Assembly polls: మహారాష్ట్ర, జార్ఖండ్లో ముసిగిన ప్రచార హోరు.. ఎల్లుండి పోలింగ్
- మహారాష్ట్ర.. జార్ఖండ్లో ముసిగిన ప్రచార హోరు
- బుధవారం పోలింగ్.. శనివారం ఎన్నిక ఫలితాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర, జార్ఖండ్లో ప్రచార హోరు ముగిసింది. గత కొద్దిరోజులుగా నాయకులు ప్రచారాన్ని హోరెత్తించారు. రాత్రి, పగలు తేడా లేకుండా అభ్యర్థులంతా ఓటర్లను దర్శనం చేసుకున్నారు. ఇక ప్రధాని మోడీ దగ్గర నుంచి కేంద్రమంత్రులు వరకు ప్రచారం నిర్వహించారు. అలాగే రాహుల్గాంధీ, ప్రియాంకాగాంధీ, ఇండియా కూటమిలోని ముఖ్యనాయకులంతా ప్రచారం చేపట్టారు. ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి నేతలంతా పోటాపోటీగా ప్రచారాలు నిర్వహించారు. మాటల తూటాలు పేల్చుకున్నారు. సోమవారంతో ప్రచారమైతే ముగిసింది. ఇక పోలింగ్ మిగిలి ఉంది.
ఇది కూడా చదవండి: Thandel Bujji Thalli: నవంబర్ 21న వచ్చేస్తోన్న తండేల్ ‘బుజ్జి తల్లి’
Also Read
ఇక చివరి రోజు పేపర్లలో వచ్చిన ప్రకటనలు కాకరేపాయి. కర్ణాటక ప్రభుత్వ పథకాలపై ఎన్డీఏ కూటమి ప్రకటనలు ఇచ్చింది. ఈ ప్రకటనలు చివరి రోజు తీవ్ర దుమారమే రేపాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న గ్యారంటీ పథకాలను మహారాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రకటనలు జారీ చేసిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. ఓట్ల కోసం ఆ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మహాయుతి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ధ్వంజమెత్తారు. మహాయుతి ప్రభుత్వంపై చట్టపరమైన చర్యలను పరిశీలిస్తున్నామని చెప్పారు.
ఇది కూడా చదవండి: Javier Aguirre: బీర్ క్యాన్లతో కోచ్ పై దాడి.. తలపై రక్తస్రావం
నవంబర్ 20న మహారాష్ట్ర, జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జార్ఖండ్లో నవంబర్ 13న తొలి విడత పోలింగ్ ముగిసింది. చివరి విడత బుధవారం జరగనుంది. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఫస్ట్ ఫేజ్లో 43 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. మిగతా స్థానాలకు బుధవారం జరగనుంది. ఇక మహారాష్ట్రలో ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి పోటాపోటీగా తలపడ్డాయి. ఈసారి ప్రజలు ఎవరికి పట్టంకడతారో చూడాలి.
ఇది కూడా చదవండి: Pakistan: తీవ్ర గాలి కాలుష్యం.. పాకిస్తాన్లోని ఈ నగరాల్లో లాక్డౌన్
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!