Amit Shah: మహిళల కోసం మగాళ్లు మాట్లాడకూడదా..? కాంగ్రెస్పై అమిత్ షా విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్ లో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాలు కేంద్ర తీసుకువచ్చని బిల్లును స్వాగతిస్తూనే, ఓబీసీ రిజర్వేషన్ పై పట్టుబడుతున్నాయి. మరోవైపు ఈ బిల్లును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. బిల్లు తీసుకురావడం మంచిదే కానీ, తీసుకువచ్చిన సమయంపై పలువరు ప్రతిపక్ష నేతలు ప్రశ్నల్ని లేవనెత్తుతున్నారు.
ఇదిలా ఉంటే అమిత్ షా చర్చ సమయంలో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడేందుకు లేచినిలబడిన బీజేపీ ఎంపీ నిశీకాంత్ దూబే ను కాంగ్రెస్ నేత రధీర్ రంజన్ చౌదరీ అడ్డుకోవడంతో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. నారీ శక్తి వందన్ అధినియంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాట్లాడిన తర్వాత బీజేపీ తరుపున నిశికాంత్ దూబే మాట్లాడేందుకు నిలబడ్డారు. ఆ సమయంలో కాంగ్రెస్ ఎంపీ అధీర రంజన్ చౌదరీ మహిళా ఎంపీని నామినేట్ చేయాలని పట్టుబట్టడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.
Also Read
- AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
- E30 Petrol: పెట్రోల్లో పెరగనున్న ఇథనాల్ శాతం.. వాహనదారులకు లాభమా? నష్టమా?
- TVK Vijay: అలా అయితే మద్దతు విత్డ్రా చేసుకుంటాం.. సీఎం విజయ్కు కొత్త తలనొప్పి..
- Tech Layoffs: ‘‘60 రోజులు లేదా అమెరికా వదలాలి’’.. లేఆఫ్స్తో H-1B ఇండియన్లలో భయం..
Read Also: Karima Baloch: ఖలిస్తాన్ ఉగ్రవాది హత్యపై కెనడా గగ్గోలు.. కరీమా బలూచ్ హత్యపై మాత్రం సైలెన్స్..
దీంతో అమిత్ షా జోక్యం చేసుకున్నారు. కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. తొలుత తనను మాట్లాడిలేనందుకు ఆయన అసూయగా ఉన్నారని కౌంటర్ ఇచ్చారు. ‘‘ నేను అధీర్ జీని అదగాలను కుంటున్నాను, మహిళలు మాత్రమే మహిళల గురించి శ్రద్ధ చూపిస్తారా..? మహిళల గురించి పురుషులు మాట్లాడకూడదా..? మీరు ఎలాంటి సమాజాన్ని నిర్మించాలని అనుకుంటున్నారు..? మహిళా సంక్షేమంపై సోదరుడు ఒక అడుగు ముందుకేయాలి అనేది మన దేశ సంప్రదాయం. మహిళా సంక్షేమం గురించి ఆలోచించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది.మరి నిషికాంత్ జీ మా వైపు నుండి మాట్లాడటానికి లేచి నిలబడితే, అతని (చౌదరి) అభ్యంతరం ఏమిటి?బహుశా అతనికి మొదట మాట్లాడే అవకాశం రాకపోవటం వల్ల, అతను కొంచెం అసూయపడుతున్నాడు’’ అంటూ అమిత్ షా విమర్శలు గుప్పించారు.
మంగళవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. దీనికి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని పేర్కొంది. అయితే ఈ బిల్లును వెంటనే అమలు చేయాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ఈ బిల్లుపై సెప్టెంబర్ 21న రాజ్యసభలో చర్చకు రానుంది.
తాజావార్తలు
-
IPL 2026: RCB ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్ ఎంట్రీ..
-
AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
-
RC 17: చరణ్ ఫాన్స్.. రెడీ అవండమ్మా!
-
E30 Petrol: పెట్రోల్లో పెరగనున్న ఇథనాల్ శాతం.. వాహనదారులకు లాభమా? నష్టమా?
-
Drishyam 3: దృశ్యం క్రేజ్ అదృశ్యం!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!