Haryana: బీజేపీ వైఫల్యాలే హర్యానాలో కాంగ్రెస్కి బలం.. ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నది ఇదే..
- హర్యానాలో కాంగ్రెస్కి వరంగా మారిన బీజేపీ వైఫల్యాలు..
- ఇ-గవర్నెన్స్.. హమీలు నెరవేర్చకపోవడం అసంతృప్తిని పెంచాయి..
- అగ్నవీర్.. నిరుద్యోగం కూడా కారణమే..
- రెజ్లర్ల నిరసనతో జాట్ వర్గం మొత్తం కాంగ్రెస్ వైపే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haryana: హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని అన్ని సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్లో కుండబద్ధలు కొట్టాయి. మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధిద్దామని అనుకున్న బీజేపీ ఆశలపై హర్యానా ఓటర్లు నీళ్లు చల్లారు. గత పదేళ్లుగా బీజేపీ వైఫల్యాలే కాంగ్రెస్ విజయానికి సోపానాలు అవుతున్నాయి. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ హర్యానాలో బలంగా పుంజుకుంది. మొత్తం 90 స్థానాలు ఉన్న హర్యానా అసెంబ్లీలో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ 46 కన్నా ఎక్కువ స్థానాలు సాధిస్తుందని అన్ని సర్వేలు చెప్పాయి. బీజేపీకి కేవలం 20-28 సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేసింది.
హర్యానాలో బీజేపీకి ప్రజాదరణ క్షీణించింది. పదేళ్లుగా అధికారంలో ఉండటం బీజేపీపై ప్రజావ్యతిరేకతను పెంచింది. పెరుగుతున్న అసంతృప్తిని తగ్గించేందుకు 2024లో సీఎం మనోహర్ లాల్ కట్టర్ని తొలగించి, నయాబ్ సైనీని సీఎం చేసింది. ఇది కూడా పార్టీకి మైనస్ అయింది. ఇక రెజ్లర్ల నిరసన, రైతులు ఉద్యమం జాట్ వర్గం పూర్తిగా బీజేపీ నుంచి కాంగ్రెస్ వైపు మళ్లింది. ఇక ముస్లింలు ఎప్పటి నుంచో బీజేపీకి దూరంగానే ఉన్నారు. గతేడాది అల్లర్లు జరిగిన నుహ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ముస్లింలు కాంగ్రెస్కి ఓటేశారు.
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
అధిక నిరుద్యోగం, అగ్నివీర్ అంశం కూడా బీజేపీ కొంపముంచాయి. నిజానికి అగ్నవీర్ అనేది సైన్యానికి అత్యంత కీలకం. అయితే, హర్యానా నుంచి ఎక్కువ మంది ఆర్మీలో జాయిన్ అవుతుంటారు. అగ్నివీర్ అనేది తమను నష్టపరుస్తుందని అక్కడి యువత భావించింది. ఇక హర్యానాలో నిరుద్యోగం 2021-22లో 9 శాతం ఉంది. ఇది జాతీయ సగటు 4.1 కన్నా రెండింతలు. తన మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, దాదాపుగా 1.84 లక్షల్ ఖాళీలు భర్తీ చేయడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైంది. పోటీ పరీక్షల కుంభకోణం నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం 47 పరీక్షల్ని రద్దు చేయడం కూడా విశ్వసనీయతను దిగజార్చింది.
Read Also: Gujarat: ఫ్రెండ్ని కలిసేందుకు వెళ్లిన టీనేజీ బాలికపై గ్యాంగ్ రేప్..
ఇక పట్టణ ఓటర్లలో కూడా బీజేపీ అసంతృప్తి పెరిగింది. సాంప్రదాయకంగా పట్టణ ఓటర్లు బీజేపీ వైపు ఉంటారు. ఈ సారి బీజేపీ తమను పట్టించుకోలేదనే ఆలోచన వారిలో ఉంది. మొత్తం పట్టణ ఓటర్లు బీజేపీకి ఓటేయవద్దని నిర్ణయించుకున్నారు. 2 కోట్ల మంది అర్హత ఉన్న ఓటర్లలో కోటి మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది కూడా బీజేపీ ఘోరంగా దెబ్బతీసింది.
అవినీతిని అరికట్టేందుకు ఖట్టర్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఇ-గవర్నెన్స్ విఫలమైంది. మెరుగైన సేవల కోసం ప్రభుత్వం పరివార్ పహచాన్ పాత్ర(పీపీపీ), మేరీ ఫసల్ మేరా బైరాతో పాటు అనేక ఆన్లైన్ పోర్టల్స్ని అందుబాటులోకి తెచ్చింది. అయితే ప్రజలు వీటిని వినియోగించుకోవడంలో ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు ఇంటర్నెట్ కనెక్టివిటీ సక్రమంగా లేకపోవడం కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచింది.
ఇక బీజేపీ తాను ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. ఉదాహరణకు, ఆగస్ట్ 2024లో, ప్రభుత్వం 24 పంటలకు MSP చెల్లించే ప్రణాళికను ప్రకటించింది, అలాగే అగ్నివీరులకు 10% హారిజాంటల్ రిజర్వేషన్లు మరియు వడ్డీ రహిత రుణాలను ప్రకటించింది. అయితే, ఈ వాగ్దానాలు కేవలం ఎన్నికలకు ముందు ఇచ్చారు. ఇది కూడా ప్రజల విశ్వాసాన్ని మరింత దూరం చేశాయి. 2020లో తప్పనిసరిగా పరివార్ పహచన్ పాత్రను ప్రవేశపెట్టింది. నమోదు చేసుకున్న 72 లక్షల కుటుంబాల్లో కేవలం 68 లక్షల కుటుంబాలు మాత్రమే వెరిఫై చేయబడ్డాయి. వృద్ధాప్య పింఛన్లలో వ్యత్యాసాలు, కెనెక్టివిటీ సరిగా లేకపోవడంతో పీపీపీ కేంద్రాల వద్ద పొడవైన క్యూలు ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాయి. ఈ కారణాలు అన్నీ కాంగ్రెస్కి వరంగా మారాయి.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!