Heavy Rains: నాలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న వర్షాలు.. 33 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rains: హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వరుణుడి బీభత్సం కొనసాగుతోంది. ఆకస్మిక వరదలు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను కుదిపేస్తున్నాయి. ఇటు ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రాల్లోనూ వర్షాలతో జనజీవనం స్తంభించింది. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో శనివారం 33 మంది మరణించారు.
హిమాచల్ ప్రదేశ్లో శుక్రవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు రావడంతో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది సహా మొత్తం 22 మంది చనిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలకు సంబంధించిన ఘటనల్లో 10 మంది గాయపడగా, మండీలో ఆరుగురు గల్లంతయ్యారని డిప్యూటి కమిషనర్ అరిందమ్ చౌదరి వెల్లడించారు.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
- Viral Video: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తాతా.. 18 వేల అడుగుల ఎత్తు నుంచి దూకేసిన 80 ఏళ్ల వృద్ధుడు!
- Modi-Khamenei: ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకానున్న భారత్.. ఎవరెళ్తున్నారంటే..!
ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా నలుగురు మృతి చెందగా, 10 మంది గల్లంతయ్యారు. నదులు ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో పాటు వంతెనలు కొట్టుకుపోవడంతో పలు గ్రామాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Extortion Scam: రూ.500 కోట్ల ఇన్స్టంట్ రుణాల కుంభకోణం.. తెర వెనుక చైనా ప్రమేయం
ఒడిశాలోని 500 గ్రామాలలో దాదాపు 4.5 లక్షల మంది ప్రజలు ఇప్పటికే వరదలతో అల్లాడుతున్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో, నలుగురు మరణించినట్లు అధికారులు నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం మయూర్భంజ్, కేంద్రపారా మరియు బాలాసోర్తో సహా పలు జిల్లాల్లో రెస్క్యూ, రిలీఫ్ టీమ్లను మోహరించింది. శనివారం మహానదిలో వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన పడవలో 70 మంది సురక్షితంగా బయటపడ్డారు.
భారీ వర్షం కారణంగా జార్ఖండ్లోని పలు జిల్లాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పశ్చిమ సింగ్భూమ్లో తన ఇంటి మట్టి గోడ ఆమెపై పడటంతో ఒక మహిళ మరణించగా, రామ్గఢ్ జిల్లాలో ఉబ్బిన నల్కారి నదిలో ఇద్దరు వ్యక్తులు మునిగిపోయారు.
జమ్మూ కశ్మీర్లోని రియాసి జిల్లాలో వైష్ణో దేవి యాత్ర ఈ ఉదయం తిరిగి ప్రారంభమైంది. భారీ వర్షం కారణంగా తీర్థయాత్రకు వెళ్లే దారిలో వరదలు బీభత్సం సృష్టించడంతో రాత్రిపూట యాత్ర తాత్కాలికంగా నిలిపివేయబడింది. ఆదివారం పశ్చిమ మధ్యప్రదేశ్లో, సోమవారం తూర్పు రాజస్థాన్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
-
Tollywood: 2026 సెకండాఫ్ సినిమాలపైనే ఆశలు!
-
Nagababu: జనసేన పార్టీ ఆ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు.!
-
China: జిన్పింగ్కు సొంత సైన్యంపైనే నమ్మకం లేదా? చైనా పార్లమెంట్ నుంచి ఆరుగురు టాప్ మిలిటరీ కమాండర్ల అవుట్!
-
DSP transfers : తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ.!
ట్రెండింగ్
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!