BJP: మమతా ఎవరిచ్చారు నీకు ఆ అధికారం.. ‘‘బంగ్లాదేశ్’’ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
- బంగ్లాదేశ్ ప్రజలకు బెంగాల్ అండగా నిలుస్తుందన్న మమతా బెనర్జీ..
- ఆశ్రయం కల్పిస్తామని వ్యాఖ్యలు..
- ఆ అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించిన బీజేపీ..
- అక్రమ వలసదారుల్ని ప్రోత్సహిస్తున్నారంటూ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అవుతోంది. బంగ్లాదేశ్ హింసాత్మక ఘటనల గురించి మాట్లాడుతూ, బంగ్లాదేశ్ నుంచి శరణు కోరి వచ్చే ప్రజలకు బెంగాల్ అండగా నిలుస్తుందని, వారికి ఆశ్రయం ఇస్తుందని చెప్పారు. మమతా చేసిన వ్యాఖ్యల్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఎన్నికల్లో గెలవడానికి పొరుగుదేశం నుంచి వచ్చే అక్రమ వలసదారుల్ని జార్ఖండ్ వరకు స్థిరపరిచాలని ఇండియా కూటమి చెడ్డ ప్రణాళిక అని ఆరోపించింది.
పశ్చిమ బెంగాల్ బీజేపీ కో ఇంఛార్జ్ అమిత్ మాల్వియా మమతా బెనర్జీ వ్యాఖ్యలపై ఆగ్రహ వ్యక్తం చేశారు. ఇతర దేశం నుంచి వచ్చేవారికి ఆశ్రయం కల్పించే హక్కు మమతా బెనర్జీకి ఎక్కడిదని ప్రశ్నించారు. ఇమ్మిగ్రేషన్, పౌరసత్వం పూర్తిగా కేంద్రం పరిధిలోని అంశమని, ఇలాంటి విషయాల్లో రాష్ట్రాలకు ఎలాంటి అధికారాలు లేవని చెప్పారు. కోల్కతాలో జరిగిన ర్యాలీలో బెంగాల్ సీఎం మాట్లాడుతూ.. బంగ్లాదేశ్లో పెరుగుతున్న హింస నేపథ్యంలో, పొరుగు దేశం నుండి కష్టాల్లో ఉన్న ప్రజల కోసం తన రాష్ట్ర తలుపులు తెరిచి ఉంచుతానని మరియు వారికి ఆశ్రయం కల్పిస్తానని చెప్పారు.
Also Read
- Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
Read Also: MP: రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్న మహిళలు..వారిపై మొరంవేసి సజీవ సమాధికి యత్నం
ఈ వ్యాఖ్యలపై మాల్వియా ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘భారతదేశంలో ఎవరినైనా స్వాగతించే అధికారం మమతా బెనర్జీకి ఎవరు ఇచ్చారు? ఇమ్మిగ్రేషన్ మరియు పౌరసత్వం ప్రత్యేకంగా కేంద్రం పరిధిలో అంశమని, రాష్ట్రాలకు ఎలాంటి అధికారం లేదు’’ అని ట్వీట్ చేశారు. బెంగాల్ నుంచి జార్ఖండ్ వరకు అక్రమ బంగ్లాదేశీయులను స్థిరపరచడానికి ఇండియా కూటమి దుష్ట పన్నాగమని ఆరోపించారు.
ఇతర దేశాల నుంచి మత హింస నుంచి తప్పించుకుని వచ్చిన హిందూ శరణార్థులకు సీఏఏ కింద పౌరసత్వాన్ని ఇవ్వడాన్ని మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్నారని, అదే సమయంలో బంగ్లాదేశీయులను భారతదేశానికి ఆహ్వానిస్తున్నారని మాల్వియా అన్నారు. టీఎంసీకి ఓటు వేసే అక్రమ రోహింగ్యాలను రైళ్లు తగలబెట్టండి, రోడ్లు దిగ్భంధించండి, ప్రజలను చంపమని ఆమె చెబుతోందని మాల్వియా ఆరోపించారు.
Mamata Banerjee on
Odd days – We will not allow Hindu refugees, who came to India to escape religious persecution, to apply for citizenship under CAA and get their legitimate rights. If they insist, we will ask illegal Rohingyas, who vote for the TMC, to burn trains, block roads… pic.twitter.com/cSMqrkCF4M
— Amit Malviya (@amitmalviya) July 21, 2024
- Tags
- Bangladesh
- bjp
- Mamata Banerjee
తాజావార్తలు
-
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్కు అలా కలిసి వచ్చిందా?
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
-
YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!