BJP: ప్రధానిని విమర్శించిన బీజేపీ మైనారిటీ మోర్చా నేతపై వేటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: కాంగ్రెస్ మేనిఫెస్టో, రాహుల్ గాంధీ చేసిన ‘సంపద పునర్విభజన’ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గత ఆదివారం రాజస్థాన్ బన్స్వారాలో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. ‘‘ మన సంపదను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చొరబాటుదారులు, పిల్లలు ఎక్కువ ఉన్నవారికి ఇవ్వాలని చూస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. దీంతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలో ఈ దేశ సంపదపై తొలి హక్కు ముస్లింలకే ఉందనే వ్యాఖ్యల్ని మోడీ ప్రస్తావించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మన తల్లలు, సోదరీమణుల మంగళసూత్రాలు, బంగారాన్ని కూడా లాక్కుంటుందని వ్యాఖ్యానించారు.
Read Also: Heatwave effect: బీహార్లో పోలింగ్ సమయం పెంచిన ఈసీ.. ఎన్ని గంటలంటే..!
Also Read
- EPFO కొత్త రూల్ .. PF డిపాజిట్పై కీలక మార్పు.. ఎవరికి లాభం?
- PM Narendra Modi: అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. భక్తులకు ప్రధాని మోడీ లేఖ, ఐదు సంకల్పాలకు పిలుపు
- Siya Goyal: పూణే లోహగడ్ కోట హ*త్య కేసు.. మీడియాకు మిడిల్ ఫింగర్ చూపించిన సియా గోయల్.. వీడియో వైరల్
- Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
దీనిపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు ఎక్కుపెట్టారు. మోడీ ముస్లింలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై రాజస్థాన్ బికనీర్కి చెందిన మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఉస్మాన్ ఘనీ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ వ్యాఖ్యల్ని విమర్శించారు. అయితే, ప్రధానిపై విమర్శలు చేసిన అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇటీవల న్యూఢిల్లీలో ఒక న్యూస్ ఛానెల్తో మాట్లాడిన ఘనీ, రాజస్థాన్లోని 25 సీట్లలో బిజెపి మూడు-నాలుగు లోక్సభ స్థానాలను కోల్పోతుందని అన్నారు.
ఎన్నికల ర్యాలీలో ప్రధాని చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. ముస్లింల సంబంధించి ప్రధాని మోదీ వ్యాఖ్యల గురించి అడిగినప్పుడు, ఘనీ మాట్లాడుతూ, ముస్లిం అయినందున, ప్రధాని చెప్పినదానిపై నిరాశ చెందానని చెప్పారు. తాను బీజేపీ తరుపున ఓట్లు అడిగేందుకు వెళ్లినప్పుడు ముస్లిం ప్రశ్నిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో బీజేపీపై జాట్ సామాజిక వర్గం ఆగ్రహంగా ఉందని, చురు తదితర ప్రాంతాల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటేశారని చెప్పారు. తాను మాట్లాడిన మాటలపై పార్టీ చర్యలు తీసుకుంటే భయపడేది లేదని చెప్పారు. దీనిపై బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ ఓంకార్ సింగ్ లఖావత్ మాట్లాడుతూ.. ఘనీ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడారని అన్నారు. అతని ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసి, ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Hyderabad: ఘట్కేసర్లో విషాదం.. రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య!
-
EPFO కొత్త రూల్ .. PF డిపాజిట్పై కీలక మార్పు.. ఎవరికి లాభం?
-
Jupally Krishna Rao: “లెక్క తప్పు ఐతే రాజీనామా చేస్తా”.. కేసీఆర్, కేటీఆర్లకు మంత్రి జూపల్లి సవాల్!
-
Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీటీవీ హార్డ్డిస్క్లు మార్చారా..?
-
Akhil Akkineni : సమంత ‘మా ఇంటి బంగారం’పై అఖిల్ షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!