MP: రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్న మహిళలు..వారిపై మొరంవేసి సజీవ సమాధికి యత్నం
- ప్రైవేటు స్థలంలో రోడ్డు నిర్మాణానికి పూనుకున్న రౌడీలు
- అడ్డుకునేందుకు యత్నించిన భూ యజమానులైన ఇద్దరు మహిళలు
- మహిళలపై డంపర్ తో మొరం గుమ్మరించి సజీవా సమాధికి యత్నిం
- గమనించిన చుట్టుపక్కల జనం
- మొరంలో కూరుకున్న వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవాలో ప్రైవేట్ భూమిలో బలవంతంగా రహదారిని నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ ఇద్దరు మహిళలను రౌడీలు సజీవ సమాధి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమీపంలోని వ్యక్తులు సహాయం చేయడానికి పరిగెత్తారు. వారిద్దరి మీద పడిన మట్టిని తొలగించి బయటకు తీశారు. వారిని ఆస్పత్రికి తరలించారు.
READ MORE: Ajit Pawar: మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో ఎన్సీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది..
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
ఈ ఘటన రేవా జిల్లా మంగవాన్ పోలీస్ స్టేషన్ పరిధి.. గగేవ్ ఔట్పోస్టు పరిధిలోని హినౌతా జోరౌట్ గ్రామంలో చోటుచేసుకుంది. ఇక్కడ కొందరు రౌడీలు ప్రైవేటు భూమిలో బలవంతంగా రోడ్డు నిర్మిస్తున్నారు. నిర్మాణ పనుల్లో ఒక జేసీబీ, రెండు టిప్పర్లు వినియోగించి ప్రైవేటు స్థలంలో మొరం వేస్తున్నారు. భూ యజమానులైన మమతా పాండే, ఆశా పాండే ఈ విషయాన్ని వ్యతిరేకించడం ప్రారంభించారు. ప్రైవేట్ భూమిలో రోడ్డు వేయడాన్ని నిరసిస్తూ ఇద్దరు మహిళలు రోడ్డు నిర్మాణ స్థలం వద్ద నిలబడి నిరసన తెలిపారు. అప్పుడు డంపర్ డ్రైవర్ ఈ మహిళలపై మొరాన్ని గుమ్మరించాడు. మహిళలు ఒక్కసారిగా మొరంలో కూరుకుపోయారు. సమీపంలో ఉన్న వ్యక్తులు వెంటనే మట్టిని తొలగించి లోపల నుంచి మహిళలను బయటకు తీసి చికిత్స కోసం గంగేవ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తీసుకెళ్లారు. మహిళలకు ప్రథమ చికిత్స చేశారు వైద్యులు. మట్టిలో కూరుకున్న వారిని సరైన సమయంలో బయటకు తీయకుంటే ప్రాణాలు పోయేవని ప్రజలు వాపోయారు. మంగవా పోలీస్ స్టేషన్ పరిధిలోని హినోటా జోరోట్ గ్రామంలో శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.
⚠️ ये भयावह वीडियो आपकी रूह कंपा देगा,
लेकिन मध्यप्रदेश की भाजपा सरकार, राष्ट्रीय महिला आयोग, प्रधानमंत्री, गृहमंत्री, महिला बाल विकास मंत्री इत्यादि की चुप्पी भी नही तुड़वा सकता।
रीवा में दो महिलाओं को निजी जमीन पर सड़क बनाने का विरोध करने पर दबंगों ने जिंदा जमीन में गाड़ा.. pic.twitter.com/a7AZujcwmU
— Srinivas BV (@srinivasiyc) July 21, 2024
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!