Manish Sisodia: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియాపై సీబీఐ లుకౌట్ నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manish Sisodia: ఢిల్లీ మద్యం పాలసీ అమలులో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీశ్ సిసోడియాతో పాటు 12 మంది వ్యక్తులపై సీబీఐ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. అవినీతి ఆరోపణలపై మంత్రి సిసోడియా నివాసంతో పాటు పలు చోట్ల సోదాలు చేపట్టిన సీబీఐ.. 15 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో ప్రథమ ముద్దాయిగా సిసోడియా పేరును చేర్చింది. తాజాగా వీరిలో 13మందిపై సిబిఐ లుకౌట్ నోటీసుల్చింది. దీంతో వీరిపై విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించినట్లు అధికారులు తెలిపారు. లుకౌట్ నోటీసు ఒక వ్యక్తిని దేశం విడిచి వెళ్లకుండా నిరోధిస్తుంది. ఒకవేళ దేశం విడిచి వెళ్లే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవచ్చు.
ఈ నోటీసుపై సిసోడియా స్పందిస్తూ.. ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ఇదేం డ్రామా అంటూ మండిపడ్డారు. “మీరు చేసిన దాడులన్నీ విఫలమయ్యాయి, ఒక్క పైసా కూడా దొరకని ఫౌల్ ప్లే ఇప్పుడు, మీరు మనీష్ సిసోడియా పరారీలో ఉన్నారని లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసారు, ఇది ఏమి జిమ్మిక్, మోడీ జీ? నేను బహిరంగంగా తిరుగుతున్నాను. ఢిల్లీలో, నేను ఎక్కడికి రావాలి చెప్పు?” ప్రధాని నరేంద్ర మోదీపై హిందీలో దాడి చేస్తూ సిసోడియా ట్వీట్ చేశారు. ఢిల్లీతో పాటు ఏడు రాష్ట్రాలతో సహా 31 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
Heavy Rains: నాలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న వర్షాలు.. 33 మంది మృతి
ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్న కేసుకు సంబంధించిన పత్రాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లతో పాటు బ్యాంకు లావాదేవీల వెరిఫికేషన్ ప్రక్రియను దర్యాప్తు సంస్థ ప్రస్తుతం పరిశీలిస్తోంది. ఈ కేసులో ఎక్సైజ్ అధికారులు, మద్యం కంపెనీల అధికారులు, డీలర్లతో పాటు గుర్తుతెలియని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులపై కూడా కేసు నమోదు చేశారు.సిసోడియా, అర్వా గోపీ కృష్ణ, ఆనంద్ తివారీ, పంకజ్ భట్నాగర్ 2021-22 సంవత్సరానికి ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన నిర్ణయాలను సిఫారసు చేయడంలో మరియు తీసుకోవడంలో కీలకంగా ఉన్నారని ఎఫ్ఐఆర్ ఆరోపించింది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!