Subramanian Swamy: మోడీ సారథ్యంలో బీజేపీ టైటానిక్లా మునుగుతోంది..
- సొంత పార్టీపై విమర్శలు చేసిన బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి..
- బీజేపీ టైటానిక్ షిప్ లా మునిగిపోవాలనుకుంటే మోడీ దానికి సరైన సారథి..
- సుబ్రహ్మణ్య స్వామిపై బీజేపీ కార్యకర్తలు తీవ్రస్థాయిలో ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Subramanian Swamy: సొంత పార్టీపై సీనియర్ బీజేపీ నేత, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉప ఎన్నికల ఫలితాల్లో 13 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలిచింది.. ఈ ఫలితాల నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ పార్టీ టైటానిక్ షిప్ లా మునిగిపోవాలనుకుంటే మోడీ దానికి సరైన సారథి అంటూ విమర్శలు గుప్పించారు.
Read Also: Adi Srinivas: హరీష్ రావుపై బండి సంజయ్ ప్రశంసలు.. బీజేపీ ప్లాన్ అదే?
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
కాగా, బీజేపీ బీటలు వారి మునగడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని ఉప ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయంటూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఎద్దేవా చేశారు. ఈ విషయంపై నెటిజన్లు సైతం విభిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. ఓ వర్గం సుబ్రహ్మణ్య స్వామిని సపోర్ట్ చేస్తూ వ్యాఖ్యనిస్తున్నారు. మీరు చెబుతున్నది నిజమే.. ఎందుకంటే మీ కెప్టెన్ దేశ ప్రజల కోసం పని చేయడం లేదు.. అంబానీ, అదానీలకు దేశ సంపదను దోచి పెట్టడానికి మాత్రమే పని చేస్తున్నారంటూ వ్యాఖ్యనిస్తున్నారు.
Read Also: AP Government: పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యం.. కొత్త పరిశ్రమల కోసం సర్కార్ కసరత్తు..
కాగా, మరొ వర్గం మాత్రం సుబ్రహ్మణ్య స్వామికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. మీరు ఇలాంటి కామెంట్లు చేయడం వల్ల మీ క్రెడిబిలిటీని పోగొట్టుకుంటున్నారని మండిపడుతున్నారు. పాలిటిక్స్ నుంచి మీరు రిటైర్ అయిపోవడం మంచిది అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మొత్తం ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు ఫలితాల్లో 10 సీట్లను ఇండియా కూటమి దక్కించుకోగా.. రెండు సీట్లను మాత్రమే బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. దీంతో బీజేపీపై వ్యతిరేకత ప్రజల్లో మొదలైందంటూ ప్రతిపక్ష పార్టీలు కామెంట్స్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సుబ్రహ్మణ్య స్వామి చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
If we in BJP want to see our party sink like the Titantic Ship then Modi is the best to command.By-Election results show BJP is cracking up to sink forever.
— Subramanian Swamy (@Swamy39) July 15, 2024
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!