Tamil Nadu CM: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్పై సీఎం ఎంకే స్టాలిన్ సీరియస్..
- కేంద్ర ఆర్థిక మంత్రికి క్షమాపణలు చెప్పిన జీఎస్టీ గురించి ప్రశ్రలు అడిగిన రెస్టారెంట్ యజమాని..
- నిర్మలా సీతారామన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్..
- కేంద్ర ప్రభుత్వం నుంచి తమిళనాడుకు రుణ సాయం అందలేదు: సీఎం ఎంకే స్టాలిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu CM: కేంద్ర ఆర్థిక మంత్రికి క్షమాపణలు చెప్పిన జీఎస్టీ గురించి ప్రశ్రలు అడిగిన రెస్టారెంట్ యజమాని చెప్పిన వీడియో వైరల్ కావడంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈరోజు (శనివారం) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీఎస్టీపై న్యాయమైన డిమాండ్లు చేసినందుకు కేంద్ర మంత్రి వ్యవహరించిన తీరు సిగ్గుచేటు అని పేర్కొన్నారు. అలాగే, జీఎస్టీపై మాట్లాడిన వ్యక్తికి ఏమి జరిగిందో చూస్తే చాలా నిరుత్సాహంగా ఉందన్నారు. ఇక, కేంద్ర ప్రభుత్వ సహకారం ఇంకా అందలేదు.. నిన్న ( శుక్రవారం) కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాకు రుణ సాయం అందిందని చెప్పారని.. కానీ, ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా కేంద్ర సర్కార్ ఇవ్వలేదని ముఖ్యమంత్రి స్టాలిన్ తేల్చి చెప్పారు.
Read Also: Andhra Pradesh: ఏపీ సర్కార్ చొరవ.. కువైట్ నుంచి క్షేమంగా స్వదేశానికి బాధితురాలు
Also Read
- Maharashtra Politics: కాంగ్రెస్లో శరద్ పవార్ పార్టీ విలీనం ? మహారాష్ట్ర రాజకీయాల్లో తెరవెనుక నడుస్తున్న హైడ్రామా ఇదే!
- Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ కొలువుల్లో 'కమిషన్ల' భాగోతం.. ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామా వెనుక అసలు రహస్యం ఇదేనా?
- Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
కాగా, కోయంబత్తూరులో గల శ్రీ అన్నపూర్ణ హోటల్ యజమాని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు క్షమాపణలు చెబుతున్నట్లు ఉన్న వీడియోను తమిళనాడు రాష్ట్ర బీజేపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వివాదం తలెత్తింది. రెస్టారెంట్ యజమాని, ఆర్థిక మంత్రి మధ్య జరిగిన సంభాషణను బహిరంగపరచినందుకు రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై పార్టీ తరపున క్షమాపణలు చెప్పారు. అనుకోకుండా గోప్యతను ఉల్లంఘించినందుకు విచారం వ్యక్తం చేస్తున్నాం.. అన్నపూర్ణ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ యజమాని శ్రీనివాసన్కు క్షమాపణలు చెప్పారు.
Read Also: Inspirational Story: రైల్వే స్టేషన్లో కూలీ టూ ఐఏఎస్.. శ్రీనాథ్ విజయగాథ..
ఇక, తమిళనాడు హోటల్ యజమానుల సంఘం అధ్యక్షుడు కూడా అయిన శ్రీనివాసన్ సెప్టెంబరు 11న కోయంబత్తూరులో ఆర్థిక మంత్రి హాజరైన సమావేశంలో జీఎస్టిపై సమస్యలను లేవనెత్తారు. స్వీట్, మసాలా ఆహారంపై పన్ను విధించడంలో ఉన్న వ్యత్యాసాలను చూపించారు. తీపిపై ఐదు శాతం జీఎస్టి విధించగా.. సావరీస్పై 12 శాతం, క్రీమ్తో కూడిన బన్స్పై (బన్స్పై జీఎస్టి లేదు)18 శాతం విధించడంతో కస్టమర్లు తరచూ ఫిర్యాదు చేస్తున్నారని హోటల్ యజమాని శ్రీనివాసన్ పేర్కొన్నారు.
Sree Annapoorna is a famous vegetarian restaurant chain in Coimbatore. On Wednesday, the owner of the restaurant Mr. Srinivasan attended an event with FM @nsitharaman and asked a question about the anomalies in GST very very politely.
"The problem is that GST is applied… pic.twitter.com/FNldzP0hu7
— Congress Kerala (@INCKerala) September 13, 2024
తాజావార్తలు
-
Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్పార్క్కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!
-
Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన బేబీ బాస్.. అరంగేట్రం వాయిదాపై గవాస్కర్ సీరియస్ వార్నింగ్..
-
Celebrity Wedding: 78 ఏళ్ల వయసులో మళ్లీ వరుడైన స్టార్ నటుడు.. భార్యతో మరోసారి పెళ్లి!
-
Stock Market: 27 నిమిషాల్లోనే రూ.2.82 లక్షల కోట్లు లాభం! స్టాక్ మార్కెట్లో ఈ రోజు ఇన్వెస్టర్లకు పండగే!
-
Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?