BJP: మమతా ఎవరిచ్చారు నీకు ఆ అధికారం.. ‘‘బంగ్లాదేశ్’’ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
- బంగ్లాదేశ్ ప్రజలకు బెంగాల్ అండగా నిలుస్తుందన్న మమతా బెనర్జీ..
- ఆశ్రయం కల్పిస్తామని వ్యాఖ్యలు..
- ఆ అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించిన బీజేపీ..
- అక్రమ వలసదారుల్ని ప్రోత్సహిస్తున్నారంటూ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అవుతోంది. బంగ్లాదేశ్ హింసాత్మక ఘటనల గురించి మాట్లాడుతూ, బంగ్లాదేశ్ నుంచి శరణు కోరి వచ్చే ప్రజలకు బెంగాల్ అండగా నిలుస్తుందని, వారికి ఆశ్రయం ఇస్తుందని చెప్పారు. మమతా చేసిన వ్యాఖ్యల్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఎన్నికల్లో గెలవడానికి పొరుగుదేశం నుంచి వచ్చే అక్రమ వలసదారుల్ని జార్ఖండ్ వరకు స్థిరపరిచాలని ఇండియా కూటమి చెడ్డ ప్రణాళిక అని ఆరోపించింది.
పశ్చిమ బెంగాల్ బీజేపీ కో ఇంఛార్జ్ అమిత్ మాల్వియా మమతా బెనర్జీ వ్యాఖ్యలపై ఆగ్రహ వ్యక్తం చేశారు. ఇతర దేశం నుంచి వచ్చేవారికి ఆశ్రయం కల్పించే హక్కు మమతా బెనర్జీకి ఎక్కడిదని ప్రశ్నించారు. ఇమ్మిగ్రేషన్, పౌరసత్వం పూర్తిగా కేంద్రం పరిధిలోని అంశమని, ఇలాంటి విషయాల్లో రాష్ట్రాలకు ఎలాంటి అధికారాలు లేవని చెప్పారు. కోల్కతాలో జరిగిన ర్యాలీలో బెంగాల్ సీఎం మాట్లాడుతూ.. బంగ్లాదేశ్లో పెరుగుతున్న హింస నేపథ్యంలో, పొరుగు దేశం నుండి కష్టాల్లో ఉన్న ప్రజల కోసం తన రాష్ట్ర తలుపులు తెరిచి ఉంచుతానని మరియు వారికి ఆశ్రయం కల్పిస్తానని చెప్పారు.
Also Read
- Elvish Yadav: ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు!
- Himanta Biswa Sarma: హిమంత ది అన్స్టాపబుల్.. శాసనసభ పక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక.. సీఎం ఓత్ ఫిక్స్ డేట్
- PM Modi: తమిళనాడు సీఎంగా విజయ్ పట్టాభిషేకం.. దళపతికి ప్రధాని మోడీ స్పెషల్ సందేశం..
- Tamilanadu CM ViJay: రీల్ హీరో నుంచి రియల్ ముఖ్యమంత్రిగా విజయ్ తొలి స్పీచ్.. నాకు ఆకలి తెలుసు.. పేదరికం తెలుసు..
Read Also: MP: రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్న మహిళలు..వారిపై మొరంవేసి సజీవ సమాధికి యత్నం
ఈ వ్యాఖ్యలపై మాల్వియా ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘భారతదేశంలో ఎవరినైనా స్వాగతించే అధికారం మమతా బెనర్జీకి ఎవరు ఇచ్చారు? ఇమ్మిగ్రేషన్ మరియు పౌరసత్వం ప్రత్యేకంగా కేంద్రం పరిధిలో అంశమని, రాష్ట్రాలకు ఎలాంటి అధికారం లేదు’’ అని ట్వీట్ చేశారు. బెంగాల్ నుంచి జార్ఖండ్ వరకు అక్రమ బంగ్లాదేశీయులను స్థిరపరచడానికి ఇండియా కూటమి దుష్ట పన్నాగమని ఆరోపించారు.
ఇతర దేశాల నుంచి మత హింస నుంచి తప్పించుకుని వచ్చిన హిందూ శరణార్థులకు సీఏఏ కింద పౌరసత్వాన్ని ఇవ్వడాన్ని మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్నారని, అదే సమయంలో బంగ్లాదేశీయులను భారతదేశానికి ఆహ్వానిస్తున్నారని మాల్వియా అన్నారు. టీఎంసీకి ఓటు వేసే అక్రమ రోహింగ్యాలను రైళ్లు తగలబెట్టండి, రోడ్లు దిగ్భంధించండి, ప్రజలను చంపమని ఆమె చెబుతోందని మాల్వియా ఆరోపించారు.
Mamata Banerjee on
Odd days – We will not allow Hindu refugees, who came to India to escape religious persecution, to apply for citizenship under CAA and get their legitimate rights. If they insist, we will ask illegal Rohingyas, who vote for the TMC, to burn trains, block roads… pic.twitter.com/cSMqrkCF4M
— Amit Malviya (@amitmalviya) July 21, 2024
- Tags
- Bangladesh
- bjp
- Mamata Banerjee
తాజావార్తలు
-
IPL 2026: ఆర్సీబీకి తలనొప్పిగా మారిన ఇద్దరు స్టార్ ప్లేయర్లు.. కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యం..!
-
Elvish Yadav: ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు!
-
Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే!
-
Karuppu: ‘కరుపు’ ట్రైలర్ టైమ్ ఫిక్స్.. సూర్య ఫ్యాన్స్కు మాస్ ట్రీట్ రెడీ!
-
Sony Xperia 1 VIII: త్వరలో వస్తోన్న Sony Xperia 1 VIII.. ధర, రిలీజ్ డేట్, ఫీచర్స్