బీజేపీయేతర రాష్ట్రాలంటే అంత అలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తుందా? కావాలనే శకటాలను ఎంపిక చేయలేదా? అన్న ప్రశ్నలు మరోసారి తెరమీదకు వచ్చాయి. రిపబ్లిక్ డే శకటాల విషయంలో.. కేంద్ర-రాష్ట్రాల మధ్య మరో వివాదం రాజుకుంది. అయితే దీనితో తమకు సంబంధం లేదని చెబుతోంది కేంద్రం. గణతంత్ర వేడుకల్లో కొన్ని రాష్ట్రాల శకటాలకు ప్రాతినిధ్యం లభించకపోవడం పట్ల కేంద్రం, ఆయా రాష్ట్రాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు మొదలయ్యాయి.
తెలుగు రాష్ట్రాల శకటాలకు మరోసారి అనుమతి దక్కలేదు. రిపబ్లిక్ డే వేడుకల్లో 12 రాష్ట్రాలు, 9 శాఖల శకటాలకు అనుమతినిచ్చింది కేంద్రం.. తెలంగాణ, ఏపీకి మాత్రం మళ్లీ నిరాశే మిగిల్చింది. దక్షిణాదిలో ఒక్క కర్ణాటక తప్పా.. మిగతా రాష్ట్రాల శకటాలను ఎంపిక చేయలేదు. శకటాల విషయంలో కేంద్ర-రాష్ట్రాల మధ్య వివాదం ముదురుతోంది. ఇప్పటికే బెంగాల్ శకటాన్ని కేంద్రం కావాలనే ఎంపిక చేయలేదని.. తమ రాష్ట్ర శకటాన్ని తిరస్కరించి బెంగాల్ ప్రజలను అవమానించారని సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. దీనిపై జోక్యం చేసుకోవాలని ప్రధాని మోడీకి లేఖ రాశారు.
Also Read
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు బిగ్ షాక్.. రాజ్యసభ ఆశలు ఆవిరి
- NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
- Supreme Court: 'గృహిణులు జాతి నిర్మాతలు'.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
- Kalyan Banerjee: "నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?" మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
తమ రాష్ట్రాల శకటాలకు స్థానం కల్పించకపోవడంపై పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేరళ కూడా తీవ్ర ఆరోపణలు చేసింది. తమ శకటాన్ని తిరస్కరించడంపై ముఖ్యమంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అటు కేరళతో పాటు పలు రాష్ట్రాల నేతలు కూడా తమ రాష్ట్రాన్ని అవమానించారంటూ కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో శకటాల లొల్లి తారా స్థాయికి చేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వివాదాస్పదమైంది.
మమతా, స్టాలిన్ విమర్శలపై కేంద్రం స్పందించింది. కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ ప్రతిపాదించిన శకటాలను తిరస్కరించడంలో తమ పాత్రేమి లేదని.. ఏయే శకటాలను అనుమతించాలనేది నిపుణుల కమిటీ నిర్ణయిస్తుందని తేల్చి చెప్పింది. రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టిస్తుందని తెలిపింది కేంద్రం. ఈ వివాదంపై జర్మనీలో ఉంటున్న నేతాజీ కుమార్తె అనితా బోస్ కూడా స్పందించారు. నేతాజీ 125వ జయంతి సందర్భంగా జరుగుతున్న గణతంత్ర ఉత్సవాల్లో.. ఆయన గుర్తుగా రూపొందించిన శకటం లేకపోవడం వింతగా ఉందన్నారు. ఇందులో రాజకీయ కారణాలు ఉన్నాయని విమర్శించారామె.
2018, 2021 గణతంత్ర వేడుకల్లో కేరళ శకటానికి స్థానం దక్కించుకుంది. తమిళనాడు శకటం 2016, 2017, 2019, 2020, 2021 వేడుకల్లో… పశ్చిమ బెంగాల్ శకటం 2016, 2017, 2019, 2021 ఉత్సవాల్లో ప్రాతినిధ్యం వహించాయి. సున్నితమయిన అంశాలపై విమర్శలు చేయడం మంచిదికాదంటోంది బీజేపీ.
తాజావార్తలు
-
Pooja Hegde: సీఎంపైనే పూజా హెగ్డే ఆశలు!
-
Nikhil Chaudhary: కాటేరమ్మ కొడుకు స్థానంలో నిఖిల్ చౌదరి.. రికార్డు అదిరిపోయింది..
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు బిగ్ షాక్.. రాజ్యసభ ఆశలు ఆవిరి
-
వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే ‘ER-100’ ఇంజెక్షన్.. తొలి రోగికి డోస్ సక్సెస్! ఇక మానవులు అమరులు అవుతారా?
-
Allu Aravind: ఇప్పుడు లవ్ స్టోరీస్ అన్నిటికీ ఓయోలో ఎండ్ కార్డ్.. అల్లు అరవింద్ సంచలనం
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!