Free Ration Scheme: గుడ్ న్యూస్.. మరో మూడు నెలల పాటు ఫ్రీ రేషన్ పథకం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Centre To Extend Free Ration Scheme By Three More Months: కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పేదలకు అందించే ఉచిత రేషన్ పథకాన్ని పొడగించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బుధవారం దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరో మూడు నెలల పాలు ఉచిత రేషన్ పథకాన్ని అందించేందకు కేంద్రం కసరత్తు చేస్తోంది. కోవిడ్ మహమ్మారి సమయంలో 2020లో ఈ పథకం కింద పేదలకు ప్రతీ నెల ఒక్కొక్కరికి 5 కిలోల ఉచిత ఆహార ధాన్యాలు అందించబడుతున్నాయి. ఈ పథకం సెప్టెంబర్ 30తో ముగుస్తున్న తరుణంలో మరో మూడు నెలల పాలు ఉచిత రేషన్ పథకాన్ని పొడగించబోతోంది కేంద్రం. వచ్చే పండగ సీజన్ దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Read Also: Asaduddin Owaisi: పీఎఫ్ఐని నిషేధించారు.. మరి వారి సంగతి..?
Also Read
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
- Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
- KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
డిసెంబర్ లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతోన్న తరుణంలో దీన్ని కోసమే కేంద్రం ఉచిత రేషన్ పథకాన్ని మరో మూడు నెలల పాలు పొడగించుతున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఈ పథకం పొడగింపు వల్ల జాతీయ దేశ ఖజానాపై రూ.45,000 కోట్ల భారం పడే అవకాశం ఉంది. అయితే అదనపు ఆర్థిక భారం దృష్ట్యా ఈ పథకం కింద అందించే ఆహార పదార్థాల పరిమాణాన్ని తగ్గించాలని భావించినప్పటికీ.. కేంద్రం మాత్రం ప్రస్తుతం ఉన్న విధంగానే పథకాన్ని కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే అమలవుతున్న సబ్సిడీల కారణంగా.. ఉచిత రేషన్ పథకాన్ని కొనసాగిస్తే ఖనానాపై భారం పడుతుందని ఆర్థిక మంత్విత్వ శాఖ తెలిపింది. గత రెండేళ్లుగా ఈ పథకం కింద రూ. 2.6 లక్షల కోట్లు ఖర్చు చేశారు. మార్చి 2020లో కోవిడ్-19 మహ్మమారి కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించారు. అప్పటి నుంచి ప్రతీ వ్యక్తికి నెలకు ఒక్కొక్కరికి 5 కిలోల ఆహారధాన్యాన్ని ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన( పీఎం-జీకేఏవై) పథకం కింద అందిస్తోంది. దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది ఈ పథకం వల్ల లబ్ధిపొందుతున్నారు.
తాజావార్తలు
-
Dravid: ద్రవిడ్ వారసుడు వచ్చేస్తున్నాడు.. అండర్-19 జట్టుకు ఎంపికైన రాహుల్ ద్రవిడ్ కుమారుడు..
-
Bhairavi Aarthya : పర్ఫెక్షన్ కోసం టాలీవుడ్ కొత్త హీరోయిన్ భైరవి సంచలనం!
-
Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
-
Health Benefits of Eggs: ప్రతిరోజూ ఒక గుడ్డు తింటున్నారా..? శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే..
-
MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!