India On Bangladesh: ‘‘ఉగ్రవాద మాటలు పెరుగుతున్నాయి.’’ బంగ్లాదేశ్పై భారత్ కీలక వ్యాఖ్యలు..
- బంగ్లాదేశ్ పరిణామాలపై స్పందించిన భారత్..
- మైనారిటీలపై దాడుల గురించి ఆందోళన..
- చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ని కోరిన విదేశాంగ శాఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India On Bangladesh: బంగ్లాదేశ్లో మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు, అణిచివేతపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. పొరుగు దేశంలో పెరుగుతున్న హింసాత్మక సంఘటనలపై బంగ్లాదేశ్కి తన తీవ్రమైన ఆందోళనని తెలిజేసింది. ‘‘ఉగ్రవాద వ్యాఖ్యల’’పై ఆందోళన వెలిబుచ్చింది. మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని పెరుగుతున్న మతపరమైన సంఘటనలకు సంబంధించి బంగ్లాదేశ్లోని మధ్యంతర ప్రభుత్వంతో సాధారణ, స్థిరమైన సంప్రదింపులు జరుగుతున్నట్లు భారత్ వెల్లడించింది.
Read Also: Maharashtra Next CM: బ్రాహ్మణ సీఎం కింద ఇద్దరు మరాఠా డిప్యూటీ సీఎంలు.. మహారాష్ట్ర అంగీకరిస్తుందా?
Also Read
- Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
- Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
- CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
- Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
‘‘హిందువులు, ఇతర మైనారిటలపై బెదిరింపులు, టార్గెటెడ్ అటాక్స్ గురించి బంగ్లాదేశ్ ప్రభుత్వంతో భారతదేశం నిలకడగా, బలంగా తన వైఖరిని లేవనెత్తింది. మా వైఖరి స్పష్టంగా ఉంది. మైనారిటీలందరిని రక్షించే బాధ్యత తాత్కాలిక ప్రభుత్వంపై ఉంది’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ‘‘ఉగ్రవాద వ్యాఖ్యలు, పెరుగుతున్న హింస, రెచ్చగొట్టే సంఘటనలపై మేము ఆందోళన చెందుతున్నాము. ఈ పరిణామాలు మీడియా అతిశయోక్తిగా కొట్టిపారేయలేము’’ అని చెప్పింది.
శుక్రవారం విలేకరుల సమావేశంలో MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మైనారిటీలందరినీ రక్షించే బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు పెరిగాయి. చాలా ప్రాంతాల్లో హిందువుల వ్యాపారాలు, గుడులను మతోన్మాదులు టార్గెట్ చేస్తున్నారు. ఆ దేశంలో ప్రముఖ హిందూనేత, ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్ని అక్కడి ప్రభుత్వం దేశద్రోహం కేసు పెట్టి జైలుకు పంపించింది. దీనిపై అక్కడి మైనారిటీలు ఆందోళన చెందుతున్నారు.
తాజావార్తలు
-
Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
-
ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
-
Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
-
Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?