు భారత్ వెల్లడించింది.
Read Also: Maharashtra Next CM: బ్రాహ్మణ సీఎం కింద ఇద్దరు మరాఠా డిప్యూటీ సీఎంలు.. మహారాష్ట్ర అంగీకరిస్తుందా?
Also Read
- Maharashtra Politics: కాంగ్రెస్లో శరద్ పవార్ పార్టీ విలీనం ? మహారాష్ట్ర రాజకీయాల్లో తెరవెనుక నడుస్తున్న హైడ్రామా ఇదే!
- Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ కొలువుల్లో 'కమిషన్ల' భాగోతం.. ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామా వెనుక అసలు రహస్యం ఇదేనా?
- Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
‘‘హిందువులు, ఇతర మైనారిటలపై బెదిరింపులు, టార్గెటెడ్ అటాక్స్ గురించి బంగ్లాదేశ్ ప్రభుత్వంతో భారతదేశం నిలకడగా, బలంగా తన వైఖరిని లేవనెత్తింది. మా వైఖరి స్పష్టంగా ఉంది. మైనారిటీలందరిని రక్షించే బాధ్యత తాత్కాలిక ప్రభుత్వంపై ఉంది’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ‘‘ఉగ్రవాద వ్యాఖ్యలు, పెరుగుతున్న హింస, రెచ్చగొట్టే సంఘటనలపై మేము ఆందోళన చెందుతున్నాము. ఈ పరిణామాలు మీడియా అతిశయోక్తిగా కొట్టిపారేయలేము’’ అని చెప్పింది.
శుక్రవారం విలేకరుల సమావేశంలో MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మైనారిటీలందరినీ రక్షించే బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు పెరిగాయి. చాలా ప్రాంతాల్లో హిందువుల వ్యాపారాలు, గుడులను మతోన్మాదులు టార్గెట్ చేస్తున్నారు. ఆ దేశంలో ప్రముఖ హిందూనేత, ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్ని అక్కడి ప్రభుత్వం దేశద్రోహం కేసు పెట్టి జైలుకు పంపించింది. దీనిపై అక్కడి మైనారిటీలు ఆందోళన చెందుతున్నారు.
తాజావార్తలు
-
Celebrity Wedding: 78 ఏళ్ల వయసులో మళ్లీ వరుడైన స్టార్ నటుడు.. భార్యతో మరోసారి పెళ్లి!
-
Stock Market: 27 నిమిషాల్లోనే రూ.2.82 లక్షల కోట్లు లాభం! స్టాక్ మార్కెట్లో ఈ రోజు ఇన్వెస్టర్లకు పండగే!
-
Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
-
Ather 450X Overtones: ఏథర్ కొత్త 450X ఓవర్టోన్స్ సిరీస్.. 900W ఫాస్ట్ ఛార్జర్, వాయిస్ కమాండ్తో మరింత స్మార్ట్!
-
Shruti Haasan : ఐడెంటిటీ కోల్పోతున్న శృతి హాసన్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?