BJP: మమతా ఎవరిచ్చారు నీకు ఆ అధికారం.. ‘‘బంగ్లాదేశ్’’ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
- బంగ్లాదేశ్ ప్రజలకు బెంగాల్ అండగా నిలుస్తుందన్న మమతా బెనర్జీ..
- ఆశ్రయం కల్పిస్తామని వ్యాఖ్యలు..
- ఆ అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించిన బీజేపీ..
- అక్రమ వలసదారుల్ని ప్రోత్సహిస్తున్నారంటూ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అవుతోంది. బంగ్లాదేశ్ హింసాత్మక ఘటనల గురించి మాట్లాడుతూ, బంగ్లాదేశ్ నుంచి శరణు కోరి వచ్చే ప్రజలకు బెంగాల్ అండగా నిలుస్తుందని, వారికి ఆశ్రయం ఇస్తుందని చెప్పారు. మమతా చేసిన వ్యాఖ్యల్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఎన్నికల్లో గెలవడానికి పొరుగుదేశం నుంచి వచ్చే అక్రమ వలసదారుల్ని జార్ఖండ్ వరకు స్థిరపరిచాలని ఇండియా కూటమి చెడ్డ ప్రణాళిక అని ఆరోపించింది.
పశ్చిమ బెంగాల్ బీజేపీ కో ఇంఛార్జ్ అమిత్ మాల్వియా మమతా బెనర్జీ వ్యాఖ్యలపై ఆగ్రహ వ్యక్తం చేశారు. ఇతర దేశం నుంచి వచ్చేవారికి ఆశ్రయం కల్పించే హక్కు మమతా బెనర్జీకి ఎక్కడిదని ప్రశ్నించారు. ఇమ్మిగ్రేషన్, పౌరసత్వం పూర్తిగా కేంద్రం పరిధిలోని అంశమని, ఇలాంటి విషయాల్లో రాష్ట్రాలకు ఎలాంటి అధికారాలు లేవని చెప్పారు. కోల్కతాలో జరిగిన ర్యాలీలో బెంగాల్ సీఎం మాట్లాడుతూ.. బంగ్లాదేశ్లో పెరుగుతున్న హింస నేపథ్యంలో, పొరుగు దేశం నుండి కష్టాల్లో ఉన్న ప్రజల కోసం తన రాష్ట్ర తలుపులు తెరిచి ఉంచుతానని మరియు వారికి ఆశ్రయం కల్పిస్తానని చెప్పారు.
Also Read
- NEET PG 2026 Exam: నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి.. కీలక మార్గదర్శకాలు
- Mohan Bhagwat: ‘భారత్లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
Read Also: MP: రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్న మహిళలు..వారిపై మొరంవేసి సజీవ సమాధికి యత్నం
ఈ వ్యాఖ్యలపై మాల్వియా ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘భారతదేశంలో ఎవరినైనా స్వాగతించే అధికారం మమతా బెనర్జీకి ఎవరు ఇచ్చారు? ఇమ్మిగ్రేషన్ మరియు పౌరసత్వం ప్రత్యేకంగా కేంద్రం పరిధిలో అంశమని, రాష్ట్రాలకు ఎలాంటి అధికారం లేదు’’ అని ట్వీట్ చేశారు. బెంగాల్ నుంచి జార్ఖండ్ వరకు అక్రమ బంగ్లాదేశీయులను స్థిరపరచడానికి ఇండియా కూటమి దుష్ట పన్నాగమని ఆరోపించారు.
ఇతర దేశాల నుంచి మత హింస నుంచి తప్పించుకుని వచ్చిన హిందూ శరణార్థులకు సీఏఏ కింద పౌరసత్వాన్ని ఇవ్వడాన్ని మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్నారని, అదే సమయంలో బంగ్లాదేశీయులను భారతదేశానికి ఆహ్వానిస్తున్నారని మాల్వియా అన్నారు. టీఎంసీకి ఓటు వేసే అక్రమ రోహింగ్యాలను రైళ్లు తగలబెట్టండి, రోడ్లు దిగ్భంధించండి, ప్రజలను చంపమని ఆమె చెబుతోందని మాల్వియా ఆరోపించారు.
Mamata Banerjee on
Odd days – We will not allow Hindu refugees, who came to India to escape religious persecution, to apply for citizenship under CAA and get their legitimate rights. If they insist, we will ask illegal Rohingyas, who vote for the TMC, to burn trains, block roads… pic.twitter.com/cSMqrkCF4M
— Amit Malviya (@amitmalviya) July 21, 2024
- Tags
- Bangladesh
- bjp
- Mamata Banerjee
తాజావార్తలు
-
NEET PG 2026 Exam: నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి.. కీలక మార్గదర్శకాలు
-
Mohan Bhagwat: ‘భారత్లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
Bank Locker Swept: వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్.. రూ. లక్షల్లో డబ్బు.. ఎగబడిన జనం
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
NBK111 vs King100: బాలయ్య vs నాగ్.. క్రిస్మస్ బాక్సాఫీస్పై మరో బిగ్ క్లాష్!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!