Heavy Rains: నాలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న వర్షాలు.. 33 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rains: హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వరుణుడి బీభత్సం కొనసాగుతోంది. ఆకస్మిక వరదలు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను కుదిపేస్తున్నాయి. ఇటు ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రాల్లోనూ వర్షాలతో జనజీవనం స్తంభించింది. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో శనివారం 33 మంది మరణించారు.
హిమాచల్ ప్రదేశ్లో శుక్రవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు రావడంతో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది సహా మొత్తం 22 మంది చనిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలకు సంబంధించిన ఘటనల్లో 10 మంది గాయపడగా, మండీలో ఆరుగురు గల్లంతయ్యారని డిప్యూటి కమిషనర్ అరిందమ్ చౌదరి వెల్లడించారు.
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
- Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
- INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
- Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా నలుగురు మృతి చెందగా, 10 మంది గల్లంతయ్యారు. నదులు ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో పాటు వంతెనలు కొట్టుకుపోవడంతో పలు గ్రామాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Extortion Scam: రూ.500 కోట్ల ఇన్స్టంట్ రుణాల కుంభకోణం.. తెర వెనుక చైనా ప్రమేయం
ఒడిశాలోని 500 గ్రామాలలో దాదాపు 4.5 లక్షల మంది ప్రజలు ఇప్పటికే వరదలతో అల్లాడుతున్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో, నలుగురు మరణించినట్లు అధికారులు నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం మయూర్భంజ్, కేంద్రపారా మరియు బాలాసోర్తో సహా పలు జిల్లాల్లో రెస్క్యూ, రిలీఫ్ టీమ్లను మోహరించింది. శనివారం మహానదిలో వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన పడవలో 70 మంది సురక్షితంగా బయటపడ్డారు.
భారీ వర్షం కారణంగా జార్ఖండ్లోని పలు జిల్లాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పశ్చిమ సింగ్భూమ్లో తన ఇంటి మట్టి గోడ ఆమెపై పడటంతో ఒక మహిళ మరణించగా, రామ్గఢ్ జిల్లాలో ఉబ్బిన నల్కారి నదిలో ఇద్దరు వ్యక్తులు మునిగిపోయారు.
జమ్మూ కశ్మీర్లోని రియాసి జిల్లాలో వైష్ణో దేవి యాత్ర ఈ ఉదయం తిరిగి ప్రారంభమైంది. భారీ వర్షం కారణంగా తీర్థయాత్రకు వెళ్లే దారిలో వరదలు బీభత్సం సృష్టించడంతో రాత్రిపూట యాత్ర తాత్కాలికంగా నిలిపివేయబడింది. ఆదివారం పశ్చిమ మధ్యప్రదేశ్లో, సోమవారం తూర్పు రాజస్థాన్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తాజావార్తలు
-
Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!