Arvind Kejriwal: బీజేపీలోనే ఉండి డబ్బులు తీసుకోండి.. ఆప్ కోసం పనిచేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Arvind kejriwal comments on BJP over Gujarat elections: ఈ ఏడాది చివర్లో గుజరాత్ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈ సారి గుజరాత్ లో పాగా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) భావిస్తోంది. బీజేపీ నుంచి అధికారాన్ని తీసుకోవాలని ఆప్ భావిస్తోంది. ఇదిలా ఉంటే ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ లో రెండు రోజుల పాటు పర్యటిస్తున్నారు. తాజాగా ఆయన బీజేపీ కార్యకర్తలను, నాయకులును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ లో బీజేపీ కార్యకర్తలు బీజేపీలో ఉంటూనే ఆప్ కు సహకరించాలని కోరారు.
బీజేపీ కార్యకర్తలందరూ అక్కడే( బీజేపీలో)నే ఉండి ఆప్ కోసం పనిచేయమన్నారు. మీరు తెలివైన వారు.. ఆప్ కోసం లోపల నుంచే పనిచేయండి, బీజేపీ నుంచి డబ్బులు తీసుకుని మా కోసం పని చేయండి అని వ్యాఖ్యానించారు. ఎందుకంటే మాకు డబ్బులు లేవని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. రాజ్ కోట్ లో మీడియాలో మాట్లాడుతూ.. కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
- Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
Read Also: Karimnagar mayor Ravinder singh : టీఆర్ఎస్ లోకి రీఎంట్రీ తర్వాత రవీందర్ సింగ్ కి కలిసొచ్చిందేంటి..?
గుజరాత్ లో అధికారంలోకి వస్తే 24 గంటల ఉచిత విద్యుత్ అందించడంతో పాటు మీ పిల్లలకు ఉచిత విద్యను అందించే మంచి పాఠశాలను నిర్మిస్తాము.. ఉచిత, నాణ్యమైన విద్యను అందిస్తామని.. కుటుంబంలో మహిళలకు రూ. 1000 అందిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే గుజరాత్ ఆప్ ప్రధాన కార్యదర్శి మనోజ్ సొరథియాపై ఇటీవల జరిగిన దాడి అంశాన్ని కూడా కేజ్రీవాల్ ప్రస్తావించారు. మేం భయపడటానికి కాంగ్రెస్ వాళ్లం కాదని.. మేము భయపడబోమని.. పరికివాళ్లం కాదని.. అన్యాయం, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతామని ఆయన అన్నారు. గుజరాత్ లోని 6 కోట్ల మందికి ఇప్పుడు ఆప్ ప్రత్యామ్నాయంగా ఉందని కేజ్రీవాల్ అన్నారు.
ఈ ఏడాది డిసెంబర్ లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రం కావడంతో ఇక్కడ ఎన్నికలు కీలకంగా మారాయి. గుజరాత్ లో బీజేపీని అడ్డుకుంటే 2024 లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఆధిపత్యానికి బ్రేక్ వేయొచ్చని కాంగ్రెస్ పార్టీతో పాటు ఆప్ భావిస్తున్నాయి. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ సీట్ల సంఖ్య, ఓట్ షేర్ పెంచుకోగలిగింది.
తాజావార్తలు
-
Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
-
RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
-
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్కు అలా కలిసి వచ్చిందా?
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
-
YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!