S.Jaishankar: బంగ్లాదేశ్లో పరిస్థితి బాగాలేదు.. అది జరిగితేనే పాక్తో సంబంధాలు పెట్టుకుంటాం!
- బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి..
- ప్రస్తుతం బంగ్లాలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి..
- భారత్- పాక్ మధ్య సంబంధాలు కొనసాగాలంటే ఉగ్రవాదం పోవాలి: జైశంకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S.Jaishankar: బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. దీనిపై లోక్సభలో మాట్లాడిని భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ బంగ్లాలోని పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. వీటిని నివారించడానికి ఆ దేశ తాత్కాలిక సర్కార్ మైనారిటీలు, హిందువుల భద్రతకు తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ విషయంపై ఇటీవల భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అక్కడికి వెళ్లి వారితో చర్చలు జరిపారని సభలో తెలిపారు. మరోవైపు పాకిస్థాన్, భారత్ మధ్య సత్సంబంధాలు కొనసాగాలంటే ఆ దేశంలో ఉగ్రవాదం పూర్తిగా తుడిచి పెట్టుకుపోవాలి.. అప్పుడే పాక్తో చర్చలకు ముందడుగు వేస్తామని జైశంకర్ వెల్లడించారు.
Read Also: Allu Arjun Arrest: హీరో అల్లు అర్జున్కు 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష?
Also Read
ఇక, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వదిలి పోయిన తర్వాత బంగ్లాలో హిందువులపై దాడులు బాగా పెరిగిపోయాయి. అలాగే, ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుతో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి. ఆయనకు న్యాయసాయం అందించడంపై కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలోని ఇద్దరు బంగ్లాదేశ్ దౌత్యవేత్తలను వెనక్కి రప్పించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఢాకా నుంచి పని చేయాలని సూచనలు జారీ చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు క్లిష్టమైయ్యాయి.
Read Also: Allu Arjun Arrest Live Updates: హీరో ల్లు అర్జున్ అరెస్ట్.. ఉస్మానియా ఆస్పత్రికి తరలింపు!
అయితే, షేక్ హసీనా రాజీనామా తర్వాత ఆగస్టు 5 నుంచి అక్టోబరు 22 మధ్యకాలంలో మైనారిటీలపై 88 మతపరమైన హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఓ నివేదికలో తెలిపింది. ఇక, పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజ్యాంగంపై చర్చ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు అధికార ఎన్డీఏ, విపక్షాల మధ్య ఒప్పందం కుదరడంతో ఇవాళ లోక్సభలో రాజ్యాంగంపై చర్చ కొనసాగుతుంది.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!