MP: రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్న మహిళలు..వారిపై మొరంవేసి సజీవ సమాధికి యత్నం
- ప్రైవేటు స్థలంలో రోడ్డు నిర్మాణానికి పూనుకున్న రౌడీలు
- అడ్డుకునేందుకు యత్నించిన భూ యజమానులైన ఇద్దరు మహిళలు
- మహిళలపై డంపర్ తో మొరం గుమ్మరించి సజీవా సమాధికి యత్నిం
- గమనించిన చుట్టుపక్కల జనం
- మొరంలో కూరుకున్న వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవాలో ప్రైవేట్ భూమిలో బలవంతంగా రహదారిని నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ ఇద్దరు మహిళలను రౌడీలు సజీవ సమాధి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమీపంలోని వ్యక్తులు సహాయం చేయడానికి పరిగెత్తారు. వారిద్దరి మీద పడిన మట్టిని తొలగించి బయటకు తీశారు. వారిని ఆస్పత్రికి తరలించారు.
READ MORE: Ajit Pawar: మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో ఎన్సీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది..
Also Read
- CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
- CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
- 600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
- Raj Kachori Recipe: ఇంట్లోనే హల్వాయి స్టైల్ రాజ్ కచోరీ.. కరకరలాడే రుచితో నోరూరించే స్పెషల్ చాట్!
ఈ ఘటన రేవా జిల్లా మంగవాన్ పోలీస్ స్టేషన్ పరిధి.. గగేవ్ ఔట్పోస్టు పరిధిలోని హినౌతా జోరౌట్ గ్రామంలో చోటుచేసుకుంది. ఇక్కడ కొందరు రౌడీలు ప్రైవేటు భూమిలో బలవంతంగా రోడ్డు నిర్మిస్తున్నారు. నిర్మాణ పనుల్లో ఒక జేసీబీ, రెండు టిప్పర్లు వినియోగించి ప్రైవేటు స్థలంలో మొరం వేస్తున్నారు. భూ యజమానులైన మమతా పాండే, ఆశా పాండే ఈ విషయాన్ని వ్యతిరేకించడం ప్రారంభించారు. ప్రైవేట్ భూమిలో రోడ్డు వేయడాన్ని నిరసిస్తూ ఇద్దరు మహిళలు రోడ్డు నిర్మాణ స్థలం వద్ద నిలబడి నిరసన తెలిపారు. అప్పుడు డంపర్ డ్రైవర్ ఈ మహిళలపై మొరాన్ని గుమ్మరించాడు. మహిళలు ఒక్కసారిగా మొరంలో కూరుకుపోయారు. సమీపంలో ఉన్న వ్యక్తులు వెంటనే మట్టిని తొలగించి లోపల నుంచి మహిళలను బయటకు తీసి చికిత్స కోసం గంగేవ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తీసుకెళ్లారు. మహిళలకు ప్రథమ చికిత్స చేశారు వైద్యులు. మట్టిలో కూరుకున్న వారిని సరైన సమయంలో బయటకు తీయకుంటే ప్రాణాలు పోయేవని ప్రజలు వాపోయారు. మంగవా పోలీస్ స్టేషన్ పరిధిలోని హినోటా జోరోట్ గ్రామంలో శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.
⚠️ ये भयावह वीडियो आपकी रूह कंपा देगा,
लेकिन मध्यप्रदेश की भाजपा सरकार, राष्ट्रीय महिला आयोग, प्रधानमंत्री, गृहमंत्री, महिला बाल विकास मंत्री इत्यादि की चुप्पी भी नही तुड़वा सकता।
रीवा में दो महिलाओं को निजी जमीन पर सड़क बनाने का विरोध करने पर दबंगों ने जिंदा जमीन में गाड़ा.. pic.twitter.com/a7AZujcwmU
— Srinivas BV (@srinivasiyc) July 21, 2024
తాజావార్తలు
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
-
CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..