Birbhum: బీర్భూమ్ ఘటనలో కీలక పరిణామం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్లో బీర్భూమ్ జిల్లా బోగ్టూయి గ్రామంలో జరిగిన సామూహిక సజీవదహనాల అంశం కీలక మలుపు తిరిగింది. బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినా… ఘటన తీవ్ర దృష్ట్యా రాష్ట్ర పోలీసులు నిస్పక్షపాతంగా దర్యాప్తు చేయాలేరని అభిప్రాయపడింది కోల్కతా హైకోర్టు. నిజానిజాలను వెలికి తీసే బాధ్యతను సీబీఐకి అప్పగించింది. సామూహిక సజీవదహనాలపై సమగ్ర దర్యాప్తు చేసి… ఏప్రిల్ 7వ తేదీలోగా తమకు నివేదిక ఇవ్వాలని సీబీఐకి స్పష్టం చేసింది కోల్కతా హైకోర్టు. కేసుకు సంబంధించిన పత్రాలతో పాటు అదుపులోకి తీసుకున్న నిందితులను సీబీఐకి అప్పగించాలని సిట్ అధికారుల్ని ఆదేశించింది. ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేసింది కోల్కతా హైకోర్టు. ఫోరెన్సిక్ నిపుణుల బృందాన్ని బోగ్టూయి గ్రామానికి పంపి… అవసరమైన నమూనాలను సేకరించాల్సిందిగా సూచించింది. హైకోర్టు ఆదేశాలతో త్వరలోనే గ్రామానికి వెళ్లనున్నారు ఫోరెన్సిక్ నిపుణులు.
Read Also: Yogi Cabinet: పక్కా ప్లాన్తో యోగి కొత్త కేబినెట్.. ముస్లిం నేతకు చోటు
Also Read
- Nitesh Rane: అమీర్ ఖాన్ మూడో పెళ్లిపై బీజేపీ మంత్రి నితేష్ రాణే విమర్శలు.. 'లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్' అంటూ ఫైర్!
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
బీర్భూమ్ ఘటనపై సుమోటోగా విచారణ ప్రారంభిస్తూనే ఘటనా స్థలంలో సాక్ష్యాలు తారుమారుకాకుండా చర్యలు చేపట్టింది కోల్కతా హైకోర్టు. బోగ్టూయి గ్రామంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి… అక్కడ ఏం జరుగుతోంది? ఎవరు వస్తున్నారు? ఎవరు వెళ్తున్నారు… అనే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా రికార్డు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ని ఆదేశించింది. ఇక, కోల్కతా హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణ చేపట్టింది. నేరం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించడానికి సీనియర్ సీబీఐ అధికారులు మరియు ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన బృందాన్ని పంపినట్టు ఓ అధికారి తెలిపారు.. ఏప్రిల్ 7లోగా నివేదిక సమర్పించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పూర్తి ఆధారాలను సేకరించేపనిలో పడింది సీబీఐ.. మరోవైపు, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో.. రాష్ట్ర పోలీసు అధికారులు లేదా రాష్ట్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ విషయంలో తదుపరి విచారణను నిర్వహించదు.
తాజావార్తలు
-
Disha Patani: హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన దిశా పటాని.. భారీ థ్రిల్లర్ తో అరంగేట్రం!
-
Mana Jampala: 12 ఏళ్ల చిన్నారి.. మూడు దేశాల్లో ఏఐ కంపెనీ.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న వండర్ కిడ్ సక్సెస్ స్టోరీ!
-
Trikala : ఏకంగా మూడు OTTలలో త్రికాల స్ట్రీమింగ్
-
Viral Wedding: 17 ఏళ్ల ఇన్ఫ్లుయెన్సర్ కు పెళ్లి.. భర్తతో రొమాంటిక్గా పోజులిస్తున్న మైనర్ వధువు.. షాక్లో అభిమానులు
-
Team India: ఓవైపు భారీ ఓటములు.. మరోవైపు అత్యంత చెత్త రికార్డులు.. ఈ టీమిండియాకు ఏమైంది!
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..