All-Party Meeting: ప్రధాని మోడీ అధ్యక్షతన నేడు జీ-20 సన్నాహక సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీ వేదికగా కీలక సమావేశం జరగనుంది.. భారత్ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది సెప్టెంబర్లో జరగనున్న జీ–20 సదస్సుకు సంబంధించిన సన్నాహక సమావేశం ఇది.. అంటే, జీ-20 సదస్సులో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచన కోసం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అధినేతలను సమావేశానికి ఆహ్వానించారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి.. ఈ సమావేశానికి దాదాపుగా 40 రాజకీయ పార్టీలకు చెందిన చీఫ్లు హాజరుకానున్నట్టు తెలుస్తోంది.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి జైశంకర్ తదితరులు హాజరుకానున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ సమావేశానికి వెళ్లనున్నారు.. ఇక, బీజేపీకి దూరంగా ఉంటూ వస్తున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సైతం ఈ సమావేశానికి హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
భారతదేశం అధికారికంగా డిసెంబర్ 1న జీ20 ప్రెసిడెన్సీని స్వీకరించింది. జీ–20 శిఖరాగ్ర సదస్సుకి ముందు హైదరాబాద్ సహా దేశవ్యా ప్తంగా 200కిపైగా సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైంది కేంద్రం.. మరోవైపు జీ–20 మొట్టమొదటి ప్రతినిధుల సదస్సు రాజస్థాన్లోని ఉదయపూర్లో ఆదివారం నిర్వహించారు.. సమ్మిళిత అభివృద్ధి, మెరుగైన జీవన ప్రమాణాలు, ఆరోగ్య రంగంలో సదుపాయాలు, నాణ్యమైన జీవనం వంటివాటిపై భారత్ ప్రతినిధి అమితాబ్ కాంత్ మాట్లాడారు. ఇక, దేశాధినేతలు లేదా ప్రభుత్వాల స్థాయిలో తదుపరి జీ20 లీడర్స్ సమ్మిట్ వచ్చే ఏడాది సెప్టెంబర్ 9 మరియు 10 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనుంది. ఇక, ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ అఖిలపక్ష సమావేశంలో పాల్గొననున్నారు. అయితే తాను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కాకుండా తృణమూల్ కాంగ్రెస్ చైర్పర్సన్ హోదాలో ఈ సమావేశంలో పాల్గొంటానని బెనర్జీ చెప్పారు. కాగా, ఇండోనేషియా ఈ నెల ప్రారంభంలో బాలి సమ్మిట్లో వచ్చే సంవత్సరానికి జీ 20 అధ్యక్ష పదవిని భారతదేశానికి అప్పగించింది, ఇది ప్రతి భారతీయ పౌరుడికి గర్వకారణమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. జీ 20 లేదా గ్రూప్ ఆఫ్ 20 అనేది ప్రపంచంలోని ప్రధాన అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల యొక్క ఇంటర్ గవర్నమెంటల్ ఫోరమ్.
తాజావార్తలు
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..