Bypoll Results: త్రిపురలో బీజేపీ హవా… స్వల్ప ఆధిక్యంలో మాణిక్ సాహా విజయం
త్రిపురలో బీజేపీ హవా కొనసాగింది. రాష్ట్రంలో 4 శాసనసభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో మూడింటిని బీజేపీ గెలుచుకోగా.. ఒక స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది. బర్దోవాలి(పట్టణ) నియోజకవర్గం నుంచి పోటీచేసిన ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి మాణిక్ సాహా కాంగ్రెస్ అభ్యర్థి ఆశిష్ కుమార్ సాహాపై 6,104 ఓట్ల ఆధీక్యంతో గెలుపొందినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ గెలుపుతో ఆయన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడానికి అర్హత సాధించినట్లైంది. ఈ ఉపఎన్నికల్లో బర్దోవాలి, జుబరాజ్నగర్, సుర్మ స్థానాల్లో బీజేపీ విజయం సాధించగా.. అగర్తల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుదీప్ రాయ్ బర్మన్ 3,163 ఓట్లతో గెలుపొందారు.
త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా గత నెల ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అప్పటి ముఖ్యమంత్రి బిప్లవ్దేవ్ రాజీనామాతో ఆయన సీఎం పదవిని చేపట్టారు. ఆ పదవిలో కొనసాగాలంటే చట్టప్రకారం ఎమ్మెల్యేగా గెలవడం తప్పనిసరి. నిబంధనల ప్రకారం ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయవలసి ఉంటుంది. మాణిక్ గెలవడంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. బర్దోవాలి(పట్టణ) నియోజకవర్గ శాసన సభ్యుడు ఆశిష్ కుమార్ సాహా బీజేపీకి రాజీనామా చేసి, ఫిబ్రవరిలో కాంగ్రెస్లో చేరారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది.
Also Read
- 2 States Elections: బెంగాల్, తమిళనాడులో ప్రారంభమైన పోలింగ్.. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
ఈ నాలుగు నియోజకవర్గాలకు ఉప ఎన్నికల పోలింగ్ జూన్ 23న జరిగింది. 22 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. దాదాపు 78 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
తాజావార్తలు
-
2 States Elections: బెంగాల్, తమిళనాడులో ప్రారంభమైన పోలింగ్.. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు
-
Rishabh Pant: నా వల్లే ఓడిపోయాం.. కెప్టెన్ రిషబ్ పంత్ ఆవేదన!
-
TGSRTC Strike: నేడు ఆర్టీసీ బస్సులు నడుస్తాయా? సమ్మెపై క్లారిటీ ఇచ్చిన జేఏసీ!
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?