PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
- ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్ డేట్
- పీఎం కిసాన్ 23వ విడత జూన్ 18న వస్తుందా?
- జూన్ 18 గురించి ఎందుకు చర్చిస్తున్నారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నైరుతి రుతుపవనాల పలకరింపుతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో తొలకరిజల్లులు కురుస్తున్నాయి. దీంతో అన్నదాతలు ఖరీఫ్ సీజన్ కు సిద్ధమవుతున్నారు. వ్యవసాయానికి పెట్టుబడి అవసరమవడంతో రైతన్నలు కేంద్ర ప్రభుత్వం అందించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. పీఎం కిసాన్ (PM-KISAN) పథకం 23వ విడత కోసం దేశవ్యాప్తంగా రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 18 తేదీపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆ రోజే రైతుల ఖాతాల్లో రూ.2,000 జమ కావచ్చని ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం లేదా వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
జూన్ 18న 23వ విడత విడుదల అవుతుందా?
పీఎం కిసాన్ పథకం కింద 22వ విడతను 2026 మార్చి 13న విడుదల చేశారు. దీంతో తదుపరి విడత ఎప్పుడు వస్తుందనే ఆసక్తి రైతుల్లో నెలకొంది. ప్రస్తుతం జూన్ 18 తేదీపై ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ, ప్రభుత్వం నుంచి అధికారిక ధృవీకరణ లేనందున ఆ రోజే నిధులు విడుదల అవుతాయని చెప్పలేం.
Also Read
- Sonam Wangchuk: విద్యార్థులపై కేసులుండవు, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం.. కేంద్రం ఇచ్చిన హామీలు ఇవే!
- CJP Protest: వెనక్కి తగ్గని CJP.. ఉద్యమం కొనసాగుతుందని ప్రకటన..
- Sachin Tendulkar: "ఓటమి ఓకే కానీ మోసం నేరం”.. NEET విద్యార్థుల ఉద్యమంపై సచిన్ భావోద్వేగ సందేశం!
- Naresh Pal Gangwar: నీట్ పేపర్ లీక్ నిరసనలు.. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిని తొలగించిన కేంద్రం.. కొత్త కార్యదర్శి ఎవరంటే?
జూన్ 18 తేదీపై చర్చ ఎందుకు?
2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూన్ 18న పీఎం కిసాన్ 17వ విడతను విడుదల చేశారు. ఆ సందర్భంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా 9.26 కోట్లకు పైగా రైతుల ఖాతాలకు రూ.20,000 కోట్లకుపైగా బదిలీ చేశారు. ఆ గత అనుభవం ఆధారంగా ఈసారి కూడా జూన్ 18న విడత విడుదల కావచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే, అధికారిక ప్రకటన వచ్చే వరకు దీనిని కేవలం ఊహాగానంగానే పరిగణించాలి.
జూన్లో విడుదలయ్యే అవకాశాలు ఎంత?
సాధారణంగా పీఎం కిసాన్ పథకం కింద ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడత విడుదల చేస్తారు. 22వ విడత మార్చి మధ్యలో విడుదల కావడంతో, 23వ విడత జూన్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఖచ్చితమైన తేదీపై స్పష్టత రావాలంటే కేంద్ర ప్రభుత్వం లేదా వ్యవసాయ మంత్రిత్వ శాఖ నుంచి అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.
రైతులు ఏం చేయాలి?
పీఎం కిసాన్ పోర్టల్లో e-KYC పూర్తి చేసి ఉండాలి.
ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు సరిగా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలి.
భూ రికార్డుల ధృవీకరణ పూర్తైందో లేదో చూసుకోవాలి.
అధికారిక ప్రకటనలపై మాత్రమే ఆధారపడాలి.
ప్రస్తుతం 23వ విడత విడుదల తేదీపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా, జూన్ నెలలోనే నిధులు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Ramayana Trailer: చివరి నిమిషంలో ‘రామాయణ’ ట్రైలర్ వాయిదా.. అసలు కారణం ఏంటంటే?
-
Sonam Wangchuk: విద్యార్థులపై కేసులుండవు, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం.. కేంద్రం ఇచ్చిన హామీలు ఇవే!
-
India vs Afghanistan: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. భారత్ గడ్డపై టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనున్న ఆఫ్ఘనిస్థాన్.. పూర్తి షెడ్యూల్..
-
Stock Market Crash: ఒకే ఒక్క నిర్ణయం.. కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్, భారీ నష్టాల్లో టాప్ 10 షేర్లు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?
-
Shreyas Iyer: ఆ ఇద్దరే మ్యాచ్ గెలిపించారు.. మాటలు రావడం లేదు.. తొలి విజయంపై శ్రేయస్ భావోద్వేగం!