BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
- గుజరాత్ లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్..
- తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
- 15 కార్పొరేషన్లు బీజేపీ వశం, మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: గుజరాత్ లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 15 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా, అన్నింటిని బీజేపీ సొంతం చేసుకుంది. ఈ ఫలితాలు పట్టణ ప్రాంతంలో కాషాయ పార్టీకి ఉన్న బలాన్ని మరోసారి స్పష్టం చేశాయి. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్, ఆప్లు పత్తాలేకుండా పోయాయి. నామమాత్రపు పోటీ కూడా ఇవ్వలేదు. మొత్తం 1,044 సీట్లు గల 15 మున్సిపల్ కార్పొరేషన్లలో, బీజేపీ 856 సీట్లు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 77 సీట్లు గెలుచుకోగా, ఇతరులు 12 స్థానాల్లో విజయం సాధించారు.
అహ్మదాబాద్, సూరత్ కార్పొరేషన్లలో బీజేపీ సంచలన విజయాలను సాధించింది. అహ్మదాబాద్లోని 192 స్థానాలకు గానూ బీజేపీ 158 స్థానాలను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 22 స్థానాల్లో గెలిచింది. ఇక సూరత్లో 120 స్థానాలు ఉంటే, బీజేపీ 115 స్థానాల్లో, ఆప్ 4 స్థానాల్లో గెలిచాయి. కాంగ్రెస్ ఒకే స్థానానికి పరిమితమైంది. గత ఎన్నికల్లో కాస్త మెరుగైన ప్రదర్శన చేసిన ఆప్ ఈ సారి ఎన్నికల్లో మాత్రం చతికిలపడింది.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- India At UN: పాక్కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
Read Also: Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’
రాజ్కోట్, వడోదర, భావ్నగర్లలో బీజేపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. రాజ్కోట్లో 72 స్థానాలకు గానూ బీజేపీ 65, కాంగ్రెస్ 7 స్థానాలను గెలుచుకుంది. వడోదరలో 76 వార్డులకు గానూ బీజేపీ 69, కాంగ్రెస్ 6 వార్డుల్ని గెలుచుకుంది. భావ్నగర్లోని మొత్తం 52 వార్డులు ఉంటే బీజేపీ 44, కాంగ్రెస్ 8, ఆప్ ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. మధ్యతరహా పట్టణాల్లో కూడా కమలం తన జోరు చూపించింది. కర్మసాద్-ఆనంద్, గాంధీ దామ్, నడియాడ్, నవసారి పట్టణాలను బీజేపీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. పోర్ బందర్, మోర్బి, సురేంద్ర నగర్, మొహసానా, వాపి, జామ్నగర్ కార్పొరేషన్లను కూడా బీజేపీ గెలుచుకుంది.
84 మున్సిపాలిటీల్లోని 2030 వార్డులు ఉంటే బీజేపీ 1791 గెలుచుకోగా, కాంగ్రెస్ 414 స్థానాల్లో, ఇతరులు 144 స్థానాల్లో విజయం సాధించారు. 34 జిల్లా పంచాయతీల్లో 1090 స్థానాలు ఉంటే బీజేపీ 568 స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్ 77, ఇతరులు 30 స్థానాల్లో గెలిచారు. 260 తాలూకా పంచాయతీల్లో 5234 స్థానాలు ఉంటే బీజేపీ 2397 స్థానాలను దక్కించుకుంటే, కాంగ్రెస్ 591, ఇతరులు 329 స్థానాల్లో గెలిచారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!