Central Cabinet Decisions: వ్యవసాయానికి టెక్నాలజీ జోడింపు.. రైతాంగం కోసం కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- రైతాంగం కోసం కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- అగ్రికల్చర్ మిషన్ ఏర్పాటుకు నిధులు..
- రాబోయే రోజుల్లో రైతులకు 20 నిమిషాల్లోనే రుణాలు..
- వ్యవసాయానికి టెక్నాలజీ జోడింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Cabinet Decisions: ఈ రోజు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశ రైతాంగం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతాంగం కోసం రూ.13,966 కోట్లను కేంద్రం కేటాయించింది. రూ. 2817 కోట్లతో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ఏర్పాటు చేయనుంది. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ద్వారా వ్యవసాయానికి టెక్నాలజీని జోడిస్తూ రైతులకు మరింత మేలు చేయాలని కేంద్రం భావిస్తోంది. భవిష్యత్తులో రైతులు లోన్ తీసుకోవడం కేవలం 20 నిమిషాల్లోనే పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తోంది.
రూ. 3979 కోట్లతో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ కోసం క్రాప్ సైన్స్ ఏర్పాటు చేయనున్నారు. 2047 నాటికి వాతావరణ పరిస్థితులను తట్టుకునే పంటను పండించేలా రైతులు సిద్ధం చేయనున్నారు. అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ మరింత బలోపేతం చేసేందుకు రూ. 2291 కోట్లతో ప్రణాళిక రూపొందించనున్నారు. ప్రస్తుతం ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు పరిశోధనలు జరగనున్నాయి. రూ. 1702 కోట్లతో పశువులు వాటి ఆరోగ్యం, డైరీ ఉత్పత్తులపై ఫోకస్ చేయనున్నారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
రూ. 860 కోట్లతో హార్టికల్చర్ అభివృద్ధి కోసం కేటాయించారు. దీని ద్వారా రైతుల ఆదాయాన్ని మరింతగా పెంచనున్నారు. కృషి విజ్ఞాన్ కేంద్ర అభివృద్ధి కోసం రూ. 1,202 కోట్లు, నేచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ కోసం రూ.1,115 కోట్ల రూపాయల కేటాయించేందుకు కేబినెట్ అంగీకారం తెలిపిందడి.
ఇదిలా ఉంటే రూ.18,036 కోట్ల రూపాయలతో 309 కిలోమీటర్ల మన్మాడ్- ఇండోర్ కొత్త మార్గ నిర్మాణం కోసం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ద్వారా ఇతర రంగాలపై కూడా మంచి ఫలితాలు ఉంటాయని కేబినెట్ చర్చించింది. ఇప్పటి వరకు నాలుగు ప్రాజెక్టులకు అనుమతి లభించింది. వచ్చే ఏడాది మధ్యలో మొదటి ప్రాజెక్ట్ రెడీ కానుంది. సెమి కండక్టర్ ఇండస్ట్రీ మెరుగైన ఫలితాలను ఇవ్వబోతోంది.
#WATCH | Union Minister Ashwini Vaishnaw says, "Today, 7 major decisions have been taken in the cabinet meeting for improving the lives of farmers and increasing their income…The first is Digital Agriculture Mission. This is being developed on lines of the structure of Digital… pic.twitter.com/rcLcjT7Lxh
— ANI (@ANI) September 2, 2024
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!