Waqf protest: బెంగాల్లో “వక్ఫ్” నిరసనల్లో హింస.. మమత ముస్లిం బుజ్జగింపు వల్లే అంటూ..
- బెంగాల్లో హింసాత్మకంగా మారిన వక్ఫ్ నిరసనలు..
- ముర్షిదాబాద్లో హింస, పలు వాహనాలకు నిప్పు..
- మమత ముస్లిం బుజ్జగింపుల వల్లే హింస అని బీజేపీ ఆరోపణ..
Waqf protest: వక్ఫ్ సవరణ చట్టం-2025కి వ్యతిరేకంగా బెంగాల్ వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నిరసనల పేరుతో అల్లరిమూకలు రాళ్లదాడికి పాల్పడుతున్నారు. పలు వాహనాలకు నిప్పు పెట్టారు. పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్లో ఉద్రిక్తతలు చెలరేగాయి. నిరసనకారులు, పోలీసులకు మధ్య ఘర్ష నెలకొంది. ఈ ప్రాంతంలో కీలకమైన రహదారిని అడ్డుకోకుండా పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
గత వారం పార్లమెంట్ ఉభయసభల్లో సుదీర్ఘ చర్చల అనంతరం వక్ఫ్ బిల్లు ఆమోదం పొందింది. రాష్ట్రపతి ఆమోదంతో బిల్లు వక్ఫ్ చట్టంగా మారింది. ఈ రోజు (ఏప్రిల్ 8, 2025) నుంచి బిల్లు అమలులోకి వచ్చినట్లు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
Also Read
Read Also: Smartphone: భారత్ నుంచి రూ. 2 లక్షల కోట్ల స్మార్ట్ఫోన్ ఎగుమతులు.. టాప్ బ్రాండ్ ఇదే..
ఇదిలా ఉంటే, ముర్షిదాబాద్ ఘర్షణలపై బెంగాల్ లోని మమతా బెనర్జీ టీఎంసీ ప్రభుత్వాన్ని బీజేపీ నేత అమిత్ మాల్వియా విమర్శించారు. ముర్షిదాబాద్ వీధుల్లో హింసాత్మక ఇస్లామిక్ మూకల్ని అదుపు చేయడానికి పశ్చిమ బెంగాల్ పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. సీఎం, హోం మంత్రి మమతా బెనర్జీ సూచనలు ఇందుకు ఉపయోగపడినట్లు ఉన్నాయి అని అమిత్ మాల్వియా అన్నారు.
జంగీపూర్లో పోలీసులతో జరిగిన ఘర్షణలో నిరసనకారులు రాళ్లు రువ్వారు. జాంగీపూర్లో ఇంటర్నెట్ సేవల్ని పరిమితం చేశారు. ఇటీవల కార్తీక పూజ వేడుకల సందర్భంగా హిందువులపై ఈ ప్రాంతంలో పదేపదే దాడులు జరిగాయి, ఉద్రికత పెరగడంతో అనేక రైళ్లు నిలిచిపోయాయని అమిత్ మాల్వియా అన్నారు. మమతా బెనర్జీ ముస్లిం బుజ్జగింపు రాజకీయంతో బెంగాల్ని బంగ్లాదేశ్గా మార్చుతోందని మాల్వియా అన్నారు.
తాజావార్తలు
-
Telangana: సైబర్ నేరస్థుల వేటలో తెలంగాణ పోలీస్.. “ఆపరేషన్ క్రాక్డౌన్ 2.0” ప్రారంభం.!
-
IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
-
Realme C100x: రియల్మీ C100x భారత్లో త్వరలో లాంచ్.. 8000mAh బ్యాటరీతో బిగ్ సర్ప్రైజ్!
-
Buchi Babu: ఫ్యాన్స్ అరుపుల మధ్య అదిరిపోయే అప్డేట్… ‘పెద్ది’ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన బుచ్చిబాబు.. మెగా ఫ్యాన్స్కు పండగే!
-
Ashu Reddy Case : నటి అషు రెడ్డి కేసులో కీలక అంశాలు.. విస్తుపోయే నిజాలు.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!