Nitish Kumar: “నాకు ఒకే కల మిగిలి ఉంది”.. కేసీఆర్ సభపై నితీష్ కుమార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Nitish Kumar comments on KCR Sabha: తెలంగాణలో భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆవిర్భావ సభకు జాతీయ నాయకులు రావడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ వేదికగా విపక్షాల భారీ బహిరంగ సభ జరిగిన తర్వాత రోజ బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నాకు ఏం అక్కర లేదని.. నాకు ఒకే కల ఉందని , ప్రతిపక్షాల నాయకులు ఏకమై ముందుకు సాగాలని, అది దేశానికి మేలు చేస్తుందని’’ ఆయన అన్నారు.
Read Also: Nepal Plane Crash: నేపాల్ విమాన ప్రమాదానికి కారణం ఇదేనా..?
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
తెలంగాణ సీఎం ఆహ్వానం మేరకు బుధవారం జరిగిన ప్రతిపక్షాల బహిరంగ సభకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, వామపక్ష నాయకుడు డీ. రాజా హాజరయ్యారు. ఈ సభ తరువాత నితీష్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. కేసీఆర్ సభపై విలేకరులు నితీష్ కుమార్ ను ప్రశ్నించగా.. ఈ సభ గురించి నాకు తెలియదని, నేను వేరే పనుల్లో బిజీగా ఉన్నానని, కేసీఆర్ సభకు ఆహ్వానం అందిన వారు తప్పకుండా వెళ్లి ఉంటారని ఆయన అన్నారు.
ఈ సభలో ప్రధాని మోదీ, బీజేపీ లక్ష్యంగా నాయకులు విమర్శలు గుప్పించారు. మోదీకి ఇంకా 399 రోజలు సమయమే ఉందని అఖిలేష్ యాదవ్ అన్నారు. ఇదిలా ఉంటే తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులుకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిచడంతో పాటు ప్రైవేటైజేషన్ అడ్డుకుంటామని అన్నారు. ఇప్పటికే నితీష్ కుమార్ ప్రధాని పదవిపై ఆశలేదని ప్రకటించిన నేపథ్యంలో కేసీఆర్ ప్రధాని రేసులో ఉన్నారని జాతీయ మీడియా విశ్లేషిస్తోంది. 2024 ఎన్నికల తర్వాత బీజేపీ ఇంటికి వెళ్తుందని సీఎం కేసీఆర్ నిన్న అన్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!