Delhi New CM: ఢిల్లీ కొత్త సీఎం ఎంపికపై బాంబ్ పేల్చిన బీజేపీ
- ఢిల్లీ కొత్త సీఎం ఎంపికపై బాంబ్ పేల్చిన బీజేపీ
- గురువారానికి వాయిదా వేసిన హైకమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి 9 రోజులైంది. ఫిబ్రవరి 8న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. 27 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. కానీ ఇప్పటి వరకు కొత్త ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటు చేయలేదు. ఫలితాలు వెలువడిన రెండ్రోజులకే ప్రధాని మోడీ రెండు దేశాల పర్యటన కోసం ఫ్రాన్స్, అమెరికా వెళ్లారు. విదేశాల నుంచి వచ్చాకే ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎంపిక ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెప్పుకుంటూ వచ్చాయి. తీరా ప్రధాని మోడీ వచ్చి మూడ్రోజులు అవుతున్నా.. సీఎం ఎంపికపై మాత్రం ఊగిసలాట సాగుతూనే ఉంది.
ఇది కూడా చదవండి: Nainathra: భర్తతో కలిసి రొమాంటిక్ వీడియో షేర్ చేసిన నయనతార..
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్పింగ్కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
సోమవారం బీజేపీ శాసనసభా పక్ష సమావేశం ఉంటుందని ఆ పార్టీ నేతలు చెప్పారు. సోమవారం సాయంత్రంలోపు కొత్త ముఖ్యమంత్రి పేరు ప్రకటిస్తారని కూడా చెప్పుకొచ్చారు. మీడియా, ప్రజలు ఎదురుచూస్తున్న సమయంలో బీజేపీ అధిష్టానం బాంబ్ పేల్చింది. అనూహ్యంగా శాసససభా పక్ష సమావేశాన్ని వాయిదా వేసింది. వచ్చే గురువారానికి హైకమాండ్ వాయిదా వేసింది. దీంతో మరో మూడు రోజులు ఎదురు చూపులు తప్పని పరిస్థితి నెలకొంది.
ఇది కూడా చదవండి: Piduguralla: పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవి టీడీపీ కైవసం!
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ 48, ఆప్ 22 స్థానాలు గెలుచుకున్నాయి. 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక ముఖ్యమంత్రి రేసులో ప్రధానంగా కేజ్రీవాల్ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు వినిపిస్తోంది. అంతేకాకుండా మహిళల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇందులో ముఖ్యమంత్రి దళితులకు సీఎం పీఠాన్ని కట్టబెట్టొచ్చన్న వార్తలు కూడా వినిపిస్తు్న్నాయి. ఇందుకోసం 15 మంది పేర్లను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. హైకమాండ్ దృష్టిలో ఎవరున్నది తేలాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.
ఇది కూడా చదవండి: WPL 2025: తొలి విజయాన్ని అందుకున్న గుజరాత్ జెయింట్స్
తాజావార్తలు
-
Secret Soldiers: ‘చైనా’ పేరుతో సెన్సార్ బోర్డ్లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
-
OTR: సిగ్గా.. భయమా.. మొహమాటమా? అంజిరెడ్డి తీరుపై బీజేపీలో హాట్ టాపిక్
-
OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
-
OTR: తెలంగాణ కేబినెట్లో విజయశాంతికి ఛాన్స్? ఢిల్లీలో గట్టిగా లాబీయింగ్!
-
Srimad Bhagavatam : ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ టెక్నీషియన్లతో 7 భాగాలుగా ‘శ్రీమద్భాగవతం
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!