India Pakistan: భారత్ దెబ్బ అదుర్స్.. పాకిస్తాన్లో ఎండిపోయిన చీనాబ్ నది..
- భారత్ దెబ్బ అదుర్స్..
- పాకిస్తాన్లో ఎండిపోయిన చీనాబ్ నది..
- 4 రోజుల్లోనే నీరు లేకుండా మారిన చీనాబ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి పాకిస్తాన్కి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. భారత్ ఎప్పుడు, ఎలా, ఎక్కడ విరుచుకుపడుతుందో తెలియక ఆ దేశం భయాందోళనలో ఉంది. బయటకు భారత్ని తాము సమర్థవంతంగా ఎదుర్కొంటామని ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ, ఈ ఘర్షణ ముగించేందుకు పాక్ అంతర్జాతీయ సాయాన్ని కోరుతోంది. తటస్థ, పారదర్శక విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రకటిస్తోంది.
26 మంది అమాయకపు టూరిస్టుల్ని బలి తీసుకున్న పహల్గామ్ దాడి తర్వాత, భారత్ ఉగ్రవాదంపై మరింత అణిచివేత ఉంటుందని చెప్పింది. ఈ దాడిలో పాక్ ఉగ్రవాదులు పాల్గొన్నట్లు, పాక్ ప్రమేయం ఉన్నట్లు స్పష్టంగా తేలింది. దీంతో భారత్, పాక్పై దౌత్య చర్యలు తీసుకుంది. పాకిస్తాన్లో 80 శాతం జనాభాకు జీవనాడి అయిన సింధు నదికి సంబంధించి ‘‘సింధు జలాల ఒప్పందం’’ని రద్దు చేసుకుంది. ఈ చర్యలో పాక్ భయపడుతోంది. దీనిని తాము ‘‘యుద్ధ చర్య’’గా భావిస్తామని చెప్పింది. సింధు జలాలను అడ్డుకుంటే, భారత్ పై దాడి చేస్తామని పాక్ హెచ్చరిస్తోంది.
Also Read
- Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
- Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
- Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
- MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
Read Also: Cabinet Decisions: జనాభా లెక్కలతో పాటే ‘‘కులగణన’’.. కేంద్రం సంచలన నిర్ణయం..
ఇదిలా ఉంటే, పాకిస్తాన్కి అసలు దెబ్బ రుచి చూపించింది భారత్. చీనాబ్ నది జలాలను భారత్ నిలిపేయడంతో పాకిస్తాన్లోని సియాల్కోట్ నగరంలో చీనాబ్ నది ఎండిపోయింది. కేవలం 4 రోజుల్లోనే నదిలోని ప్రవాహం కనుమరుగైంది. ఇన్నాళ్లు పాకిస్తాన్ ఎన్ని దాడులు, యుద్ధాలు చేసినా, 1960లో జరిగిన ‘‘ఇండస్ వాటర్ ట్రిటీ’’ జోలికి భారత్ వెళ్లలేదు. కానీ, దీనిని ఆసరగా చేసుకుంటూ పాక్ పదేపదే సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే ఉంది. సింధు జలాల ఒప్పందం ప్రకారం, భారతదేశానికి రవి, బియాస్, సట్లేజ్ నదులపై హక్కులు ఉంటే, పాకిస్తాన్కి సింధు, జీలం, చీనాబ్ నదులపై హక్కులు ఉన్నాయి. ప్రస్తుతం భారత్ ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో పాక్ గొంతు ఎండటం ఖాయంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
-
Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
-
KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
-
Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
-
Donald Trump: గూగుల్, చాట్జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!