Amit Shah: మహిళల కోసం మగాళ్లు మాట్లాడకూడదా..? కాంగ్రెస్పై అమిత్ షా విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్ లో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాలు కేంద్ర తీసుకువచ్చని బిల్లును స్వాగతిస్తూనే, ఓబీసీ రిజర్వేషన్ పై పట్టుబడుతున్నాయి. మరోవైపు ఈ బిల్లును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. బిల్లు తీసుకురావడం మంచిదే కానీ, తీసుకువచ్చిన సమయంపై పలువరు ప్రతిపక్ష నేతలు ప్రశ్నల్ని లేవనెత్తుతున్నారు.
ఇదిలా ఉంటే అమిత్ షా చర్చ సమయంలో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడేందుకు లేచినిలబడిన బీజేపీ ఎంపీ నిశీకాంత్ దూబే ను కాంగ్రెస్ నేత రధీర్ రంజన్ చౌదరీ అడ్డుకోవడంతో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. నారీ శక్తి వందన్ అధినియంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాట్లాడిన తర్వాత బీజేపీ తరుపున నిశికాంత్ దూబే మాట్లాడేందుకు నిలబడ్డారు. ఆ సమయంలో కాంగ్రెస్ ఎంపీ అధీర రంజన్ చౌదరీ మహిళా ఎంపీని నామినేట్ చేయాలని పట్టుబట్టడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.
Also Read
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
- School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
- Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
Read Also: Karima Baloch: ఖలిస్తాన్ ఉగ్రవాది హత్యపై కెనడా గగ్గోలు.. కరీమా బలూచ్ హత్యపై మాత్రం సైలెన్స్..
దీంతో అమిత్ షా జోక్యం చేసుకున్నారు. కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. తొలుత తనను మాట్లాడిలేనందుకు ఆయన అసూయగా ఉన్నారని కౌంటర్ ఇచ్చారు. ‘‘ నేను అధీర్ జీని అదగాలను కుంటున్నాను, మహిళలు మాత్రమే మహిళల గురించి శ్రద్ధ చూపిస్తారా..? మహిళల గురించి పురుషులు మాట్లాడకూడదా..? మీరు ఎలాంటి సమాజాన్ని నిర్మించాలని అనుకుంటున్నారు..? మహిళా సంక్షేమంపై సోదరుడు ఒక అడుగు ముందుకేయాలి అనేది మన దేశ సంప్రదాయం. మహిళా సంక్షేమం గురించి ఆలోచించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది.మరి నిషికాంత్ జీ మా వైపు నుండి మాట్లాడటానికి లేచి నిలబడితే, అతని (చౌదరి) అభ్యంతరం ఏమిటి?బహుశా అతనికి మొదట మాట్లాడే అవకాశం రాకపోవటం వల్ల, అతను కొంచెం అసూయపడుతున్నాడు’’ అంటూ అమిత్ షా విమర్శలు గుప్పించారు.
మంగళవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. దీనికి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని పేర్కొంది. అయితే ఈ బిల్లును వెంటనే అమలు చేయాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ఈ బిల్లుపై సెప్టెంబర్ 21న రాజ్యసభలో చర్చకు రానుంది.
తాజావార్తలు
-
Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
-
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
-
Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
-
Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
-
Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!