Free Ration Scheme: గుడ్ న్యూస్.. మరో మూడు నెలల పాటు ఫ్రీ రేషన్ పథకం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Centre To Extend Free Ration Scheme By Three More Months: కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పేదలకు అందించే ఉచిత రేషన్ పథకాన్ని పొడగించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బుధవారం దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరో మూడు నెలల పాలు ఉచిత రేషన్ పథకాన్ని అందించేందకు కేంద్రం కసరత్తు చేస్తోంది. కోవిడ్ మహమ్మారి సమయంలో 2020లో ఈ పథకం కింద పేదలకు ప్రతీ నెల ఒక్కొక్కరికి 5 కిలోల ఉచిత ఆహార ధాన్యాలు అందించబడుతున్నాయి. ఈ పథకం సెప్టెంబర్ 30తో ముగుస్తున్న తరుణంలో మరో మూడు నెలల పాలు ఉచిత రేషన్ పథకాన్ని పొడగించబోతోంది కేంద్రం. వచ్చే పండగ సీజన్ దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Read Also: Asaduddin Owaisi: పీఎఫ్ఐని నిషేధించారు.. మరి వారి సంగతి..?
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
డిసెంబర్ లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతోన్న తరుణంలో దీన్ని కోసమే కేంద్రం ఉచిత రేషన్ పథకాన్ని మరో మూడు నెలల పాలు పొడగించుతున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఈ పథకం పొడగింపు వల్ల జాతీయ దేశ ఖజానాపై రూ.45,000 కోట్ల భారం పడే అవకాశం ఉంది. అయితే అదనపు ఆర్థిక భారం దృష్ట్యా ఈ పథకం కింద అందించే ఆహార పదార్థాల పరిమాణాన్ని తగ్గించాలని భావించినప్పటికీ.. కేంద్రం మాత్రం ప్రస్తుతం ఉన్న విధంగానే పథకాన్ని కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే అమలవుతున్న సబ్సిడీల కారణంగా.. ఉచిత రేషన్ పథకాన్ని కొనసాగిస్తే ఖనానాపై భారం పడుతుందని ఆర్థిక మంత్విత్వ శాఖ తెలిపింది. గత రెండేళ్లుగా ఈ పథకం కింద రూ. 2.6 లక్షల కోట్లు ఖర్చు చేశారు. మార్చి 2020లో కోవిడ్-19 మహ్మమారి కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించారు. అప్పటి నుంచి ప్రతీ వ్యక్తికి నెలకు ఒక్కొక్కరికి 5 కిలోల ఆహారధాన్యాన్ని ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన( పీఎం-జీకేఏవై) పథకం కింద అందిస్తోంది. దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది ఈ పథకం వల్ల లబ్ధిపొందుతున్నారు.
తాజావార్తలు
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..