BJP: రాహుల్ గాంధీ ఇందుకే కుంగ్ఫూ నేర్చుకున్నారా..? బీజేపీ ఎంపీలపై దాడిపై పోలీస్ కేసు..
- రాహుల్ గాంధీ ఇందుకే కుంగ్ ఫూ నేర్చుకున్నారా..?
- బీజేపీ ఎంపీల దాడిపై కమలం నేతలు ఫైర్..
BJP: కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో చేసిన ‘‘ అంబేద్కర్ ’’ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తతల్ని పెంచాయి. ముఖ్యంగా పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్, ఇతర ఇండియా కూటమి పక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా నిరసన తెలిపాయి. దీనికి ప్రతిగా బీజేపీ కూడా అంతే ధీటుగా అంబేద్కర్ని అవమానించిన పార్టీ కాంగ్రెస్ అంటూ నిరసనలతో హోరెత్తించారు. ఇదిలా ఉంటే, పార్లమెంట్ ఆవరణలో ఎంపీలపై దాడి సంచలనంగా మారింది.
గురువారం పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీ ఎంపీలైన ప్రతాప్ చంద్ర సారంగి, ముఖేష్ రాజ్పుత్లను నెట్టడంతో వారు గాయపడ్డారు. సారంగికి తలకు గాయమైంది. ఆయనను అధికారులు ఆస్పత్రికి తరలించి, ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. పార్లమెంట్ ప్రధాన ద్వారమైన మకర్ దావర్ వద్ద ఈ ఘటన జరిగింది. సారంగిపైకి రాహుల్ గాంధీ ఒక వ్యక్తి నెట్టడంతో ఆయన మెట్లపై పడిపోయారు. ఈ వ్యవహారం మొత్తం పెద్ద వివాదంగా మారింది.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
Read Also: Congress: అమిత్ షా ‘‘అంబేద్కర్’’ కామెంట్స్ ఎడిట్.. కాంగ్రెస్ నేతలకు ‘ఎక్స్’ నోటీసులు..
బీజేపీ ఇద్దరు ఎంపీలు గాయపడ్డారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరన్ రిజిజు తెలిపారు. పార్లమెంట్ ఆవరణలో ఎలా బలప్రయోగం చేయగలడు..? ఇతర ఎంపీలపై భౌతికంగా దాడి చేసే అధికారం ఏ చట్ట ప్రకారం రాహుల్ గాంధీకి ఉంది..? అని రిజిజు ప్రశ్నించారు. జపనీస్ మార్షల్ ఆర్ట్లో బ్లాక్ బెల్ట్ కలిగి ఉన్న రాహుల్ గాంధీపై ఆయన సెటైర్లు పేల్చారు. ‘‘మీరు ఇతర ఎంపీలపై దాడి చేయడానికి కరాటే, కుంగ్ ఫూ నేర్చుకున్నారా..? ’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ కుస్తీకి వేదిక కాదు, ఇద్దరు ఎంపీలు గాయపడి ఆస్పత్రిలో ఉన్నారని అన్నారు. రాహుల్ గాంధీ గాయపడిన ఎంపీలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఈ ఘటనపై సారంగి, రాజ్పుత్లో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడినట్లు సమాచారం. ఈ ఘటనపై బీజేపీ రాహుల్ గాంధీపై పోలీస్ కేసు పెట్టింది. ఈ ఘటనపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘నేను పార్లమెంట్కి రాకుండా బీజేపీ ఎంపీల గుంపు అడ్డుకుందని, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేని తోసేస్తున్నారు. ఇది ఘర్షణకు కారణమైంది. బీజేపీ ఎంపీలు తనను నెట్టివేసి బెదిరించారు.’’ అని చెప్పారు.
#WATCH | Union Minister Kiren Rijiju says, "Makar Dwar is the main entry gate of the Members of Parliament to both Lok Sabha and Rajya Sabha. The Congress and their other MPs kept on standing in that particular location and they have been showing placards and sloganeering for the… pic.twitter.com/gwvFmGGm2M
— ANI (@ANI) December 19, 2024
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!