BJP: రాహుల్ గాంధీ ఇందుకే కుంగ్ఫూ నేర్చుకున్నారా..? బీజేపీ ఎంపీలపై దాడిపై పోలీస్ కేసు..
- రాహుల్ గాంధీ ఇందుకే కుంగ్ ఫూ నేర్చుకున్నారా..?
- బీజేపీ ఎంపీల దాడిపై కమలం నేతలు ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో చేసిన ‘‘ అంబేద్కర్ ’’ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తతల్ని పెంచాయి. ముఖ్యంగా పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్, ఇతర ఇండియా కూటమి పక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా నిరసన తెలిపాయి. దీనికి ప్రతిగా బీజేపీ కూడా అంతే ధీటుగా అంబేద్కర్ని అవమానించిన పార్టీ కాంగ్రెస్ అంటూ నిరసనలతో హోరెత్తించారు. ఇదిలా ఉంటే, పార్లమెంట్ ఆవరణలో ఎంపీలపై దాడి సంచలనంగా మారింది.
గురువారం పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీ ఎంపీలైన ప్రతాప్ చంద్ర సారంగి, ముఖేష్ రాజ్పుత్లను నెట్టడంతో వారు గాయపడ్డారు. సారంగికి తలకు గాయమైంది. ఆయనను అధికారులు ఆస్పత్రికి తరలించి, ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. పార్లమెంట్ ప్రధాన ద్వారమైన మకర్ దావర్ వద్ద ఈ ఘటన జరిగింది. సారంగిపైకి రాహుల్ గాంధీ ఒక వ్యక్తి నెట్టడంతో ఆయన మెట్లపై పడిపోయారు. ఈ వ్యవహారం మొత్తం పెద్ద వివాదంగా మారింది.
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
Read Also: Congress: అమిత్ షా ‘‘అంబేద్కర్’’ కామెంట్స్ ఎడిట్.. కాంగ్రెస్ నేతలకు ‘ఎక్స్’ నోటీసులు..
బీజేపీ ఇద్దరు ఎంపీలు గాయపడ్డారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరన్ రిజిజు తెలిపారు. పార్లమెంట్ ఆవరణలో ఎలా బలప్రయోగం చేయగలడు..? ఇతర ఎంపీలపై భౌతికంగా దాడి చేసే అధికారం ఏ చట్ట ప్రకారం రాహుల్ గాంధీకి ఉంది..? అని రిజిజు ప్రశ్నించారు. జపనీస్ మార్షల్ ఆర్ట్లో బ్లాక్ బెల్ట్ కలిగి ఉన్న రాహుల్ గాంధీపై ఆయన సెటైర్లు పేల్చారు. ‘‘మీరు ఇతర ఎంపీలపై దాడి చేయడానికి కరాటే, కుంగ్ ఫూ నేర్చుకున్నారా..? ’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ కుస్తీకి వేదిక కాదు, ఇద్దరు ఎంపీలు గాయపడి ఆస్పత్రిలో ఉన్నారని అన్నారు. రాహుల్ గాంధీ గాయపడిన ఎంపీలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఈ ఘటనపై సారంగి, రాజ్పుత్లో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడినట్లు సమాచారం. ఈ ఘటనపై బీజేపీ రాహుల్ గాంధీపై పోలీస్ కేసు పెట్టింది. ఈ ఘటనపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘నేను పార్లమెంట్కి రాకుండా బీజేపీ ఎంపీల గుంపు అడ్డుకుందని, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేని తోసేస్తున్నారు. ఇది ఘర్షణకు కారణమైంది. బీజేపీ ఎంపీలు తనను నెట్టివేసి బెదిరించారు.’’ అని చెప్పారు.
#WATCH | Union Minister Kiren Rijiju says, "Makar Dwar is the main entry gate of the Members of Parliament to both Lok Sabha and Rajya Sabha. The Congress and their other MPs kept on standing in that particular location and they have been showing placards and sloganeering for the… pic.twitter.com/gwvFmGGm2M
— ANI (@ANI) December 19, 2024
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..