బీజేపీయేతర రాష్ట్రాలంటే అంత అలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తుందా? కావాలనే శకటాలను ఎంపిక చేయలేదా? అన్న ప్రశ్నలు మరోసారి తెరమీదకు వచ్చాయి. రిపబ్లిక్ డే శకటాల విషయంలో.. కేంద్ర-రాష్ట్రాల మధ్య మరో వివాదం రాజుకుంది. అయితే దీనితో తమకు సంబంధం లేదని చెబుతోంది కేంద్రం. గణతంత్ర వేడుకల్లో కొన్ని రాష్ట్రాల శకటాలకు ప్రాతినిధ్యం లభించకపోవడం పట్ల కేంద్రం, ఆయా రాష్ట్రాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు మొదలయ్యాయి.
తెలుగు రాష్ట్రాల శకటాలకు మరోసారి అనుమతి దక్కలేదు. రిపబ్లిక్ డే వేడుకల్లో 12 రాష్ట్రాలు, 9 శాఖల శకటాలకు అనుమతినిచ్చింది కేంద్రం.. తెలంగాణ, ఏపీకి మాత్రం మళ్లీ నిరాశే మిగిల్చింది. దక్షిణాదిలో ఒక్క కర్ణాటక తప్పా.. మిగతా రాష్ట్రాల శకటాలను ఎంపిక చేయలేదు. శకటాల విషయంలో కేంద్ర-రాష్ట్రాల మధ్య వివాదం ముదురుతోంది. ఇప్పటికే బెంగాల్ శకటాన్ని కేంద్రం కావాలనే ఎంపిక చేయలేదని.. తమ రాష్ట్ర శకటాన్ని తిరస్కరించి బెంగాల్ ప్రజలను అవమానించారని సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. దీనిపై జోక్యం చేసుకోవాలని ప్రధాని మోడీకి లేఖ రాశారు.
Also Read
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
తమ రాష్ట్రాల శకటాలకు స్థానం కల్పించకపోవడంపై పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేరళ కూడా తీవ్ర ఆరోపణలు చేసింది. తమ శకటాన్ని తిరస్కరించడంపై ముఖ్యమంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అటు కేరళతో పాటు పలు రాష్ట్రాల నేతలు కూడా తమ రాష్ట్రాన్ని అవమానించారంటూ కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో శకటాల లొల్లి తారా స్థాయికి చేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వివాదాస్పదమైంది.
మమతా, స్టాలిన్ విమర్శలపై కేంద్రం స్పందించింది. కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ ప్రతిపాదించిన శకటాలను తిరస్కరించడంలో తమ పాత్రేమి లేదని.. ఏయే శకటాలను అనుమతించాలనేది నిపుణుల కమిటీ నిర్ణయిస్తుందని తేల్చి చెప్పింది. రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టిస్తుందని తెలిపింది కేంద్రం. ఈ వివాదంపై జర్మనీలో ఉంటున్న నేతాజీ కుమార్తె అనితా బోస్ కూడా స్పందించారు. నేతాజీ 125వ జయంతి సందర్భంగా జరుగుతున్న గణతంత్ర ఉత్సవాల్లో.. ఆయన గుర్తుగా రూపొందించిన శకటం లేకపోవడం వింతగా ఉందన్నారు. ఇందులో రాజకీయ కారణాలు ఉన్నాయని విమర్శించారామె.
2018, 2021 గణతంత్ర వేడుకల్లో కేరళ శకటానికి స్థానం దక్కించుకుంది. తమిళనాడు శకటం 2016, 2017, 2019, 2020, 2021 వేడుకల్లో… పశ్చిమ బెంగాల్ శకటం 2016, 2017, 2019, 2021 ఉత్సవాల్లో ప్రాతినిధ్యం వహించాయి. సున్నితమయిన అంశాలపై విమర్శలు చేయడం మంచిదికాదంటోంది బీజేపీ.
తాజావార్తలు
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!