4 రోజులుగా నీళ్లలోనే చెన్నై.. తిండిలేక అవస్తలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెన్నై మహానగరం కుండపోత వర్షాలతో గజగజా వణుకుతోంది. ఎక్కడ చూసినా ఈ రెండే కనిపిస్తున్నాయి. రోడ్లన్నీ ఇప్పటికీ నదులను తలపిస్తున్నాయి. చాలా కాలనీలు నీళ్లలో మునిగిపోయి ఉన్నాయి. తినడానికి తిండిలేక, రాత్రిపూట కరెంటు లేక చెన్నై నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ సహాయక చర్యలను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. గురువారం ఉదయం. 8.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు మీనంబాకంలో 60 మిల్లీమీటర్ల వర్షం కురిస్తే, నగుబాకంలో 43 మిల్లీ మీటర్ల వర్సం పడింది. మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు చెన్నై ఎయిర్ పోర్టును మూసివేశారు. భారీ వర్షాలకు తోడు, ఈదురుగాలులు కూడా ఉండటంతో రోడ్లపైన చెట్లు అడ్డంగా కూలిపోయాయి. దాదాపు ఐదొందల కాలనీల్లో వర్షపు నీరి నిలిచిపోయి ఉందని, 65000 ఇళ్లకు ఇప్పటికీ విద్యుత్ సరఫరా లేదని అధికారులు చెబుతున్నారు. ముంపు ప్రాంతాల నుంచి 2440 మందిని రిలీఫ్ క్యాంపులకు తరలించారు.
చెన్నై ఎగ్మూర్ రోడ్డు పూర్తిగా నీట మునిగిపోయి రవాణాకు అంతరాయం ఏర్పడింది. ఇటు సిటీలోని 11 సబ్వేల్లో నీరు వచ్చి చేరడంతో దాన్ని తోడేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 267 చోట్ల చెల్లు కూలిపోయాయని, 68 చోట్ల రోడ్లకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించామని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ చెబుతోంది. ఇక ఫుట్పాత్లపైన జీవించేవారి పరిస్థితి మరీ దారుణంగా మారింది. బస్సు షెల్టర్లలో కూడా నీరు వచ్చి చేరడంతో ఎక్కడ తలదాచుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. తంబరంలోని ప్రభుత్వాస్పత్రి నీట మునిగింది. కేకే నగర్లోని పెరిపెరల్ హాస్పత్రిలోకీ నీరు వచ్చి చేరింది. దీంతో పేషెంట్స్ను స్థానిక ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. టీపీ చత్రంలో వర్షాలకు సృహకోల్పోయిన ఓ వ్యక్తిని స్థానిక సీఐ రాజేశ్వరి తన భుజాలపైన ఎత్తుకుని ఆస్పత్రికి తరలించారు. దీంతో రాజేశ్వరి వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. రెండు మూడు రోజులుగా వర్ష ప్రభావిత ప్రాంతాల్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు రాజేశ్వరి. రోడ్లకు అడ్డంగా పడున్న చెట్లను నరకడంతో పాటు, ఇళ్లలోకి నీరు చేసి, రెండు రోజులుగా ఫస్ట్ ఫ్లోర్లో నివాసం ఉంటున్నవారికి పాలు బిస్కెట్లు సరఫరా చేస్తున్నారు. ఇక, చెన్న ఐఐటీ గ్రౌండ్లోకి వచ్చిన నీటిలో అక్కడి విద్యార్థులు ఈత కొడుతున్న వీడియో ఒకటి వైరల్గా మారింది. ఇక, వర్షాలు, వరదల నేపథ్యంలో.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం..
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!