PM Modi: సామాన్య ప్రజల కలలు నెరవేరుతున్నాయి.. ప్రతిపక్షాలు ఆగ్రహిస్తున్నాయి: ప్రధాని మోడీ
PM Modi: దేశంలోని సామాన్య ప్రజల కలలు నెరవేరుతుండటంతో ప్రతిపక్షాలు ఆగ్రహిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. గుజరాత్లోని రాజ్కోట్లో అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభలో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా విపక్షాలపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు తమ ప్రభుత్వం ఎంతో కృషిచేసిందని.. అలా చేసి ఉండకపోతే నిత్యావసర ధరలు మరింతగా పెరిగేవన్నారు. ప్రజలను దాహంతో ఉంచినవారు, వారి ఆకాంక్షలు, ఆశలను పట్టించుకోని వారు నేడు ప్రజల కలలు సాకారమవుతుంటే చూసి ఆగ్రహిస్తున్నారంటూ విపక్షాలపై విరుచుకుపడ్డారు. అవినీతి, వారసత్వంతో కూడినవారని విపక్షాల కూటమిని విమర్శించారు.
Read also: Sandra Bullock: హీరోయిన్ బర్త్ డే.. న్యూడ్ వీడియో పంపి విష్ చేసిన హీరో
Also Read
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
విపక్షాల కూటమి పేరు మార్చుకుందే తప్ప.. ఆ ముఖాలు పాతవేననన్నారు. ఆ గ్రూపు పద్ధతులు, ఉద్దేశాలు ఒకేలా ఉంటాయని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేను అధికారంలోకి రానీయకుండా నిలువరించేందుకు 26 విపక్ష పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన INDIA కూటమిని ఉద్దేశించి ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. సుపరిపాలన హామీతో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే.. వాటినే ఈ తొమ్మిదేళ్లలో అమలు చేసిందన్నారు. ఇంతకుముందు ప్రభుత్వం కొనసాగితే ప్రజలు నెలకు మొబైల్ ఫోన్ బిల్లు రూ.6000 చొప్పున చెల్లించాల్సి వచ్చేదన్నారు. ఈజ్ ఆఫ్ లివింగ్, క్వాలిటీ ఆఫ్ లైవ్ తమ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతల్లో ఒకటన్న ప్రధాని.. డిజిటల్ ఇండియాతో సామాన్యుల సమస్యల్నింటినీ పరిష్కరించామన్నారు. కొన్నేళ్లుగా రాజ్కోట్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఇప్పుడు సౌరాష్ట్రకు గ్రోత్ ఇంజిన్గా గుర్తింపు సాధించిందని ప్రధాని తెలిపారు. ప్రతిపక్షాలు ప్రతి విషయంలోనూ రాజకీయం చేయాలని చూస్తున్నారని అన్నారని విమర్శించారు. ప్రతిదీ రాజకీయం చేయడం మంచిది కాదని విపక్షాలకు ప్రధాని హితవు పలికారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?