బీజేపీయేతర రాష్ట్రాలంటే అంత అలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తుందా? కావాలనే శకటాలను ఎంపిక చేయలేదా? అన్న ప్రశ్నలు మరోసారి తెరమీదకు వచ్చాయి. రిపబ్లిక్ డే శకటాల విషయంలో.. కేంద్ర-రాష్ట్రాల మధ్య మరో వివాదం రాజుకుంది. అయితే దీనితో తమకు సంబంధం లేదని చెబుతోంది కేంద్రం. గణతంత్ర వేడుకల్లో కొన్ని రాష్ట్రాల శకటాలకు ప్రాతినిధ్యం లభించకపోవడం పట్ల కేంద్రం, ఆయా రాష్ట్రాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు మొదలయ్యాయి.
తెలుగు రాష్ట్రాల శకటాలకు మరోసారి అనుమతి దక్కలేదు. రిపబ్లిక్ డే వేడుకల్లో 12 రాష్ట్రాలు, 9 శాఖల శకటాలకు అనుమతినిచ్చింది కేంద్రం.. తెలంగాణ, ఏపీకి మాత్రం మళ్లీ నిరాశే మిగిల్చింది. దక్షిణాదిలో ఒక్క కర్ణాటక తప్పా.. మిగతా రాష్ట్రాల శకటాలను ఎంపిక చేయలేదు. శకటాల విషయంలో కేంద్ర-రాష్ట్రాల మధ్య వివాదం ముదురుతోంది. ఇప్పటికే బెంగాల్ శకటాన్ని కేంద్రం కావాలనే ఎంపిక చేయలేదని.. తమ రాష్ట్ర శకటాన్ని తిరస్కరించి బెంగాల్ ప్రజలను అవమానించారని సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. దీనిపై జోక్యం చేసుకోవాలని ప్రధాని మోడీకి లేఖ రాశారు.
Also Read
- Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
తమ రాష్ట్రాల శకటాలకు స్థానం కల్పించకపోవడంపై పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేరళ కూడా తీవ్ర ఆరోపణలు చేసింది. తమ శకటాన్ని తిరస్కరించడంపై ముఖ్యమంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అటు కేరళతో పాటు పలు రాష్ట్రాల నేతలు కూడా తమ రాష్ట్రాన్ని అవమానించారంటూ కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో శకటాల లొల్లి తారా స్థాయికి చేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వివాదాస్పదమైంది.
మమతా, స్టాలిన్ విమర్శలపై కేంద్రం స్పందించింది. కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ ప్రతిపాదించిన శకటాలను తిరస్కరించడంలో తమ పాత్రేమి లేదని.. ఏయే శకటాలను అనుమతించాలనేది నిపుణుల కమిటీ నిర్ణయిస్తుందని తేల్చి చెప్పింది. రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టిస్తుందని తెలిపింది కేంద్రం. ఈ వివాదంపై జర్మనీలో ఉంటున్న నేతాజీ కుమార్తె అనితా బోస్ కూడా స్పందించారు. నేతాజీ 125వ జయంతి సందర్భంగా జరుగుతున్న గణతంత్ర ఉత్సవాల్లో.. ఆయన గుర్తుగా రూపొందించిన శకటం లేకపోవడం వింతగా ఉందన్నారు. ఇందులో రాజకీయ కారణాలు ఉన్నాయని విమర్శించారామె.
2018, 2021 గణతంత్ర వేడుకల్లో కేరళ శకటానికి స్థానం దక్కించుకుంది. తమిళనాడు శకటం 2016, 2017, 2019, 2020, 2021 వేడుకల్లో… పశ్చిమ బెంగాల్ శకటం 2016, 2017, 2019, 2021 ఉత్సవాల్లో ప్రాతినిధ్యం వహించాయి. సున్నితమయిన అంశాలపై విమర్శలు చేయడం మంచిదికాదంటోంది బీజేపీ.
తాజావార్తలు
-
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
-
BKU : తెలుగులో బెత్లెహం కుడుంబ యూనిట్.. మరో ప్రేమలు అవుతుందా..?
-
Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
-
Romanchakam Overseas Review : రోమాంచకం ఓవర్సీస్ ప్రీమియర్ రివ్యూ
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!