BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
- గుజరాత్ లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్..
- తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
- 15 కార్పొరేషన్లు బీజేపీ వశం, మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: గుజరాత్ లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 15 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా, అన్నింటిని బీజేపీ సొంతం చేసుకుంది. ఈ ఫలితాలు పట్టణ ప్రాంతంలో కాషాయ పార్టీకి ఉన్న బలాన్ని మరోసారి స్పష్టం చేశాయి. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్, ఆప్లు పత్తాలేకుండా పోయాయి. నామమాత్రపు పోటీ కూడా ఇవ్వలేదు. మొత్తం 1,044 సీట్లు గల 15 మున్సిపల్ కార్పొరేషన్లలో, బీజేపీ 856 సీట్లు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 77 సీట్లు గెలుచుకోగా, ఇతరులు 12 స్థానాల్లో విజయం సాధించారు.
అహ్మదాబాద్, సూరత్ కార్పొరేషన్లలో బీజేపీ సంచలన విజయాలను సాధించింది. అహ్మదాబాద్లోని 192 స్థానాలకు గానూ బీజేపీ 158 స్థానాలను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 22 స్థానాల్లో గెలిచింది. ఇక సూరత్లో 120 స్థానాలు ఉంటే, బీజేపీ 115 స్థానాల్లో, ఆప్ 4 స్థానాల్లో గెలిచాయి. కాంగ్రెస్ ఒకే స్థానానికి పరిమితమైంది. గత ఎన్నికల్లో కాస్త మెరుగైన ప్రదర్శన చేసిన ఆప్ ఈ సారి ఎన్నికల్లో మాత్రం చతికిలపడింది.
Also Read
- Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
- Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
- West Bengal: మదర్సాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి.. సువేందు సంచలన నిర్ణయం..
- Bengaluru: ఎయిరిండియాకు తప్పిన పెను ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో ఏం జరిగిందంటే..!
Read Also: Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’
రాజ్కోట్, వడోదర, భావ్నగర్లలో బీజేపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. రాజ్కోట్లో 72 స్థానాలకు గానూ బీజేపీ 65, కాంగ్రెస్ 7 స్థానాలను గెలుచుకుంది. వడోదరలో 76 వార్డులకు గానూ బీజేపీ 69, కాంగ్రెస్ 6 వార్డుల్ని గెలుచుకుంది. భావ్నగర్లోని మొత్తం 52 వార్డులు ఉంటే బీజేపీ 44, కాంగ్రెస్ 8, ఆప్ ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. మధ్యతరహా పట్టణాల్లో కూడా కమలం తన జోరు చూపించింది. కర్మసాద్-ఆనంద్, గాంధీ దామ్, నడియాడ్, నవసారి పట్టణాలను బీజేపీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. పోర్ బందర్, మోర్బి, సురేంద్ర నగర్, మొహసానా, వాపి, జామ్నగర్ కార్పొరేషన్లను కూడా బీజేపీ గెలుచుకుంది.
84 మున్సిపాలిటీల్లోని 2030 వార్డులు ఉంటే బీజేపీ 1791 గెలుచుకోగా, కాంగ్రెస్ 414 స్థానాల్లో, ఇతరులు 144 స్థానాల్లో విజయం సాధించారు. 34 జిల్లా పంచాయతీల్లో 1090 స్థానాలు ఉంటే బీజేపీ 568 స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్ 77, ఇతరులు 30 స్థానాల్లో గెలిచారు. 260 తాలూకా పంచాయతీల్లో 5234 స్థానాలు ఉంటే బీజేపీ 2397 స్థానాలను దక్కించుకుంటే, కాంగ్రెస్ 591, ఇతరులు 329 స్థానాల్లో గెలిచారు.
తాజావార్తలు
-
Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
-
Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
-
IPL Tickets Block: 39 వేల టికెట్లు.. నిమిషాల్లో మాయం.! ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ వెనుక పెద్ద దందా.?
-
Fire Accident : NH-44 పై భారీ ప్రమాదం.. 8 కొత్త కార్లు పూర్తిగా దగ్ధం..!
-
West Bengal: మదర్సాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి.. సువేందు సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!