4 రోజులుగా నీళ్లలోనే చెన్నై.. తిండిలేక అవస్తలు..!
చెన్నై మహానగరం కుండపోత వర్షాలతో గజగజా వణుకుతోంది. ఎక్కడ చూసినా ఈ రెండే కనిపిస్తున్నాయి. రోడ్లన్నీ ఇప్పటికీ నదులను తలపిస్తున్నాయి. చాలా కాలనీలు నీళ్లలో మునిగిపోయి ఉన్నాయి. తినడానికి తిండిలేక, రాత్రిపూట కరెంటు లేక చెన్నై నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ సహాయక చర్యలను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. గురువారం ఉదయం. 8.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు మీనంబాకంలో 60 మిల్లీమీటర్ల వర్షం కురిస్తే, నగుబాకంలో 43 మిల్లీ మీటర్ల వర్సం పడింది. మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు చెన్నై ఎయిర్ పోర్టును మూసివేశారు. భారీ వర్షాలకు తోడు, ఈదురుగాలులు కూడా ఉండటంతో రోడ్లపైన చెట్లు అడ్డంగా కూలిపోయాయి. దాదాపు ఐదొందల కాలనీల్లో వర్షపు నీరి నిలిచిపోయి ఉందని, 65000 ఇళ్లకు ఇప్పటికీ విద్యుత్ సరఫరా లేదని అధికారులు చెబుతున్నారు. ముంపు ప్రాంతాల నుంచి 2440 మందిని రిలీఫ్ క్యాంపులకు తరలించారు.
చెన్నై ఎగ్మూర్ రోడ్డు పూర్తిగా నీట మునిగిపోయి రవాణాకు అంతరాయం ఏర్పడింది. ఇటు సిటీలోని 11 సబ్వేల్లో నీరు వచ్చి చేరడంతో దాన్ని తోడేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 267 చోట్ల చెల్లు కూలిపోయాయని, 68 చోట్ల రోడ్లకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించామని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ చెబుతోంది. ఇక ఫుట్పాత్లపైన జీవించేవారి పరిస్థితి మరీ దారుణంగా మారింది. బస్సు షెల్టర్లలో కూడా నీరు వచ్చి చేరడంతో ఎక్కడ తలదాచుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. తంబరంలోని ప్రభుత్వాస్పత్రి నీట మునిగింది. కేకే నగర్లోని పెరిపెరల్ హాస్పత్రిలోకీ నీరు వచ్చి చేరింది. దీంతో పేషెంట్స్ను స్థానిక ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. టీపీ చత్రంలో వర్షాలకు సృహకోల్పోయిన ఓ వ్యక్తిని స్థానిక సీఐ రాజేశ్వరి తన భుజాలపైన ఎత్తుకుని ఆస్పత్రికి తరలించారు. దీంతో రాజేశ్వరి వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. రెండు మూడు రోజులుగా వర్ష ప్రభావిత ప్రాంతాల్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు రాజేశ్వరి. రోడ్లకు అడ్డంగా పడున్న చెట్లను నరకడంతో పాటు, ఇళ్లలోకి నీరు చేసి, రెండు రోజులుగా ఫస్ట్ ఫ్లోర్లో నివాసం ఉంటున్నవారికి పాలు బిస్కెట్లు సరఫరా చేస్తున్నారు. ఇక, చెన్న ఐఐటీ గ్రౌండ్లోకి వచ్చిన నీటిలో అక్కడి విద్యార్థులు ఈత కొడుతున్న వీడియో ఒకటి వైరల్గా మారింది. ఇక, వర్షాలు, వరదల నేపథ్యంలో.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం..
Also Read
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో