Mehbooba Mufti: జీ 20ని బీజేపీ హైజాక్ చేసింది.. ఆర్టికల్ 370 తెచ్చేవరకు పోటీ చేయను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mehbooba Mufti: జీ 20 దేశానికి సంబంధించిన కార్యక్రమం అని.. కానీ బీజేపీ దాన్ని హైజాక్ చేసిందని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ బెంగళూర్ లో ఆరోపించారు. జీ 20ని వ్యతిరేకించడం లేదని, కానీ బీజేపీ హైజాక్ చేసిందని అన్నారు. చివరకు జీ 20 లోగోను కూడా కమలంగా మార్చిందని ఆమె విమర్శించారు. లోగో దేశానికి చెందినదిగా ఉండాలని, పార్టీకి సంబంధించిన విధంగా ఉండకూడదని ఆమె అన్నారు.
Read Also: G20: కాశ్మీర్లో జీ 20 సమావేశం.. 26/11 తరహా టెర్రర్ అటాక్స్కి కుట్ర.. పాకిస్తాన్ పన్నాగం
Also Read
- Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
ప్రస్తుతం కాశ్మీర్ లో ఇళ్లను తీసుకుంటున్నారు, విపరీతంగా సెక్యురిటీని పెంచారని, ప్రతీ చోట తనఖీలు జరుగుతున్నాయని అన్నారు. కాశ్మీర్ సమస్యలు ఈ రీజియన్ కు సంబంధించినవని, సార్క్ కూటమి ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. జీ 20ని బీజేపీ పబ్లిసిటీకి ఉపయోగించుకుంటుందని విమర్శించారు. విశ్వగురు కావాలంటే ముందుగా ఈ సౌత్ ఏషియా రీజియన్ లో గురుగా ఆవిర్భించాలని బీజేపీకి సూచించింది.
జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని తిరిగి తీసుకు వచ్చే వరకు తాను ఎన్నికల్లో పోటీ చేయనని మహబూబా ముఫ్తి స్పష్టం చేశారు. సమీప భవిష్యత్తులో జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరగకపోవచ్చని ఆమె అన్నారు. భారతదేశ మనుగడ కోసం ఇతర పార్టీలతో పోలిస్తే.. కాంగ్రెస్ పార్టీపై అతిపెద్ద బాధ్యత ఉందని ఆమె అన్నారు. ఈ నెల 22 నుంచి 24 వరకు మూడు రోజుల పాటు శ్రీనగర్ లో జీ 20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశానికి 60కి పైగా విదేశీ ప్రముఖులు హాజరవుతున్నారు. దీని కోసం భారత ప్రభుత్వం కాశ్మీర్ లోయ అంతటా భద్రతను కట్టుదిట్టం చేసింది.
తాజావార్తలు
-
Article 370: రెండు జాతీయ అవార్డులు గెలిచిన ‘ఆర్టికల్ 370’.. ఏ ఓటీటీలో చూడొచ్చో తెలుసా?
-
Sharwanand : మహాభారతం నేపథ్యంలో నాగబంధం దర్శకుడితో శర్వానంద్..
-
Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
-
Suriya : ఎక్స్పరిమెంట్స్ వద్దు.. రొటీన్ కమర్షియల్ సినిమాలే ముద్దంటున్న సూర్య
-
Fahadh Faasil: టామ్ క్రూజ్ సినిమాను వదులుకున్న ఫహద్ ఫాసిల్.. కారణం తెలిస్తే షాకవుతారు!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!