Sri Lanka Crisis: శ్రీలంకలోని తమిళులకు స్టాలిన్ సర్కార్ భారీ సాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ప్రజలు నరకం చూస్తున్నారు.. కొనే పరిస్థితి లేదు.. అమ్మడానికి కూడా ఏమీ లేదు అనే తరహాలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి.. ఇప్పటికే శ్రీలంకకు భారత్ భారీ సాయం చేయగా.. ఇప్పుడు.. శ్రీలంకలోని తమిళులకు సాయం చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం సిద్ధమైంది. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ తరపున కోటి రూపాయలు విరాళంగా ఇవ్వనున్నారు.. ప్రభుత్వం తరపున మొదటి విడతగా 40 వేల టన్నుల బియ్యం, 500 టన్నుల మిల్క్ పౌడర్, సహా అత్యవసరమైన మందులు పంపిణీ చేయనున్నారు.. మొత్తం, రూ.123 కోట్ల విలువైన నిత్యావసర వస్తువులు, సరుకులను సరఫరా చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. శ్రీలంక తమిళులకు చేయూత నివ్వాలని ఇటీవలే అసెంబ్లీలో తీర్మానం చేశారు సీఎం స్టాలిన్.
Read Also: Marriage: 15 ఏళ్లుగా సహజీవనం.. ఒకేసారి ముగ్గురు మహిళలతో పెళ్లి..
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
కాగా, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంకలో అత్యవసర, నిత్యావసర వస్తువులను కొనలేని పరిస్థితి వచ్చింది.. అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో అక్కడి ప్రజలు కనీసం నిత్యావసర సరుకులను కూడా కొనుగోలు చేయడం భారంగా మారింది. పెట్రోలు, డీజిల్, కిరోసిన్, గ్యాస్, నిత్యావసరాలు ఏవైనా కొనుగోలు చేయాలంటే గంటల తరబడి క్యూలైన్లలో వేచిచూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు, విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. విద్యుత్ లేని కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలను కూడా మూసివేయాల్సిన పరిస్థితి.. ఈ క్రమంలో శ్రీలంకకు భారత్ సహా మిత్రదేశాలు స్నేహహస్తం అందిస్తూ.. సాయం చేస్తున్న విషయం తెలిసిందే కాగా.. స్టాలిన్ సర్కార్ కూడా శ్రీలంకకు అత్యవసర వస్తువులను, ఆహార పదార్థాలు, మందులను అందజేయాలని నిర్ణయించింది. మరోదేశానికి పంపే పనికాబట్టి.. నేరుగా శ్రీలంకకే పంపే అవకాశం లేకపోవడంతో.. కేంద్రం అనుమతి కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి.. గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపింది.. మరోవైపు, సీఎం స్టాలిన్ కూడా ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఇక, కేంద్రం నుంచి అనుమతి రావడంతో.. త్వరలోనే తమిళనాడు సాయం.. శ్రీలంకకు అందనుంది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!