BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
- గుజరాత్ లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్..
- తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
- 15 కార్పొరేషన్లు బీజేపీ వశం, మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: గుజరాత్ లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 15 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా, అన్నింటిని బీజేపీ సొంతం చేసుకుంది. ఈ ఫలితాలు పట్టణ ప్రాంతంలో కాషాయ పార్టీకి ఉన్న బలాన్ని మరోసారి స్పష్టం చేశాయి. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్, ఆప్లు పత్తాలేకుండా పోయాయి. నామమాత్రపు పోటీ కూడా ఇవ్వలేదు. మొత్తం 1,044 సీట్లు గల 15 మున్సిపల్ కార్పొరేషన్లలో, బీజేపీ 856 సీట్లు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 77 సీట్లు గెలుచుకోగా, ఇతరులు 12 స్థానాల్లో విజయం సాధించారు.
అహ్మదాబాద్, సూరత్ కార్పొరేషన్లలో బీజేపీ సంచలన విజయాలను సాధించింది. అహ్మదాబాద్లోని 192 స్థానాలకు గానూ బీజేపీ 158 స్థానాలను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 22 స్థానాల్లో గెలిచింది. ఇక సూరత్లో 120 స్థానాలు ఉంటే, బీజేపీ 115 స్థానాల్లో, ఆప్ 4 స్థానాల్లో గెలిచాయి. కాంగ్రెస్ ఒకే స్థానానికి పరిమితమైంది. గత ఎన్నికల్లో కాస్త మెరుగైన ప్రదర్శన చేసిన ఆప్ ఈ సారి ఎన్నికల్లో మాత్రం చతికిలపడింది.
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
Read Also: Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’
రాజ్కోట్, వడోదర, భావ్నగర్లలో బీజేపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. రాజ్కోట్లో 72 స్థానాలకు గానూ బీజేపీ 65, కాంగ్రెస్ 7 స్థానాలను గెలుచుకుంది. వడోదరలో 76 వార్డులకు గానూ బీజేపీ 69, కాంగ్రెస్ 6 వార్డుల్ని గెలుచుకుంది. భావ్నగర్లోని మొత్తం 52 వార్డులు ఉంటే బీజేపీ 44, కాంగ్రెస్ 8, ఆప్ ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. మధ్యతరహా పట్టణాల్లో కూడా కమలం తన జోరు చూపించింది. కర్మసాద్-ఆనంద్, గాంధీ దామ్, నడియాడ్, నవసారి పట్టణాలను బీజేపీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. పోర్ బందర్, మోర్బి, సురేంద్ర నగర్, మొహసానా, వాపి, జామ్నగర్ కార్పొరేషన్లను కూడా బీజేపీ గెలుచుకుంది.
84 మున్సిపాలిటీల్లోని 2030 వార్డులు ఉంటే బీజేపీ 1791 గెలుచుకోగా, కాంగ్రెస్ 414 స్థానాల్లో, ఇతరులు 144 స్థానాల్లో విజయం సాధించారు. 34 జిల్లా పంచాయతీల్లో 1090 స్థానాలు ఉంటే బీజేపీ 568 స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్ 77, ఇతరులు 30 స్థానాల్లో గెలిచారు. 260 తాలూకా పంచాయతీల్లో 5234 స్థానాలు ఉంటే బీజేపీ 2397 స్థానాలను దక్కించుకుంటే, కాంగ్రెస్ 591, ఇతరులు 329 స్థానాల్లో గెలిచారు.
తాజావార్తలు
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
-
Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
-
Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
-
Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
-
Weight Loss Snack: బరువు తగ్గాలనుకుంటున్నారా? పొట్ట చుట్టూ కొవ్వు కరగాలా? మీ డైట్లో దీనిని చేర్చుకోండి!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!