Bangladesh Protests: బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు 1000 మంది విద్యార్థులు.. చిక్కుకుపోయిన 4000 మంది..
- బంగ్లాదేశ్లో హింసాత్మకంగా మారిన నిరసనలు..
- బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు 1000 మంది విద్యార్థులు..
- చిక్కుకుపోయిన 4000 మంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Protests: బంగ్లాదేశ్లో రిజర్వేషన్లపై జరగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటయోధుల కుటుంబాలకు చెందిన వారికి 30 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ, పలు వర్సిటీల విద్యార్థులు, ప్రజలు నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ రిజర్వేషన్లు ఎత్తేసి మెరిట్ ఉన్న విద్యార్థులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ హింసలో దాదాపుగా 115 మంది మరణించారు. ప్రస్తుతం షేక్ హసీనా ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూని విధించింది. నిరసనల్ని అణిచివేయడానికి ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దించింది. కర్ఫ్యూ ఆదివారం ఉదయం 10 గంటల వరకు ఉంటుందని సైన్యం ప్రకటించింది.
Read Also: Chirag Paswan: యూనిఫాం సివిల్ కోడ్ పై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు..మద్దతు ఇవ్వను..!
Also Read
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్లో హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశంలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు స్వదేశానికి వస్తున్నారు. ఢాకాలోని భారత హైకమిషన్ భారత్-బంగ్లాదేశ్ వద్ద అంతర్జాతీయ సరిహద్దును దాటేందుకు వారి ప్రయాణాన్ని సులభతరం చేస్తోంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) పౌర విమానయానం, ఇమ్మిగ్రేషన్, ల్యాండ్ పోర్ట్లు మరియు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)తో కూడా భారతీయ పౌరులకు సాఫీగా వెళ్లేందుకు సహకరిస్తోంది. ఇప్పటి వరకు 778 మంది భారతీయులు భూమార్గం ద్వారా, 200 మంది విద్యార్థుల వరకు ఢాకా, చిట్టగాంగ్ విమానాశ్రయాల ద్వారా భారత్ చేరినట్లు విదేశాంగ ప్రకటించింది.
ఇదిలా ఉంటే బంగ్లాదేశ్లోని వివిధ యూనివర్సిటీల్లో చదువుకుంటున్న మరో 4000 మంది భారతీయలు అక్కడే చిక్కుకుపోయారు. వీరితో భారత హైకమిషన్ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. నేపాల్, భూటాన్ అభ్యర్థన మేరకు ఆ దేశాలకు చెందిన విద్యార్థులను కూడా భారత్లోకి ప్రవేశించేందుకు సహాయం చేస్తున్నారు. అయితే, చాలా మంది విద్యార్థులు భారత్ రావడానికి విమాన టిక్కెట్లు బుక్ చేసుకున్నప్పటికీ, కర్ఫ్యూ ఉండటంతో వారు బయటకు రాలేని పరిస్తితి ఏర్పడింది. యూనివర్సిటీ హాస్టళ్లలోనే విద్యార్థులు ఉన్నారు. అక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉన్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఢాకాలోని హైకమిషన్ బంగ్లాదేశ్ పౌర విమానయాన అధికారులు మరియు వాణిజ్య విమానయాన సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ఢాకా మరియు చిట్టగాంగ్ నుండి భారతదేశానికి అంతరాయం లేకుండా విమాన సేవలను అందిస్తోంది.
తాజావార్తలు
-
Tilak Varma Fifty: కీలక హాఫ్ సెంచరీ చేసినా.. చెత్త జాబితాలో తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ!
-
Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్తో సూపర్ టేస్టీ కూర..
-
G2: అడివి శేష్ స్పై థ్రిల్లర్కు బ్రేకులు.. ఈ ఏడాది రిలీజ్ కష్టమేనా?
-
Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
-
God Of War : సాయంత్రం 5.04 గంటలకు ‘విల్లాల వీరుడి’ ఆగమనం
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!