Amit Shah: గిరిజనులపై ‘‘లవ్ జిహాద్’’, ‘‘ల్యాండ్ జిహాద్’’.. సీఎం గిరిజనుడై ఉండీ వీటికి మద్దతు..
- జార్ఖండ్లో లవ్ జిహాద్కి సీఎం మద్దతు..
- రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే..
- అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనుల హక్కులపై శ్వేతపత్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: జార్ఖండ్ రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ కార్యకర్తలతో సమావేశమైన ఆయన రాష్ట్రంలో గిరిజన ప్రదేశాల్లో చొరబాట్లు పెరిగాయని, దీంతో గిరిజన జనభా తగ్గిపోతోందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే, గిరిజనులను కాపాడేందుకు వారి భూములు- రిజర్వేషన్లు- హక్కులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని శనివారం పేర్కొన్నారు.
Read Also: Bangladesh Protests: బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు 1000 మంది విద్యార్థులు.. చిక్కుకుపోయిన 4000 మంది..
Also Read
- UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
- Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
- High Court: కొడుకు చనిపోయాక అత్తమామలకు కోడలు భరణం ఇవ్వాలా? హైకోర్టు కీలక తీర్పు
- Jeetendra Mishra: ఆపరేషన్ సిందూర్ హీరో.. రామ మందిర కొత్త సీఈఓ జితేంద్ర మిశ్రా ఎవరు.?
వేలాది మంది చొరబడి గిరిజన యువతులను పెళ్లిళ్లు చేసుకుంటూ, సర్టిఫికేట్లు పొంది వారి భూములను కొనుక్కుంటున్నారని, రాబోయే రోజుల్లో గిరిజనుల సంఖ్య తగ్గతుందని అమిత్ షా అన్నారు. ఒక గిరిజనుడు ముఖ్యమంత్రి అయి ఉండీ రాష్ట్రంలో ‘‘ల్యాండ్ జిహాద్’’, ‘‘లవ్ జిహాద్’’ కి మద్దతు ఇస్తున్నాడని, జనాభా సమతుల్యతను దెబ్బతీస్తున్నాడని ఆరోపించారు.
లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ రాహుల్ గాంధీ అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని, ఆయనతో పాటు ఇండియా కూటమి, కాంగ్రెస్ నాయకులు వారి ఓటమిని అంగీకరించలేకపోతున్నారని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో 81 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇప్పటికే 52 సెగ్మెంట్లలో కమలం వికసించిందని, వచ్చే ఎన్నికల్లో్ బీజేపీదే అధికారమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇండియా కూటమి నేతలు బుజ్జగింపులు, వంశపారంపర్య రాజకీయాలు చేస్తున్నారని, దేశభద్రతతో ఇండియా కూటమి, కాంగ్రెస్ నేతలు ఆడుకుంటున్నారని ఆరోపించారు. జేఎంఎం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దేశంలోని అత్యంత అవినీతి ప్రభుత్వాల్లో ఒకటని, ఇది దిగిపోవాల్సిన సమయం వచ్చిందని అమిత్ షా అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి, లక్ష్మీకాంత్ బాజ్పాయ్, అర్జున్ ముండా సహా బీజేపీ నేతలు కూడా పాల్గొన్నారు.
#WATCH | Speaking at the Jharkhand BJP working committee meeting in Ranchi, Union HM Amit Shah says, "A tribal CM instead of worrying about the tribals is disturbing the balance of land and population by doing 'land jihad' and 'love jihad'. Thousands of infiltrators marry tribal… pic.twitter.com/0m8MyL9XdE
— ANI (@ANI) July 20, 2024
తాజావార్తలు
-
Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్పై సీపీ వేటు
-
UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
-
CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
-
Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
-
Telangana Airports: తెలంగాణలో ఎయిర్పోర్టులకు స్పీడ్.. డిసెంబరులో బిగ్ అప్డేట్.!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!