Chennai: మీరు దేవుడయ్యా.. 1000 మంది ఉద్యోగుల్ని స్పెయిన్ ట్రిప్ పంపిన కంపెనీ..
- 1000 మంది ఉద్యోగులకు స్పెయిన్ ట్రిప్..
- చెన్నైకి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ బోనాంజా..
- సొంత ఖర్చులతో వారం రోజుల పాటు ట్రిప్ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chennai: చాలా కంపెనీలు ఉద్యోగుల కన్నా వారికి వచ్చే లాభాలపైనే దృష్టి పెడుతాయి. మనం ఈ స్థాయికి వెళ్లేందుకు ఉద్యోగులు సహకరించారనే విషయాన్ని మరిచిపోతుంటాయి. అయితే కొన్ని కంపెనీలు మాత్రం తమ ఉద్యోగులకు కార్లు, బంగ్లాలు ఇస్తూ వార్తల్లో నిలుస్తుంటాయి. ఇదిలా ఉంటే తాజాగా చెన్నైకి చెందిన ఓ కంపెనీ 1000 మంది ఉద్యోగులను స్పెయిన్లోని బార్సిలోనాకు వారం రోజుల పాటు అన్ని ఖర్చులతో టూర్ ఏర్పాటు చేసింది. చెన్నైకి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ కాసాగ్రాండ్ ఈ నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
‘‘ప్రాఫిట్-షేర్ బోనాంజా’’ కార్యక్రమంలో భాగంగా గతేడాది కంపెనీ ఆర్థిక లక్ష్యాలను సాధించడంతో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులకు ఈ టూర్ ప్యాకేజీ ప్రకటించింది. “కంపెనీ గత ఆర్థిక సంవత్సరం అమ్మకాల లక్ష్యాన్ని చేరుకోవడంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తుల అంకితభావం, నిబద్ధత మరియు సహకార స్ఫూర్తిని గుర్తించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించబడింది” అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎంపిక చేసిన ఉద్యోగుల్లో వివిధ హోదాలు, విభాగాలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ నుంచి సీనియర్ లీడర్ షిప్ వరకు ఉద్యోగులు ఉన్నారు.
Also Read
- Fire Break : ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
- PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
Read Also: Venkatesh: సంక్రాంతికి వస్తున్నాం, బాలయ్య, చరణ్ సినిమాలన్నీ అద్భుతంగా ఆడాలి!
‘‘ఈ స్పెయిన్ ట్రిప్లో ఉద్యోగులు సగ్రడా ఫ్యామిలియా, పార్క్ గుయెల్, మోంట్జుక్ కాజిల్ వంటి ఐకానిక్ ల్యాండ్ మార్క్లకు వెళ్తారు. భారత్, దుబాయ్ కార్యాలయాల్లోని ఉద్యోగులను ఒక చోట చేర్చి సుందరమైన, గొప్ప సాంస్కృతిక, చారిత్రక, సుందరమైన ప్రదేశాలు కలిగిన స్పెయిన్ అందాలను ఆస్వాదించడానికి వారిని ఆహ్వానిస్తుంది. ’’ కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది.
కాసాగ్రాండ్ గ్లోబల్ రికార్డ్ ప్రోగ్రామ్ 2013 నుంచి సంప్రదాయంగా తన ఉద్యోగుల్ని ఇలా టూర్లకు పంపుతోంది. గత కొన్ని ఏళ్లుగా సింగపూర్, థాయ్లాండ్, శ్రీలంక, దుబాయ్, మలేషియా, లండన్తో సహా అనేక విదేశీ ప్రాంతాలకు ఉద్యోగుల్ని పంపుతోంది. 2021లో ఉద్యోగులు దుబాయ్, అబుదాబి టూర్కి వెళ్లారు. 2022లో స్విట్జర్లాండ్, 2023లో ఆస్ట్రేలియా టూర్లకు వెళ్లారు.
తాజావార్తలు
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి