Heavy Rains: నాలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న వర్షాలు.. 33 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rains: హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వరుణుడి బీభత్సం కొనసాగుతోంది. ఆకస్మిక వరదలు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను కుదిపేస్తున్నాయి. ఇటు ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రాల్లోనూ వర్షాలతో జనజీవనం స్తంభించింది. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో శనివారం 33 మంది మరణించారు.
హిమాచల్ ప్రదేశ్లో శుక్రవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు రావడంతో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది సహా మొత్తం 22 మంది చనిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలకు సంబంధించిన ఘటనల్లో 10 మంది గాయపడగా, మండీలో ఆరుగురు గల్లంతయ్యారని డిప్యూటి కమిషనర్ అరిందమ్ చౌదరి వెల్లడించారు.
Also Read
ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా నలుగురు మృతి చెందగా, 10 మంది గల్లంతయ్యారు. నదులు ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో పాటు వంతెనలు కొట్టుకుపోవడంతో పలు గ్రామాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Extortion Scam: రూ.500 కోట్ల ఇన్స్టంట్ రుణాల కుంభకోణం.. తెర వెనుక చైనా ప్రమేయం
ఒడిశాలోని 500 గ్రామాలలో దాదాపు 4.5 లక్షల మంది ప్రజలు ఇప్పటికే వరదలతో అల్లాడుతున్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో, నలుగురు మరణించినట్లు అధికారులు నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం మయూర్భంజ్, కేంద్రపారా మరియు బాలాసోర్తో సహా పలు జిల్లాల్లో రెస్క్యూ, రిలీఫ్ టీమ్లను మోహరించింది. శనివారం మహానదిలో వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన పడవలో 70 మంది సురక్షితంగా బయటపడ్డారు.
భారీ వర్షం కారణంగా జార్ఖండ్లోని పలు జిల్లాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పశ్చిమ సింగ్భూమ్లో తన ఇంటి మట్టి గోడ ఆమెపై పడటంతో ఒక మహిళ మరణించగా, రామ్గఢ్ జిల్లాలో ఉబ్బిన నల్కారి నదిలో ఇద్దరు వ్యక్తులు మునిగిపోయారు.
జమ్మూ కశ్మీర్లోని రియాసి జిల్లాలో వైష్ణో దేవి యాత్ర ఈ ఉదయం తిరిగి ప్రారంభమైంది. భారీ వర్షం కారణంగా తీర్థయాత్రకు వెళ్లే దారిలో వరదలు బీభత్సం సృష్టించడంతో రాత్రిపూట యాత్ర తాత్కాలికంగా నిలిపివేయబడింది. ఆదివారం పశ్చిమ మధ్యప్రదేశ్లో, సోమవారం తూర్పు రాజస్థాన్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తాజావార్తలు
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
-
Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Sudheer Joker: రాయల్ ఫ్యామిలీ దొంగ… ఆసక్తి రేపుతున్న ‘సుధీర్ జోకర్’ బ్యాంగర్!
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!