Manish Sisodia: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియాపై సీబీఐ లుకౌట్ నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manish Sisodia: ఢిల్లీ మద్యం పాలసీ అమలులో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీశ్ సిసోడియాతో పాటు 12 మంది వ్యక్తులపై సీబీఐ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. అవినీతి ఆరోపణలపై మంత్రి సిసోడియా నివాసంతో పాటు పలు చోట్ల సోదాలు చేపట్టిన సీబీఐ.. 15 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో ప్రథమ ముద్దాయిగా సిసోడియా పేరును చేర్చింది. తాజాగా వీరిలో 13మందిపై సిబిఐ లుకౌట్ నోటీసుల్చింది. దీంతో వీరిపై విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించినట్లు అధికారులు తెలిపారు. లుకౌట్ నోటీసు ఒక వ్యక్తిని దేశం విడిచి వెళ్లకుండా నిరోధిస్తుంది. ఒకవేళ దేశం విడిచి వెళ్లే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవచ్చు.
ఈ నోటీసుపై సిసోడియా స్పందిస్తూ.. ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ఇదేం డ్రామా అంటూ మండిపడ్డారు. “మీరు చేసిన దాడులన్నీ విఫలమయ్యాయి, ఒక్క పైసా కూడా దొరకని ఫౌల్ ప్లే ఇప్పుడు, మీరు మనీష్ సిసోడియా పరారీలో ఉన్నారని లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసారు, ఇది ఏమి జిమ్మిక్, మోడీ జీ? నేను బహిరంగంగా తిరుగుతున్నాను. ఢిల్లీలో, నేను ఎక్కడికి రావాలి చెప్పు?” ప్రధాని నరేంద్ర మోదీపై హిందీలో దాడి చేస్తూ సిసోడియా ట్వీట్ చేశారు. ఢిల్లీతో పాటు ఏడు రాష్ట్రాలతో సహా 31 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
Heavy Rains: నాలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న వర్షాలు.. 33 మంది మృతి
ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్న కేసుకు సంబంధించిన పత్రాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లతో పాటు బ్యాంకు లావాదేవీల వెరిఫికేషన్ ప్రక్రియను దర్యాప్తు సంస్థ ప్రస్తుతం పరిశీలిస్తోంది. ఈ కేసులో ఎక్సైజ్ అధికారులు, మద్యం కంపెనీల అధికారులు, డీలర్లతో పాటు గుర్తుతెలియని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులపై కూడా కేసు నమోదు చేశారు.సిసోడియా, అర్వా గోపీ కృష్ణ, ఆనంద్ తివారీ, పంకజ్ భట్నాగర్ 2021-22 సంవత్సరానికి ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన నిర్ణయాలను సిఫారసు చేయడంలో మరియు తీసుకోవడంలో కీలకంగా ఉన్నారని ఎఫ్ఐఆర్ ఆరోపించింది.
తాజావార్తలు
-
US Navy Deployment Cuba: క్యూబాపై ట్రంప్ దృష్టి.. కరేబియన్కు చేరుకున్న అమెరికా యుద్ధనౌక
-
Hardik Pandya: “సాకులు చెప్పను.. మేం తప్పు చేశాం”.. ముంబై వైఫల్యాలపై హార్దిక్ ఓపెన్ టాక్!
-
Astrology: మే 21 గురువారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజ చేస్తే మేలు..
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!