49th Chief Justice of India : తన వారసుడి పేరును సిఫార్సు చేసిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. ఆయన ఎవరంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ ఈ నెలలోనే పదవీ విరమణ పొందనున్నారు.. అయితే, తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? అనే చర్చ సాగుతోన్న తరుణంలో… ఊహాగానాలకు తెరదించుతూ.. జస్టిస్ యూయూ లలిత్ పేరును సిఫార్సు చేశారు సీజేఐ ఎన్వీ రమణ.. దీంతో, 49వ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు జస్టిస్ యూయూ లలిత్.. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన ఆయన.. పూర్తి పేరు ఉదయ్ ఉమేశ్ లలిత్… తీవ్ర సంచలనం సృష్టించిన ట్రిపుల్ తలాక్ సహా అనేక కీలక అంశాల్లో తీర్పు వెలువరించిన ధర్మాసనాల్లో జస్టిస్ లలిత్ భాగస్వామిగా ఉన్నారు..
Read Also: MP Gorantla Madhav: ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ లీక్…? ఇదే కుట్రే అంటున్న ఎంపీ..
Also Read
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
- Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
- NEET Ranker: కన్నీటి నుంచి పుట్టిన సంకల్పం.. తండ్రి మరణాన్ని స్ఫూర్తిగా మార్చుకుని 'నీట్'లో ర్యాంక్..
- NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
ఇక, జస్టిస్ యూయూ లలిత్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకోనున్నారు.. 1971 జనవరిలో 13వ భారత ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ ఎస్.ఎం.సిక్రీ నేరుగా సుప్రీంకోర్టు జడ్జి అయిన మొదటి న్యాయవాది కాగా.. ఆయన తర్వాత బార్ అసోసియేషన్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై అనంతరం సీజేఐ అయిన రెండో వ్యక్తిగా రికార్డుకెక్కనున్నారు.. ఈ నెల 26వ తేదీన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ చేయనుండగా.. ఈ నెల 27వ తేదీన సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు జస్టిస్ లలిత్.. ఆయన 9 నవంబర్ 1957న జన్మించారు.. జూన్ 1983లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకోగా.. డిసెంబర్ 1985 వరకు బొంబాయి హైకోర్టులో ప్రాక్టీసు చేసి.. జనవరి 1986 నుంచి తన ప్రాక్టీసును సుప్రీంకోర్టుకు మార్చుకున్నారు.. ఇక, ఆగస్టు 13, 2014న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి అనేక కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు..
అయితే, తన వారసుడిగా జస్టిస్ యూయూ లలిత్ పేరును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గురువారం సిఫార్సు చేశారు. ఈరోజు ఉదయం జస్టిస్ లలిత్కు సిఫార్సు కాపీని అందజేశారు సీజేఐ ఎన్వీ రమణ… ఈ నెల 26న పదవీ విరమణ చేయనున్నందున తన వారసుడి పేరును సిఫారసు చేయాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు బుధవారం సీజేఐకి లేఖ రాశారు. జస్టిస్ లలిత్ ఆగస్టు 27న భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, ఆయన 74 రోజుల స్వల్పకాలం సీజేఐగా కొనసాగనున్నారు.. నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు జస్టిస్ లలిత్.. ఆ తర్వాత జస్టిస్ డీవై చంద్రచూడ్ భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవుతారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
-
US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
-
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
-
Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
-
Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!