Maharashtra: ఎలక్షన్ రిజల్ట్స్కి ముందు బీజేపీకి ఎదురుదెబ్బ.. ఉద్ధవ్ సేనలో చేరిన కీలక నేత..
- ఎలక్షన్ రిజల్ట్స్ ముందు బీజేపీకి ఎదురుదెబ్బ..
- ఉద్ధవ్ సేనలోకి ముంబై బీజేపీ నేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: శనివారంతో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది ఏ పార్టీనో స్పష్టత రానుంది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలకు ముందు ఆ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీకి చెందిన కీలక నేత ఉద్ధవ్ ఠాక్రే శివసేనలో చేరారు. ముంబై బీజేపీ కార్యదర్శి, మహిమ్కి చెందిన సీనియర్ నేత సచిన్ షిండే, ఠాక్రే నేతృత్వంలోని శివసేన(యూబీటీ)లో చేరారు. ఇది బీజేపీ ఊహించని షాక్గా చెప్పవచ్చు. షిండే తన మద్దతుదారులతో కలిసి ఠాక్రే నివాసం మాతోశ్రీలో పార్టీలో చేరారు.
Read Also: US: యూఎస్ బీచ్లో అరుదైన ఫిష్ గుర్తింపు.. భారీ విపత్తుకు సిగ్నలా..!?
Also Read
- West Bengal: జంతర్ మంతర్ వద్ద ఘర్షణలకు పాకిస్థాన్ టెర్రరిస్ట్ ప్లాన్.. పోలీసు యూనిఫామ్లతో విధ్వంసానికి స్కెచ్..
- Uttar Pradesh: పదేళ్ల ప్రేమకథ.. హిందూ ప్రేమికుడిని పెళ్లి చేసుకున్న ముస్లిం యువతి..
- Baramulla Terrorist Arrested: బారాముల్లాలో ఉగ్రవాది అరెస్ట్.. ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
- PM Modi: డ్రగ్స్కు దూరంగా యువత.. వికసిత్ భారత్కు అదే కీలకం.. ‘నశా ముక్త్ యువ’ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
షిండే మణికట్టుకు సంప్రదాయ ‘‘శివబంధన్’’ని కట్టి ఠాక్రే పార్టీలోకి స్వాగతించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహిమ్ అసెంబ్లీ స్థానంలో త్రిముఖ పోరు నెలకొంది. రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) ఆయన కుమారుడు అమిత్ ఠాక్రేను ఈ స్థానం నుంచి అభ్యర్థిగా నిలిపింది. ఉద్ధవ్ ఠాక్రే యొక్క శివసేన (UBT) మహేష్ బలిరామ్ సావంత్ను తమ అభ్యర్థిగా దింపింది. ఏక్ నాథ్ షిండే శివసేన సిట్టింగ్ ఎమ్మెల్యే సదరా సర్వాంకర్ని నిలబెట్టింది.
288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న ఎన్నికలు జరిగాయి. శనివారం ఫలితలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీలు ‘మహాయుతి’ కూటమిగా, మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఉద్ధవ్ సేన, శరద్ పవార్ ఎన్సీపీలు ‘‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)’’ కూటమిగా పోటీ చేశాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. మహాయుతి విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Instagram Reel: ఇంద్రకీలాద్రిపై ఇన్స్టాగ్రామ్ రీల్ వివాదం.. పోలీసులకు దేవస్థానం ఫిర్యాదు..
-
Abhishek Sharma: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకు.. 91 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి..
-
Salman Khan: రూ.120 కోట్ల నుంచి రూ.70 కోట్లకు సల్మాన్ పారితోషికం.. అసలు కారణం ఇదేనా?
-
Tirumala Laddu: 311 ఏళ్లు పూర్తి చేసుకున్న తిరుమల శ్రీవారి లడ్డూ..!
-
Jofra Archer: “ఇంత డేంజర్గా ఉన్నావేంట్రా స్వామీ”.. 20 బంతుల్లో 11 డాట్ బాల్స్, 4 వికెట్లు..
ట్రెండింగ్
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!