BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
- గుజరాత్ లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్..
- తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
- 15 కార్పొరేషన్లు బీజేపీ వశం, మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: గుజరాత్ లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 15 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా, అన్నింటిని బీజేపీ సొంతం చేసుకుంది. ఈ ఫలితాలు పట్టణ ప్రాంతంలో కాషాయ పార్టీకి ఉన్న బలాన్ని మరోసారి స్పష్టం చేశాయి. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్, ఆప్లు పత్తాలేకుండా పోయాయి. నామమాత్రపు పోటీ కూడా ఇవ్వలేదు. మొత్తం 1,044 సీట్లు గల 15 మున్సిపల్ కార్పొరేషన్లలో, బీజేపీ 856 సీట్లు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 77 సీట్లు గెలుచుకోగా, ఇతరులు 12 స్థానాల్లో విజయం సాధించారు.
అహ్మదాబాద్, సూరత్ కార్పొరేషన్లలో బీజేపీ సంచలన విజయాలను సాధించింది. అహ్మదాబాద్లోని 192 స్థానాలకు గానూ బీజేపీ 158 స్థానాలను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 22 స్థానాల్లో గెలిచింది. ఇక సూరత్లో 120 స్థానాలు ఉంటే, బీజేపీ 115 స్థానాల్లో, ఆప్ 4 స్థానాల్లో గెలిచాయి. కాంగ్రెస్ ఒకే స్థానానికి పరిమితమైంది. గత ఎన్నికల్లో కాస్త మెరుగైన ప్రదర్శన చేసిన ఆప్ ఈ సారి ఎన్నికల్లో మాత్రం చతికిలపడింది.
Also Read
- LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
- Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
- NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
- Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
Read Also: Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’
రాజ్కోట్, వడోదర, భావ్నగర్లలో బీజేపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. రాజ్కోట్లో 72 స్థానాలకు గానూ బీజేపీ 65, కాంగ్రెస్ 7 స్థానాలను గెలుచుకుంది. వడోదరలో 76 వార్డులకు గానూ బీజేపీ 69, కాంగ్రెస్ 6 వార్డుల్ని గెలుచుకుంది. భావ్నగర్లోని మొత్తం 52 వార్డులు ఉంటే బీజేపీ 44, కాంగ్రెస్ 8, ఆప్ ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. మధ్యతరహా పట్టణాల్లో కూడా కమలం తన జోరు చూపించింది. కర్మసాద్-ఆనంద్, గాంధీ దామ్, నడియాడ్, నవసారి పట్టణాలను బీజేపీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. పోర్ బందర్, మోర్బి, సురేంద్ర నగర్, మొహసానా, వాపి, జామ్నగర్ కార్పొరేషన్లను కూడా బీజేపీ గెలుచుకుంది.
84 మున్సిపాలిటీల్లోని 2030 వార్డులు ఉంటే బీజేపీ 1791 గెలుచుకోగా, కాంగ్రెస్ 414 స్థానాల్లో, ఇతరులు 144 స్థానాల్లో విజయం సాధించారు. 34 జిల్లా పంచాయతీల్లో 1090 స్థానాలు ఉంటే బీజేపీ 568 స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్ 77, ఇతరులు 30 స్థానాల్లో గెలిచారు. 260 తాలూకా పంచాయతీల్లో 5234 స్థానాలు ఉంటే బీజేపీ 2397 స్థానాలను దక్కించుకుంటే, కాంగ్రెస్ 591, ఇతరులు 329 స్థానాల్లో గెలిచారు.
తాజావార్తలు
-
Fraud: రూ.1700 కోట్ల నకిలీ జీఎస్టీ కుంభకోణం బట్టబయలు.. ప్రధాన సూత్రధారి అరెస్ట్..
-
Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
-
LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
-
Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!