Haryana: బీజేపీ వైఫల్యాలే హర్యానాలో కాంగ్రెస్కి బలం.. ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నది ఇదే..
- హర్యానాలో కాంగ్రెస్కి వరంగా మారిన బీజేపీ వైఫల్యాలు..
- ఇ-గవర్నెన్స్.. హమీలు నెరవేర్చకపోవడం అసంతృప్తిని పెంచాయి..
- అగ్నవీర్.. నిరుద్యోగం కూడా కారణమే..
- రెజ్లర్ల నిరసనతో జాట్ వర్గం మొత్తం కాంగ్రెస్ వైపే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haryana: హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని అన్ని సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్లో కుండబద్ధలు కొట్టాయి. మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధిద్దామని అనుకున్న బీజేపీ ఆశలపై హర్యానా ఓటర్లు నీళ్లు చల్లారు. గత పదేళ్లుగా బీజేపీ వైఫల్యాలే కాంగ్రెస్ విజయానికి సోపానాలు అవుతున్నాయి. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ హర్యానాలో బలంగా పుంజుకుంది. మొత్తం 90 స్థానాలు ఉన్న హర్యానా అసెంబ్లీలో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ 46 కన్నా ఎక్కువ స్థానాలు సాధిస్తుందని అన్ని సర్వేలు చెప్పాయి. బీజేపీకి కేవలం 20-28 సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేసింది.
హర్యానాలో బీజేపీకి ప్రజాదరణ క్షీణించింది. పదేళ్లుగా అధికారంలో ఉండటం బీజేపీపై ప్రజావ్యతిరేకతను పెంచింది. పెరుగుతున్న అసంతృప్తిని తగ్గించేందుకు 2024లో సీఎం మనోహర్ లాల్ కట్టర్ని తొలగించి, నయాబ్ సైనీని సీఎం చేసింది. ఇది కూడా పార్టీకి మైనస్ అయింది. ఇక రెజ్లర్ల నిరసన, రైతులు ఉద్యమం జాట్ వర్గం పూర్తిగా బీజేపీ నుంచి కాంగ్రెస్ వైపు మళ్లింది. ఇక ముస్లింలు ఎప్పటి నుంచో బీజేపీకి దూరంగానే ఉన్నారు. గతేడాది అల్లర్లు జరిగిన నుహ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ముస్లింలు కాంగ్రెస్కి ఓటేశారు.
Also Read
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
- Kerala: "ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే".. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
అధిక నిరుద్యోగం, అగ్నివీర్ అంశం కూడా బీజేపీ కొంపముంచాయి. నిజానికి అగ్నవీర్ అనేది సైన్యానికి అత్యంత కీలకం. అయితే, హర్యానా నుంచి ఎక్కువ మంది ఆర్మీలో జాయిన్ అవుతుంటారు. అగ్నివీర్ అనేది తమను నష్టపరుస్తుందని అక్కడి యువత భావించింది. ఇక హర్యానాలో నిరుద్యోగం 2021-22లో 9 శాతం ఉంది. ఇది జాతీయ సగటు 4.1 కన్నా రెండింతలు. తన మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, దాదాపుగా 1.84 లక్షల్ ఖాళీలు భర్తీ చేయడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైంది. పోటీ పరీక్షల కుంభకోణం నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం 47 పరీక్షల్ని రద్దు చేయడం కూడా విశ్వసనీయతను దిగజార్చింది.
Read Also: Gujarat: ఫ్రెండ్ని కలిసేందుకు వెళ్లిన టీనేజీ బాలికపై గ్యాంగ్ రేప్..
ఇక పట్టణ ఓటర్లలో కూడా బీజేపీ అసంతృప్తి పెరిగింది. సాంప్రదాయకంగా పట్టణ ఓటర్లు బీజేపీ వైపు ఉంటారు. ఈ సారి బీజేపీ తమను పట్టించుకోలేదనే ఆలోచన వారిలో ఉంది. మొత్తం పట్టణ ఓటర్లు బీజేపీకి ఓటేయవద్దని నిర్ణయించుకున్నారు. 2 కోట్ల మంది అర్హత ఉన్న ఓటర్లలో కోటి మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది కూడా బీజేపీ ఘోరంగా దెబ్బతీసింది.
అవినీతిని అరికట్టేందుకు ఖట్టర్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఇ-గవర్నెన్స్ విఫలమైంది. మెరుగైన సేవల కోసం ప్రభుత్వం పరివార్ పహచాన్ పాత్ర(పీపీపీ), మేరీ ఫసల్ మేరా బైరాతో పాటు అనేక ఆన్లైన్ పోర్టల్స్ని అందుబాటులోకి తెచ్చింది. అయితే ప్రజలు వీటిని వినియోగించుకోవడంలో ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు ఇంటర్నెట్ కనెక్టివిటీ సక్రమంగా లేకపోవడం కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచింది.
ఇక బీజేపీ తాను ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. ఉదాహరణకు, ఆగస్ట్ 2024లో, ప్రభుత్వం 24 పంటలకు MSP చెల్లించే ప్రణాళికను ప్రకటించింది, అలాగే అగ్నివీరులకు 10% హారిజాంటల్ రిజర్వేషన్లు మరియు వడ్డీ రహిత రుణాలను ప్రకటించింది. అయితే, ఈ వాగ్దానాలు కేవలం ఎన్నికలకు ముందు ఇచ్చారు. ఇది కూడా ప్రజల విశ్వాసాన్ని మరింత దూరం చేశాయి. 2020లో తప్పనిసరిగా పరివార్ పహచన్ పాత్రను ప్రవేశపెట్టింది. నమోదు చేసుకున్న 72 లక్షల కుటుంబాల్లో కేవలం 68 లక్షల కుటుంబాలు మాత్రమే వెరిఫై చేయబడ్డాయి. వృద్ధాప్య పింఛన్లలో వ్యత్యాసాలు, కెనెక్టివిటీ సరిగా లేకపోవడంతో పీపీపీ కేంద్రాల వద్ద పొడవైన క్యూలు ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాయి. ఈ కారణాలు అన్నీ కాంగ్రెస్కి వరంగా మారాయి.
తాజావార్తలు
-
Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
-
RBI Cancels 150 NFBC License: 150 ఎన్బిఎఫ్సి కంపెనీల ఆర్బీఐ కొరఢా.. లైసెన్సులు రద్దు
-
Best Investment: నెలకు రూ.10 వేల పెట్టుబడి.. ఐదేళ్లకు కళ్లు చెదిరే లాభాలు.. చాట్ జీపీటీ చెప్పిన ప్లాన్ ఇదే..
-
Kiara Advani: ప్రతి రిలేషన్ మనకు.. ఏదో ఒక పాఠం నేర్పుతుంది..
-
Illegal Ration Rice: అక్రమ రేషన్ బియ్యం మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం.. 2 వేల కేజీల బియ్యం స్వాధీనం!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!