BJP: విపక్షపాలిత రాష్ట్రాలకు ధీటుగా బీజేపీ రాయితీలు.. ఆర్బీఐ తాజా నివేదికలో వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: ప్రజలకు రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా ‘ఉచితాలు’ ఇవ్వడాన్ని బీజేపీ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. ఈ ఉచిత పథకాలు ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా మారే అవకాశం ఉందని చెబుతోంది. ఉచితాలు కాకుండా ప్రజలు ఆర్థికంగా బలోపేతమయ్యే సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తోంది. గతేడాది కర్ణాటక ఎన్నికల ముందు ప్రధాని నరేంద్రమోడీ ఓ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. ఉచితాల రాష్ట్రాలు అప్పులపాలవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Read Also: UK: 16 ఏళ్ల బాలికపై వర్చువల్ గ్యాంగ్ రేప్.. ప్రపంచంలో ఇదే తొలి కేసు..
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
ఇదిలా ఉంటే..2018-23 మధ్య దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సబ్సిడీల పెరుగుదల విపక్షరాష్ట్రాల కన్నా ధీటుగా ఉందని ఆర్బీఐ తన తాజా నివేదికలో తెలిపింది. ఈ ఐదేళ్లలో రాష్ట్రాలు సమర్పించిన బడ్జెట్ని పరిశీలించి ఆర్బీఐ ఈ నివేదికను రూపొందించింది. 2029-24 ఆర్థిక సంవత్సరానికి దేశవ్యాప్తంగా కేటాయించిన సబ్సిడీల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల వాటా 34 శాతం ఉండగా.. ఆప్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సబ్సిడీ వాటా 20 శాతం ఉంది.
గుజరాత్ రాష్ట్రంలో 2018-19 నాటికి రూ. 17 వేల కోట్లు ఉన్న సబ్సిడీ 2023 నాటికి రూ. 30 వేల కోట్లకు చేరుకుందని, హర్యానాలో రూ. 8 వేల కోట్ల నుంచి రూ. 11 వేల కోట్లకు, కర్ణాటకలో రూ. 23 వేల కోట్ల నుంచి రూ. 30 వేల కోట్లకు, యూపీలో రూ. 11 వేల కోట్ల నుంచి రూ. 26 వేల కోట్లకు, మధ్యప్రదేశ్ లో రూ. 12 వేల కోట్ల నుంచి రూ. 28 వేల కోట్లకు సబ్సిడీలు పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం కూడా గత మూడేళ్లుగా సబ్సిడీలను పెంచుతూనే ఉంది. 2018-19లో బడ్జెట్ లో కేంద్రం రూ. 2.92 లక్షల కోట్లను సబ్సిడీలకు కేటాయిస్తే.. 2019-20లో రూ. 2.95 లక్షలకు పెంచింది.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!