Wagh Nakh: లండన్ నుంచి ముంబై చేరుకున్న ఛత్రపతి శివాజీ ఆయుధం ‘‘వాఘ్ నఖ్’’
- లండన్ నుంచి ముంబై చేరిన ఛత్రపతి శివాజీ ఆయుధం..
- 350 ఏళ్ల తర్వాత స్వదేశానికి ‘‘వాఘ్ నఖ్’’..
- సతారాలో ప్రదర్శన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wagh Nakh: మరాఠా సామ్రాజ్యనేత ఛత్రపతి శివాజీ మహరాజ్ ఉపయోగించిన ఆయుధం ‘‘వాఘ్ నఖ్’’ లేదా పులి పంజాగా పిలిచే ఆయుధం లండర్ మ్యూజియం నుంచి ముంబైకి చేరుకున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ మునిగంటివార్ తెలిపారు. దీనిని పశ్చిమ మహారాష్ట్ర సతాలకు తీసుకెళ్లనున్నట్లు, శుక్రవారం నుంచి ప్రదర్శించనున్నట్లు చెప్పారు. సతారాలో వాఘ్నఖ్కు ఘన స్వాగతం పలుకుతామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శంభురాజ్ దేశాయ్ మంగళవారం తెలిపారు.
లండన్ నుంచి తీసుకువచ్చిన ఈ ఆయుధానికి బుల్లెట్ ఫ్రూఫ్ కవర్ ఉందని, భద్రతను కట్టుదిట్టం చేశామని ఆయన తెలిపారు. దీన్ని సతారాలోని మ్యూజియంలో 7 నెలల పాటు ఉంచనున్నట్లు వెల్లడించారు. దేశాయ్ మంగళవారం సతారా జిల్లాలోని ఛత్రపతి శివాజీ మ్యూజియం వద్ద భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. మహారాష్ట్రకు వాఘ్ నఖ్ని తీసుకురావడం స్పూర్తిదాయకమైన క్షణమని అన్నారు. దాదాపుగా 350 ఏళ్ల తర్వాత శివాజీ ఆయుధం తిరిగి స్వదేశానికి వస్తోంది.
Also Read
- TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
Read Also: Digvijaya Singh: మన ప్రత్యర్థి ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకోవాలి.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు…
1959లో బీజాపూర్ రాజ్య జనరల్ అఫ్జల్ ఖాన్ని చంపడానికి శివాజీ ఈ పులి పంజా ఆయుధాన్ని ఉపయోగించారు. లండన్లోని విక్టోరియా మరియు ఆల్బర్ట్ మ్యూజియం నుండి మహారాష్ట్రకు ఆయుధాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం అనేక కోట్లు ఖర్చు చేసిందన్న వాదన వస్తున్న వేళ వీటిని మంత్రి మునిగంటివార్ తిరస్కరించారు. ప్రయాణ ఖర్చులు, ఒప్పందంపై సంతకాలు చేయడానికి రూ. 14.08 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. లండన్ మ్యూజియం తొలుత ఏడాదిపాటు ఆయుధాన్ని ఇచ్చేందుకు అంగీకరించిందని, అయితే మహారాష్ట్ర దానిని మూడేళ్లపాటు రాష్ట్రంలో ప్రదర్శనకు అప్పగించేందుకు ఒప్పించిందని తెలిపారు. చాలా ప్రయత్నాల తర్వాత సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం ప్రయత్నాల కారణంగా వాఘ్ నఖ్ మహరాష్ట్రకు వస్తుందని చెప్పారు.
తాజావార్తలు
-
Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
-
Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
-
Thalaivar173 : డాక్టర్ గా సూపర్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే
-
Most Valuable Celebrities List : మోస్ట్ వ్యాల్యుబుల్ సెలబ్రిటి లిస్ట్ విడుదల.. టాప్ ప్లేస్లో ఎవరున్నారు? అల్లు అర్జున్ ర్యాంక్ ఎంత?
-
Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!