Mallikarjun Kharge: టైం ఇస్తే మా మేనిఫేస్టో వివరిస్తా.. ప్రధాని “ముస్లింలీగ్” విమర్శలపై ఖర్గే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallikarjun Kharge: రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ మేనిఫెస్టోను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ చెబుతున్న సంపద పునర్విభజన చొరబాటుదారులకు, ఎక్కువ మంది పిల్లలకు ఉన్నవారికి ఇస్తుందా..? అని ప్రశ్నించారు. అయితే, ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి మోడీ ఈ వ్యాఖ్యలు చేశారని, సమాజాన్ని విభజించే ప్రయత్నాలను ప్రధాని ఆపాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ రోజు అన్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టో ఆరోపణలు ముస్లింలీగ్ ఆలోచనల్ని గుర్తుకు తెస్తున్నాయంటూ ఇటీవల జరిగి ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని అన్నారు. ఆదివారం నాడు రాజస్థాన్లో జరిగి ర్యాలీలో మాట్లాడుతూ.. ప్రజల ఆస్తుల్ని స్వాధీనం చేసుకుని ముస్లింలకు పంచాలని కాంగ్రెస్ పనిచేస్తుందని వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. ‘‘వారు మన సోదరీమణులు, తల్లుల మంగళసూత్రాలను కూడా వదిలిపెట్టారు’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.
Also Read
- Bengal Police: మమతా గూండాల బట్టలూడదీసి..! పశ్చిమబెంగాల్లో రౌడీల భరతం పడుతున్న సువెందు అధికారి
- Tamil Nadu: మార్పు మొదలైంది.. అర్చకుల అవినీతిపై మంత్రి స్టింగ్ ఆపరేషన్.! రూ.4 వేలు లంచం ఇచ్చి..
- LPG Rule Changes: ఎల్పీజీ నిబంధనల్లో కీలక మార్పులు.. ఉల్లంఘిస్తే గ్యాస్ కనెక్షన్ కట్..!
- Suvendu Adhikari: బంగ్లాదేశ్ గుండెల్లో వణుకు పుట్టిస్తోన్న బెంగాల్ సీఎం.. అక్రమ వలసదారుల తాట తీస్తున్నాడుగా!
Read Also: Hemant Soren: ఎన్నికల ప్రచారానికి హేమంత్ అభ్యర్థన.. ఈడీకి కోర్టు కీలక ఆదేశాలు
అయితే, ఈ వ్యాఖ్యలపై వయనాడ్లో జరిగిన సభలో ఖర్గే స్పందిస్తూ..‘‘ కాంగ్రెస్ మేనిఫెస్టో ముస్లిం లీగ్ మేనిఫెస్టో అని ప్రధాని చెప్పారు. ఆయన నాకు సమయం ఇస్తే మా మేనిఫెస్టో్ను తీసుకెళ్లి వివరిస్తాను. మేనిఫెస్టోల ముస్లింకు మాత్రమే అని ఎక్కడ ఉంది..? మా మేనిఫెస్టో్ పేదులు, యువత, రైతులు ప్రతీ ఒక్కరి కోసం. అతను సమాజాన్ని విభజించేలా , హిందూ-ముస్లిం గురించి మాట్లాడుతున్నారు.’’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నారు. యువన్యాయం, నారీ శక్తి అందరిదీ, ఇది ముస్లింలకు మాత్రమే కాదని, షెడ్యూల్ తెగలు, కులాలకు, దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారికి అని, యూపీఏ హయాంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ విమర్శించిందని అన్నారు.
ఉపాధిహామీతో కాంగ్రెస్ దేశాన్ని పేదరికం వైపు తీసుకెళ్తుందని బీజేపీ ఆర్పించిందని, ప్రధాని మోడీ, హోంమంత్రి వీటిని తీసేయలేదని ఆయన అన్నారు. ప్రపంచంలో పర్యటిస్తున్నప్పటికీ, దేశంలోని మణిపూర్ని ఎందుకు సందర్శించలేదని ఖర్గే ప్రశ్నించారు. రాహుల్ గాంధీ అక్కడికి వెళ్లి, ప్రజల్ని ఓదార్చారని చెప్పారు. ప్రధాని మతతత్వ వ్యాఖ్యలు చేస్తూ, ప్రజల్ని దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఖర్గే ఆరోపించారు.
తాజావార్తలు
-
Ajith Kumar: తలా అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం.. దిగ్భ్రాంతిలో ఫ్యాన్స్!
-
Petrol and Diesel Prices Cut: భారీ ఉపశమనం.. పెట్రోల్, డీజిల్ లీటర్పై రూ.22 తగ్గించిన పాక్..
-
Vivo S60 సిరీస్ లాంచ్.. 7200mAh భారీ బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో..
-
Bengal Police: మమతా గూండాల బట్టలూడదీసి..! పశ్చిమబెంగాల్లో రౌడీల భరతం పడుతున్న సువెందు అధికారి
-
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ ముగిసింది.. కొత్త సవాల్కు సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ.. నెక్ట్స్ ఆడే మ్యాచ్లు ఇవే..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..