BJP: అధిష్టానం తీవ్ర కసరత్తు.. సీఎంల ఎంపికపై సస్పెన్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో సత్తా చాటింది భారతీయ జనతా పార్టీ.. ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం తొందరపడటం లేదు. యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్లో బీజేపీకి పూర్తి మెజార్టీ వచ్చింది. గోవాలో ఒక్క సీటు తక్కువైనా.. మద్దతు ఇచ్చేందుకు స్వతంత్రులు, ఎంజీపీ రెడీగా ఉంది. ప్రభుత్వ ఏర్పాటులో ఎలాంటి సమస్యలు లేకపోయినా.. ఢిల్లీలోని బీజేపీ పెద్దలు మాత్రం.. చాలా కసరత్తే చేస్తున్నారు. గతంలో కేంద్ర కేబినెట్ కోసం ఎంత వర్కవుట్ చేశారో.. ఇప్పుడు అదే స్థాయిలో లెక్కలు వేసుకుంటున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని.. యూపీలోని అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం ఉండేలా మంత్రుల్ని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఆదివారం మోడీతో యోగి ఆధిత్యనాధ్ భేటీతో మొదలైన కసరత్తు.. సోమవారం 4 గంటలపాటు, మంగళవారం 3 గంటలపాటు కొనసాగింది. అమిత్షా, నడ్డా, బీఎల్ సంతోష్.. నిన్న మోడీ నివాసంలో భేటీయై యూపీ కేబినెట్ పై చర్చలు జరిపారు. ఇవాళ యోగితో కలిసి కేబినెట్ కూర్పును ఒక కొలిక్కి తెచ్చే అవకాశం ఉంది.
Read Also: Virat Kohli: రన్ మెషిన్కు ఏమైంది..?
Also Read
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ఇక, యూపీలో కేబినెట్ కూర్పుపై చర్చలు జరగుతుండగా.. గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ఎవరిని సీఎంలను చేస్తారనే సస్పెన్స్ కొనసాగుతోంది. గోవాలో సావంత్కు లైన్ క్లియర్గా ఉన్నప్పటికీ.. బీజేపీ పెద్దల మనసులో ఏముందో చివరివరకు చెప్పడం కష్టమంటున్నారు. ఇక మణిపూర్లో తొలిసారి పూర్తి మెజార్టీ సాధించిన బీజేపీ.. మళ్లీ బీరెన్ సింగ్నే ముఖ్యమంత్రిగా చేస్తుందో, లేదో చూడాలి. ఇక ఉత్తరాఖండ్లో సీఎం ఓటమిపాలు కావడంతో.. అక్కడ ముఖ్యమంత్రి రేసులో ఆరుగురి వరకు పోటీలో ఉన్నారు. ఇప్పటికే నాలుగు రాష్ట్రాలకు పరిశీలకుల్ని నియమించిన బీజేపీ.. ఢిల్లీలో కసరత్తు కొనసాగిస్తోంది. సీఎంలు, మంత్రుల లిస్ట్ ప్రిపరేషన్స్ పూర్తికాగానే.. పరిశీలకులతో ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ చేయనున్నారు బీజేపీ పెద్దలు.
తాజావార్తలు
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..