TDP vs YCP: చిప్పగిరిలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ.. పోలీసుల అదుపులో ఎమ్మెల్యే విరూపాక్షి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం సంగాల, నెమకల్ గ్రామాల్లో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య పరస్పర దాడులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటుండగా.. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కుమారుడు చంద్రశేఖర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని చిప్పగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు.
సంగాల గ్రామంలో వైసీపీ నేత గిరి, ఎమ్మెల్యే విరూపాక్షి సోదరుడు శ్రీరాములుపై టీడీపీ నేతలు దాడి చేశారని వైసీపీ వర్గాలు ఆరోపించాయి. వైసీపీలో చురుకుగా పనిచేస్తున్నందుకే ఈ దాడికి పాల్పడ్డారని పేర్కొన్నాయి. అలాగే గిరికి ఫోన్ చేసి తాము చెప్పినట్లు నడుచుకోవాలని టీడీపీ నేతలు అసభ్య పదజాలంతో దూషించారని కూడా వైసీపీ నేతలు ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే విరూపాక్షి చిప్పగిరి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
Also Read
- Strait of Hormuz: అమెరికా మ్యాప్లో ‘‘హార్ముజ్ జలసంధి’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
- Jharkhand: ‘భార్యతో చెప్పా.. కావాలంటే విడాకులు తీసుకో’.. జార్ఖండ్లో సెలెక్టెడ్ అభ్యర్థి ఆక్రందన
- Meta: మెటాకు భారీ షాక్.. ఫేస్బుక్, ఇన్స్టా వ్యసనంపై రూ.133 లక్షల కోట్ల కేసు!
- No Number Plate, No Fuel: నంబర్ ప్లేట్ లేకపోతే నో ఫ్యూయల్.. సంచలన నిర్ణయం.. వెంటనే అమల్లోకి..!
మరోవైపు నెమకల్ గ్రామంలో టీడీపీ కన్వీనర్ పురుషోత్తం వాహనాన్ని వైసీపీ వర్గీయులు ధ్వంసం చేశారని టీడీపీ నాయకులు ఆరోపించారు. కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారని తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన సోదరుడు శ్రీరాములు దాడి చేసి దళిత మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని టీడీపీ వర్గీయులు ఆరోపించారు. ఘటనలో గాయపడిన పార్టీ కార్యకర్తలను నియోజకవర్గ ఇన్చార్జి వైకుంఠం జ్యోతి పరామర్శించారు.
ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత మరింత పెరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. చిప్పగిరి మండలంలో అదనపు పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని నియంత్రించారు. పరస్పర దాడులు, వాహన ధ్వంసం ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కుమారుడు పోలీసుల అదుపులో ఉండగా.. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. టీడీపీ, వైసీపీ వర్గాలు పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ ఘటన రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరు గ్రామాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పోలీసులు.. శాంతిభద్రతలకు భంగం కలగకుండా చర్యలు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Strait of Hormuz: అమెరికా మ్యాప్లో ‘‘హార్ముజ్ జలసంధి’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
-
Jr NTR: ‘NTRTAIN’తో కొత్త ఇన్నింగ్స్.. సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన జూనియర్ ఎన్టీఆర్?
-
Jharkhand: ‘భార్యతో చెప్పా.. కావాలంటే విడాకులు తీసుకో’.. జార్ఖండ్లో సెలెక్టెడ్ అభ్యర్థి ఆక్రందన
-
Party Movie: అస్తిత్వాల అంతర్మథనం “పార్టీ”
-
CM Revanth Reddy: గౌడన్నలకు సీఎం రేవంత్ బిగ్ హామీ.. గీత కార్మికుల కోసం కీలక ప్రకటనలు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!